కాలిఫోర్నియాలో కరోనా వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత కూడా ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకటం సంచలనంగా మారింది. కాలిఫోర్నియాలోని రెండు ఆసుపత్రుల్లో డబ్య్లూ. మాథ్యూస్ నర్సుగా పని చేస్తున్నారు. డిసెంబర్ 18వ తేదీన మాథ్యూస్ కరోనా వ్యాక్సినేషన్ లో భాగంగా మొదటి డోసు తీసుకున్నారు. టీకా వేయించుకున్న చేతిపై కాస్త ఎర్రగా అవటం తప్ప మరే సమస్య ఎదురుకాలేదని అనుకున్నారు.
అయితే టీకా వేయించుకున్న ఆరు రోజులకు సరిగ్గా క్రిస్తిమస్ రోజుకు ముందు మథ్యూస్ కు చలి, జ్వరం, ఒళ్ళునొప్పులు మొదలయ్యాయి. ఇది మామూలు జ్వరమే అనుకున్నారు. అయితే సమస్య పెరిగిపోవటంతో మాథ్యూస్ అనుమానంతో వెంటనే ఆసుపత్రికి వెళ్ళి రక్త పరీక్షతో పాటు కరోనా వైరస్ నిర్ధారిత పరీక్షలు కూడా చేయించుకున్నారు.
పరీక్షల్లో వచ్చిన రిజల్టు చూసి ఆశ్చర్యపోయారు. తనకు కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. కరోనా వ్యాక్సినేషన్ వేయించుకున్న తర్వాత కూడా తనకు కరోనా సోకిందని రిజల్టు రావటంతో మాథ్యూస్ నమ్మలేకపోతున్నారు. అయితే ఇదే విషయంపై ఓ వైద్య నిపుణుడు మాట్లాడుతు కరోనా వ్యాక్సినేషన్ వేయించుకున్నా కరోనా వైరస్ సోకటంలో ఆశ్చర్యపోవాల్సింది లేదన్నారు.
క్లినికల్ ట్రయల్స్ లో తేలిన ప్రకారం వ్యాక్సినేషన్ వేయించుకున్న 10 నుండి 14 రోజుల తర్వాతే రోగిలో రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు. తొలి డోసు తీసుకున్న తర్వాత మనలో రోగనిరోధక శక్తి 50 శాతం పెరుగుతుందట. రెండో దశ వ్యాక్సినేషన్ తర్వాత రోగనిరోధకశక్తి 95 శాతానికి పెరుగుతుందని వైద్య నిపుణుడు చెప్పారు. కరోనా టీకా వేయించుకున్నా భౌతిక దూరం పాటించటం, మాస్కు వేసుకోవటం తప్పనిసరిగా వైద్యులు చెబుతున్నారు. దీంతో కరోనా టీకా వేయించుకున్నాం కదాని ధైర్యంగా ఎక్కడపడితే అక్కడ తిరిగేస్తే ప్రమాదం పొంచిఉంటుందన్న విషయం మరచిపోకూడదు.
This post was last modified on December 31, 2020 6:48 pm
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్కు భారీ షాక్ తగిలింది. ప్రస్తుతం బీఆర్ ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దండే విఠల్రావు…