Political News

ఈ దఫా ‘ఆన్ లైన్’ మహానాడు!

తెలుగు దేశం పార్టీ వార్షిక పండుగ మహానాడు ఈ దఫా సరికొత్తగా జరగనుంది. ఏటా మే నెల 27,28 తేదీల్లో టీడీపీ వార్షికోత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. గతేడాది విపక్షం వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో మహానాడును నిర్వహించిన టీడీపీ… ఈ ఏడాది ఈ వేడుకలకు నెల్లూరును ఎంచుకుంది. అయితే పొదుపు చర్యల్లో భాగంగా నెల్లూరు వేదికను రద్దు చేసిన పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ దఫా మహానాడును ఆన్ లైన్ రూపంలో జరపాలని ఆయన తీర్మానించారు.

ఈ మేరకు పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో పలు విపరిణామాలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ పరిణామాలను ఎదుర్కొని నిలిచేందుకు ప్రధాని నరేంద్ర మోదీ పొదుపు చర్యలను ప్రకటించారు. ఈ చర్యల్లో భాగంగా ప్రధానంగా ఇంధనం ఆదా చేసే చర్యలను దేశవ్యాప్తంగా చేపడుతున్నారు.

ఈ క్రమంలోనే భారీ ఎత్తున జరిగే మహానాడును యధావిదిగా నిర్వహిస్తే… భారీ స్థాయిలో ఇంధనం ఖర్చు అవుతుందని గ్రహించిన చంద్రబాబు… ఆ ఇంధన వినియోగాన్ని పూర్తిగా తగ్గించేందుకే ఆన్ లైన్ మహానాడును ఎంచుకున్నారు. పార్టీ శ్రేణులకు ఈ మేరకు ఆన్ లైన్ మహానాడు మార్గదర్శకాలు చేరిపోయాయి.

ఆన్ లైన్ మహానాడులో భాగంగా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు మాత్రమే పాలుపంచుకుంటారు. ఇక జిల్లాలు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా ఎక్కడికక్కడ కార్యక్రమాలను పార్టీ శ్రేణులు వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలోని 1,845 క్లస్టర్లలో పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేసి కేంద్ర కార్యాలయంలో జరిగే వేడుకలను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. వెరసి ఈ దఫా టీడీపీ వార్షిక వేడుకలైన మహానాడు ఆన్ లైన్ లో అత్యాధునిక విధానంలో జరగనుంది.

ఇదిలా ఉంటే… ఈ దఫా మహానాడు వేడుకలను నెల్లూరులో నిర్వహించాలని పార్టీ అధిష్ఠానం ఇదివరకే నిర్ణయించిన సంగతి తెలిసిందే. లక్షలాది మంది తెలుగు తమ్ముళ్లు పాలుపంచుకునే ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే నెల్లూరులో ఎంపిక చేసిన స్థలంలో కార్యక్రమ ఏర్పాట్లు మొదలైపోయాయి.

అయితే పొదుపు చర్యల్లో భాగంగా ఆన్ లైన్ మహానాడు అంటూ అదిష్ఠానం కీలక నిర్ణయం తీసుకోవడంతో నెల్లూరులో జరుగుతున్న ఏర్పాట్లన్నీ శుక్రవారం సాయంత్రానికే నిలిచిపోయాయి. ఇక ఆయా క్లస్టర్లలో స్క్రీన్ల ఏర్పాటుకు సంబందించిన చర్యలను పార్టీ శ్రేణులు మొదలుపెట్టనున్నాయి.

Kumar

Recent Posts

ఢిల్లీలో వైసీపీ చక్రం విరిగినట్టేనా?

వైసీపీ ఏపీలో డీలా ప‌డిన విష‌యం తెలిసిందే. గ‌త 2024 ఎన్నిక‌ల వ‌ర‌కు 151 మంది ఎమ్మెల్యేల‌తో క‌ళ‌క‌ళ లాడిన…

5 minutes ago

సమంత బంగారానికి మంచి ఛాన్స్

ఏది జరిగినా మంచికే అని పెద్దలు ఊరికే అనలేదు. సమంతకు ఇది ప్రత్యక్షంగా అనుభవంలోకి వస్తోంది. ఖుషి తర్వాత బాగా…

17 minutes ago

దూత మీద నమ్మకం నిర్మాతను చేసింది

హీరోలు నిర్మాతలు కావడం కొత్తేమి కాదు. చిరంజీవి పీక్స్ లో ఉన్నప్పుడే అంజనా ప్రొడక్షన్స్ స్థాపించారు. కార్డు నాగబాబు పేరు…

2 hours ago

1500 కోట్ల స్కాం… వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్టు

వినుకొండ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత బొల్లా బ్రహ్మనాయుడుపై భూకబ్జా ఆరోపణలు వచ్చిన వైనం ఇరు తెలుగు రాష్ట్రాలలో సంచలనం…

2 hours ago

జ‌గ‌న్‌పై ఈడీ క‌న్ను… విచార‌ణేనా? అరెస్టా?!

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఇప్ప‌టికే ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ఉంది. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ముఖ్య మంత్రిగా ఉన్న స‌మ‌యంలో…

3 hours ago

అన్నామలై బీజేపీని ఎందుకు వీడినట్టు?

అనుకున్నంతా అయ్యింది. గత కొంతకాలంగా బీజేపీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్న ఆ పార్టీ తమిళనాడు మాజీ అధ్యక్షుడు అన్నామలై తాజాగా ఆ…

4 hours ago