బలమైన మూడు నియోజకవర్గాలలో వైసీపీ జెండా ఎగరడం లేదా? అసలు ఆరెండు స్థానాలను కీలకంగా తీసుకుని వైసీపీ చేసిన ప్రయత్నాలు, ప్రయోగాలు ఫలించడం లేదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. ఆ మూడు నియోజకవర్గాలు గెలిస్తే.. చాలా పెద్ద ఎత్తున విజయం దక్కించుకున్నట్టేనన్న అభిప్రాయం పార్టీవర్గాల్లో ఉండేది. కానీ, గత ఎన్నికల్లో ఆ మూడు చోట్లా పరాజయం పాలయ్యారు. పోనీ.. ఇప్పుడైనాపట్టు బిగించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారా? అంటే.. లేదనే సమాధానమే వినిపిస్తోంది.
1) కుప్పం: సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. ఇక్కడ వైసీపీ పెద్ద ఎత్తున అధికారంలో ఉన్నప్పుడు.. గెలుపు గుర్రం ఎక్కేందుకు ప్రయత్నించింది. ప్రత్యర్థి నాయకుడి నియోజకవర్గమే అయినా.. వైసీపీ హయాంలో రాష్ట్రంలో ఏనియోజకవర్గంలోనూ జరగని అభివృద్ధి చేశారు. ఏకంగా ఎంపీ, మంత్రులు ఇక్కడే తిష్ఠ వేసి.. అప్పట్లో రాజకీయాలు చేశారు. కానీ, పలితం దక్కలేదు. పైగా.. గత ఎన్నికల్లో ఓడిపోయిన భరత్.. ఇప్పటి వరకు అజా లేకుండా పోయారు. ప్రస్తుతం ఇక్కడ జెండా కట్టేవారే కరువయ్యారు.
2) మంగళగిరి: ఇది కూడా వైసీపీకి అత్యంత కీలకమైన నియోజకవర్గం. మంత్రినారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో ఆయనను ఓడించాలని 2024 ఎన్నికల్లో చేయని ప్రయత్నం, ప్రయోగం లేదు. కానీ, నారా నందమూరి ఫ్యామిలీలు..ఇక్కడ పెద్ద ఎత్తున ఇంటింటికీ తిరగడం, వైసీపీలో పుట్టిన ముసలం కారణంగా.. పార్టీ వోడిపోయింది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే.. వైసీపీలో ఉన్న మాజీ మంత్రి ఒకరు టీడీపీకి అనుకూలంగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన నాయకురాలు కూడా కనిపించడం లేదు.
3) పిఠాపురం: జనసేన అధినేత డిప్యూటీ సీఎంపవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. ఇక్కడ కూడా.. విజయం సాధించి.. పవన్ను మరోసారి ఓడించాలని గత ఎన్నికల సమయంలో వైసీపీ చేసిన ప్రయత్నాలు .. విఫలమయ్యాయి. వంగా గీతావిశ్వనాథ్ను తీసుకువచ్చి.. ఇక్కడ నిలబెట్టినా ప్రయోజనం లేకుండా పోయింది. ప్రస్తుతం ఇక్కడ కూడా.. వైసీపీ జాడలు కనిపించడం లేదు. గత ఎన్నికల సమయంలో పార్టీలో ఉన్న కీలక నేత.. దొరబాబు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. దీంతో వైసీపీ తరఫున వాయిస్ వినిపించేవారు.. కనిపించేవారు కూడా కరువయ్యారు.
This post was last modified on May 27, 2026 5:04 am
‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…
ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…