వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోమారు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భాగంగా పలు కీలక అంశాలను ప్రస్తావించిన జగన్… చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మావిగన్ పేరు వింటే చంద్రబాబు గుండె ఆగి చనిపోతాడు అంటూ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్ లాంటి నేత నోట నుంచి ఈ తరహా వ్యాఖ్యలు వినిపించడం నిజంగానే దారుణమని చెప్పాలి. గతంలోనూ చంద్రబాబు శాపం తగిలి పోతారంటూ శాపనార్థాలు పెట్లిన జగన్… ఈ దఫా ఏకంగా చంద్రబాబు ఏకంగా చనిపోతారంటూ వ్యాఖ్యానించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.
మావిగన్ పై మీ స్పందన ఏమిటని అడిగితే.. చంద్రబాబు గుండె ఆగి చనిపోతాడు అని జగన్ వ్యాఖ్యానించారు. నిద్దట్లో మావిగన్ గుర్తుకు వచ్చినా చంద్రబాబుకు బీపీ పెరిగిపోతుందని ఆయన అన్నారు. మావిగన్ పై మీ స్పందన ఏమిటని అడిగితే… గుండె ఆగి చనిపోకపోతే అదృష్టం అని జగన్ వ్యాఖ్యానించారు.
రాజకీయాలు అన్నాక వైరి వర్గాలపై ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజమేనని చెప్పాలి. అయితే వైరి వర్గాలకు చెందిన కీలక నేతలు చనిపోవాలన్న రీతిలో ఆయా నేతలు వ్యాఖ్యలు చేయడం ఇప్పటిదాకా జరగలేదనే చెప్పాలి. అయితే సీఎం పదవి చేజారిన నేపథ్యంలో జగన్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారని, ఈ క్రమంలోనే ఆయన చంద్రబాబుపై శాపనార్ధాలు పెడుతున్నారన్న కోణంలో విశ్లేషణలు సాగుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై టీడీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.
ఏపీలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపిలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కూటమికి నేతృత్వం…
ఓ రాజకీయ పార్టీ తనను వేధించిన విషయంపై అలుపెరగని పోరాటం చేసి తీరుతుంది. అలా చేయకుంటే… అది రాజకీయ పార్టీ…
భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోమారు తెలంగాణ అంశం మీద నోరు విప్పారు. భారత దేశంలో…
ఏపీ అభివృద్ధికి కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్ని విధాలా సాయం చేస్తోందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్…
సినీ ప్రియులను అంతులేని విషాదంలో ముంచెత్తుతూ లెజెండరీ దర్శకులు భారతీరాజా కన్నుమూశారు. ఆయన జ్ఞాపకాలలో అభిమానులు గతాన్ని తలుచుకుంటున్నారు. పేరు…