ఈ రోజు నుంచి రెండు రోజుల పాటు టీడీపీ మహానాడు కార్యక్రమం మంగళగిరిలో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది హైబ్రిడ్ విధానంలో మహానాడు జరుగుతోంది. ఈ క్రమంలోనే తొలి రోజు మహానాడులో ప్రారంభోపన్యాసం చేసిన టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది వాహనాల హోరు తగ్గిందని…కానీ, టీడీపీ కార్యకర్తల్లో జోష్ తగ్గలేదని చంద్రబాబు అన్నారు. అయితే, మహానాడు నుంచి ప్రజల దృష్టిని డైవర్ట్ చేసేందుకు వైసీపీ ఏదో ప్రెస్ మీట్ పెట్టిందని విమర్శించారు.
గొడ్డలి పార్టీని అడ్డుకోవాలని ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధిపై గొడ్డలి వేటు వేసిన వైసీపీ వల్ల జరిగిన నష్టాన్ని ప్రజలకు వివరించాలన్నారు. పేదలకు కావాల్సింది సంక్షేమ పథకాలు అని.. గొడ్డలి వేట్లు కాదని… యువతకు కావాల్సింది ఉద్యోగాలని… గొడ్డలి పోట్లు కాదని అన్నారు. రాష్ట్రానికి కావాల్సింది శాంతి భద్రతలని.. జంతు బలులు కాదని చెప్పారు. రక్త చరిత్ర రాసేవారు.. స్వర్ణాంధ్ర చరిత్రను లిఖించలేరని తెలిపారు. అందుకే గొడ్డలి పార్టీ నెవర్ అగైన్ అంటూ సరికొత్త నినాదంతో చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లారు.
అంతేకాదు, పార్ట్ టైం పాలిటిక్స్ వద్దని చంద్రబాబు హితవు పలికారు. అహంకారం, ఇగోలకు పోవద్దని అన్నారు. అధికారం శాశ్వతం కాదని, ప్రజాసంబంధాలే ముఖ్యమని, అవే మనకు శ్రీరామరక్ష అని అన్నారు. ప్రతి నాయకుడు, కార్యకర్త…ప్రజలతో మమేకం కావాలని చెప్పారు. స్వర్ణాంధ్ర 2047..హెల్తీ వెల్తీ హ్యాపీ ఏపీ మన లక్ష్యం అని చంద్రబాబు టీడీపీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
This post was last modified on May 27, 2026 12:33 pm
గత రెండు మూడు రోజులుగా మహేష్ బాబు గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. జయకృష్ణ తొలి సినిమ…
గత కొన్ని వారాలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పెద్ది తెలుగు రాష్ట్రాల్లో బాగా ఆడితే…
కార్తీ కెరీర్ బెస్ట్ హిట్స్ గా చెప్పుకునే సినిమాల్లో ఖైదీ, నా పేరు శివ తర్వాత సర్దార్ ఉంటుంది. తెలుగులోనూ…
ఎన్నడూ లేని విధంగా ఈ మధ్య టాలీవుడ్ స్టార్లు ఒకరి తర్వాత ఒకరు గాయపడడం ఆందోళనకరంగా మారిన సంగతి తెలిసిందే.…
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణా రెడ్డి వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఆ తర్వాత…
మానవ చరిత్రలో కల్లా అత్యంత గొప్ప కథ.. నిన్నటి ‘రామాయణం’ ట్రైలర్లో మేకర్స్ ఈ కథకు ఇచ్చిన ట్యాగ్ లైన్. రామాయణ…