Political News

గొడ్డలి పార్టీ నెవర్ అగైన్: చంద్రబాబు

ఈ రోజు నుంచి రెండు రోజుల పాటు టీడీపీ మహానాడు కార్యక్రమం మంగళగిరిలో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది హైబ్రిడ్ విధానంలో మహానాడు జరుగుతోంది. ఈ క్రమంలోనే తొలి రోజు మహానాడులో ప్రారంభోపన్యాసం చేసిన టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది వాహనాల హోరు తగ్గిందని…కానీ, టీడీపీ కార్యకర్తల్లో జోష్ తగ్గలేదని చంద్రబాబు అన్నారు. అయితే, మహానాడు నుంచి ప్రజల దృష్టిని డైవర్ట్ చేసేందుకు వైసీపీ ఏదో ప్రెస్ మీట్ పెట్టిందని విమర్శించారు.

గొడ్డలి పార్టీని అడ్డుకోవాలని ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధిపై గొడ్డలి వేటు వేసిన వైసీపీ వల్ల జరిగిన నష్టాన్ని ప్రజలకు వివరించాలన్నారు. పేదలకు కావాల్సింది సంక్షేమ పథకాలు అని.. గొడ్డలి వేట్లు కాదని… యువతకు కావాల్సింది ఉద్యోగాలని… గొడ్డలి పోట్లు కాదని అన్నారు. రాష్ట్రానికి కావాల్సింది శాంతి భద్రతలని.. జంతు బలులు కాదని చెప్పారు. రక్త చరిత్ర రాసేవారు.. స్వర్ణాంధ్ర చరిత్రను లిఖించలేరని తెలిపారు. అందుకే గొడ్డలి పార్టీ నెవర్ అగైన్ అంటూ సరికొత్త నినాదంతో చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లారు.

అంతేకాదు, పార్ట్ టైం పాలిటిక్స్ వద్దని చంద్రబాబు హితవు పలికారు. అహంకారం, ఇగోలకు పోవద్దని అన్నారు. అధికారం శాశ్వతం కాదని, ప్రజాసంబంధాలే ముఖ్యమని, అవే మనకు శ్రీరామరక్ష అని అన్నారు. ప్రతి నాయకుడు, కార్యకర్త…ప్రజలతో మమేకం కావాలని చెప్పారు. స్వర్ణాంధ్ర 2047..హెల్తీ వెల్తీ హ్యాపీ ఏపీ మన లక్ష్యం అని చంద్రబాబు టీడీపీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

This post was last modified on May 27, 2026 12:33 pm

Share

Recent Posts

పైరసీ రూపంలో కొత్త తలనెప్పి

ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…

21 seconds ago

పోలీస్ దుస్తుల్లో సూర్య షాకింగ్ ట్విస్టు

కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన…

44 minutes ago

రవితేజ విజయాలకు ‘గట్టిముడి’ పడాలి

ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…

1 hour ago

పోటీకి సిద్ధంకండి… పొత్తు సంగతి నేను చూసుకుంటాను

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…

3 hours ago

తిరుమలలో ‘రోబోట్‌ డాగ్‌’… వాటి కదలికలపై నిఘా!

తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…

4 hours ago

అప్పట్లో చిరు ఏడాదికి నాలుగు సినిమాలు చేసినా గొడవే

ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్‌ను పక్కన పెడితే.. అల్లు…

11 hours ago