మాజీ మంత్రి, జనసేన నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీలో తాను ఎలాంటి పదవులూ ఆశించడం లేదన్నారు. తాను ఎన్నికల తర్వాత.. పార్టీలో చేరానని.. ఇంత స్వల్ప సమయానికే పదవులు ఆశించే పరిస్థితి లేదన్నారు. తాను పార్టీలో కొనసాగాలని అనుకుంటున్నట్టు చెప్పారు. సభ్యత్వం వరకు తాను సంతృప్తి చెందుతానని చెప్పారు.
ఈ సందర్భంగా జగన్పైనా బాలినేని కీలక వ్యాఖ్యలు చేశారు. మావిగన్ అనే ప్రతిపాదనను కేవలం ప్రజల దృష్టి మళ్లించే డైవర్షన్ పాలిటిక్స్గా అభివర్ణించారు. అధికారంలో ఉన్నప్పుడు.. భజన చేసేవారిని.. పొగిడేవారిని మాత్రమే జగన్ తన చుట్టూ తిప్పుకొన్నారని.. మంచి చెప్పిన తనను పట్టించుకోలేదన్నారు. ఎన్నికలకుముందు కూడా.. తాను అనేక సూచనలు చేశానని.. ఒక్కటి కూడా పట్టించుకోక పోవడం వల్లే తాను ఓడిపోయి.. మమ్మల్ని కూడా ఓడించారని వ్యాఖ్యానించారు.
విశాఖతోపాటు మూడు రాజధానుల ప్రతిపాదన చేసిన సమయంలో.. అలా చేయొద్దని తాను పదే పదే చెప్పినట్టు పేర్కొన్నారు. గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ సమీపంలో రాజధానిని ఏర్పాటు చేయాలని తాను సజ్జల రామకృష్నారెడ్డి ద్వారా సూచించానన్నారు. కానీ.. తన మాటను పెడచెవిన పెట్టారని అన్నారు. అప్పుడే నాగార్జున యూనివర్సిటీ దగ్గర రాజధానిని ప్రకటించి ఉంటే.. అటు కృష్నా, ఇటు గుంటూరు ప్రజలు కూడా యాక్సప్ట్ చేసేవారని.. కానీ, జగన్ భజన పరుల మాటలే విన్నారని తెలిపారు.
మా అబ్బాయిపై..
తన కుమారుడిపై.. అనేక విమర్శలు చేస్తున్నారని బాలినేని చెప్పారు. ఎన్నికలకు ముందు.. తర్వాత కూడా.. తన కుమారుడిని లక్ష్యంగా చేసుకుని అనేక ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. అయితే.. వాటిపై ఇప్పటికైనా విచారణకు ఆదేశించాలని సీఎం చంద్రబాబుకు స్వయంగా తానే లేఖరాశానన్నారు. విచారణకు ఇప్పటికైనా.. తాము సిద్ధమేనన్నారు.
నాకు మొహమాటం లేదు..
తనకు మొహమాటం లేదని బాలినేని చెప్పారు. రాజకీయాల్లో అధినేత బాగుంటేనే తామంతా బాగుంటామన్న సిద్ధాంతాన్ని తాము నమ్ముతానని పేర్కొన్నారు. గతంలో వైసీపీలో ఉన్నప్పుడు.. కూడా ఇదే సూత్రాన్ని పాటించానన్నారు. కానీ, నాడు మంచి చెప్పినా.. వినిపించుకోలేదన్నారు. ఇప్పుడు జనసేనలోనూ.. తను అదే ఫార్ములాను పాటిస్తున్నట్టు తెలిపారు. ఉన్నది ఉన్నట్టు చెబుతున్నానన్నారు. అధినేత మెప్పుకోసం ఏ నాడూ తాను పాకులాడలేదన్నారు. పదవుల కోసం కూడా.. ఎదురు చూడలేదన్నారు.
This post was last modified on May 21, 2026 9:21 pm
కూటమిలో భాగస్వామి అయిన జనసేన పార్టీ ఎమ్మెల్యే పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు బాగోలేని…
ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…
సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…
తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…
సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…
వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…