వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోమారు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భాగంగా పలు కీలక అంశాలను ప్రస్తావించిన జగన్… చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మావిగన్ పేరు వింటే చంద్రబాబు గుండె ఆగి చనిపోతాడు అంటూ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్ లాంటి నేత నోట నుంచి ఈ తరహా వ్యాఖ్యలు వినిపించడం నిజంగానే దారుణమని చెప్పాలి. గతంలోనూ చంద్రబాబు శాపం తగిలి పోతారంటూ శాపనార్థాలు పెట్లిన జగన్… ఈ దఫా ఏకంగా చంద్రబాబు ఏకంగా చనిపోతారంటూ వ్యాఖ్యానించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.
మావిగన్ పై మీ స్పందన ఏమిటని అడిగితే.. చంద్రబాబు గుండె ఆగి చనిపోతాడు అని జగన్ వ్యాఖ్యానించారు. నిద్దట్లో మావిగన్ గుర్తుకు వచ్చినా చంద్రబాబుకు బీపీ పెరిగిపోతుందని ఆయన అన్నారు. మావిగన్ పై మీ స్పందన ఏమిటని అడిగితే… గుండె ఆగి చనిపోకపోతే అదృష్టం అని జగన్ వ్యాఖ్యానించారు.
రాజకీయాలు అన్నాక వైరి వర్గాలపై ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజమేనని చెప్పాలి. అయితే వైరి వర్గాలకు చెందిన కీలక నేతలు చనిపోవాలన్న రీతిలో ఆయా నేతలు వ్యాఖ్యలు చేయడం ఇప్పటిదాకా జరగలేదనే చెప్పాలి. అయితే సీఎం పదవి చేజారిన నేపథ్యంలో జగన్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారని, ఈ క్రమంలోనే ఆయన చంద్రబాబుపై శాపనార్ధాలు పెడుతున్నారన్న కోణంలో విశ్లేషణలు సాగుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై టీడీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.
This post was last modified on May 21, 2026 1:32 pm
Rare & Unexpected:Probably for the first time, PM #Modi Addresses Nation Through a Selfie Video,…
అగ్రశ్రేణి కథానాయకులు.. చిన్న, మిడ్ రేంజ్ సినిమాలు చేసే దర్శకులతో.. కొత్తవాళ్లు, పెద్దగా అనుభవం లేని డైరెక్టర్లతో పని చేయడం…
రాష్ట్రంలో ఓటు లేని వారికి ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలను ఎలా అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఎవరి…
సంక్రాంతి సినిమాల తర్వాత నాలుగైదు నెలల పాటు బాక్సాఫీస్ దగ్గర పెద్ద స్లంప్ చూసింది టాలీవుడ్. కానీ గత నెలలో…
ఏదైనా రీమేక్ సినిమాకు వచ్చే అతి పెద్ద సమస్య పోలిక. ఒరిజినల్ కంటే మెరుగ్గా తీశారా, నటీనటుల్లో ఎవరు బాగా…
ప్రముఖ తెలుగు నిర్మాత, నటుడు బండ్ల గణేష్కు సంబంధించిన ఆస్తి వివాదం ఇటీవల వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. గణేష్కు చెందిన…