Political News

కూటమిది స్పీడు కాదు… జెట్ స్పీడు

ఏపీలో టీడీపీ సారథ్యంలో కొనసాగుతున్న కూటమి సర్కారు దూకుడు ప్రదర్శిస్తోంది. రాష్ట్రాన్ని అభివృద్ది బాట పట్టించే విషయంలో ప్రత్యేకించి రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టడంలో కూటమి సర్కారు మామూలు స్పీడుతో వెళ్లడం లేదు. జెట్ స్పీడుతో వెళుతోంది. ఇందుకు నిదర్శనమే శ్రీ సత్యసాయి జిల్లా. పుట్టపర్తిలో శుక్రవారం శంకుస్థాపన చేసుకున్ని ఏఎంసీఏ పరిశ్రమ. రూ.15,800 కోట్ల వ్యయంలో ఏర్పాటు కానున్న ఈ రక్షణ శాఖ పరిశ్రమను కూటమి సర్కారు కేవలం రోజుల వ్యవధిలోనే సాదించింది. కేవలం 36 రోజుల్లోనే ఈ పరిశ్రమను గ్రౌండ్ చేసి కూటమి సర్కారు తన స్పీడు ఏ పాటిదో ఇట్టే చెప్పేసింది.

రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో కలిసి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈ పరిశ్రమకు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాయలసీమలో ఏర్పాటు అవుతున్న ఈ పరిశ్రమను ఎలా సాదించామన్న విషయాన్ని ఆయన సోదాహరణంగా వివరించారు.

కేవలం 36 రోజుల వ్యవధిలోనే ఈ పరిశ్రమను సాధించడంతో పాటుగా ఏకంగా భూమి పూజ కూడా చేస్తున్నామని ఆయన వెల్లడించారు. చెప్పడానికేముంది…అందరూ అలా గొప్పలు చెప్పుకుంటారులే అనుకోవడానికి ఇక్కడ ఆస్కారమే లేదని చెప్పాలి. ఎందుకంటే… తేదీలతో సహా చంద్రబాబు ఈ పరిశ్రమ కోసం చేసిన పనులను ఏకరువు పెట్టారు.

రక్షణ శాఖ తయారు చేసే ఫైటర్ జెట్ విమానాలను పరీక్షించేందుకు ఓ భారీ యంత్రాంగాన్ని రూపుదిద్దేందుకు నిర్ణయించిందన్న సమాచారం తెలిసిన వెంటనే చంద్రబాబు రంగంలోకి దిగిపోయారు. గత నెల (ఏప్రిల్) 9న దీనిపై రక్షణ శాఖ ప్రతినిధులతో ఏపీ ప్రభుత్వం చర్చలు జరిపింది.

ఏపీ ఆఫర్ ను పరిశీలించిన రక్షణ శాఖ… ఏపీలో ఈ పరిశ్రమకు అనుకూలంగా ఏమున్నాయన్న విషయాన్ని తెలుసుకునేందుకు ఏప్రిల్ 20న ప్రతిపాదనలు పంపాలంటూ ఏపీకి లేఖ రాసింది. రక్షణ శాఖ అడిగిన నాలుగంటే నాలుగు రోజుల్లో అంటే… ఏప్రిల్ 24న ఏపీ సర్కారు ప్రతిపాదనలు సిద్ధం చేసి రక్షణ శాఖకు పంపింది.

ఏపీ పంపిన ప్రతిపాదనల పరిశీలనకు రక్షణ శాఖ ఓ నాలుగు రోజుల సమయాన్ని తీసుకుంది. ఈ నాలుగు రోజుల్లోనూ ఏపీ సర్కారు ఖాళీగా ఏమీ కూర్చోలేదు. నిత్యం రక్షణ శాఖ ప్రతినిధులతో చర్చలు జరుపుతూనే ఉంది. ఈ క్రమంలో ఏప్రిల్ 28 ఈ పరిశ్రమను ఏపీ ప్రతిపాదించినట్లుగా పుట్టపర్తిలో ఏర్పాటు చేసేందుకు రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఆ మరునాడే అంటే.. ఏప్రిల్ 29న రక్షణ శాఖ అధికారులు పుట్టపర్తిలోని ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. రక్షణ శాఖ అధికారులు ఓకే అన్నంతనే ఏప్రిల్ 30న ఏపీ ఈ పరిశ్రమ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను శరవేగంగా పూర్తి చేసి శుక్రవారం అంటే…మే 15న శంకుస్థాపన చేశారు.

Kumar

Recent Posts

చెన్నై ల‌వ్ స్టోరీ ఎందుకు చేతులు మారింది?

బేబీ సినిమాతో పెద్ద సంచ‌ల‌న‌మే రేపాడు ద‌ర్శ‌క నిర్మాత సాయిరాజేష్‌. కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న వైష్ణ‌వి చైత‌న్య‌, ఆనంద్…

1 hour ago

డ్ర‌గ్స్ కోసం ఎగ‌బ‌డ్డ ఎమ్మెల్సీ కొడుకు… ప‌ట్టేసుకున్న పోలీసులు

హైద‌రాబాద్‌ను డ్ర‌గ్స్ మ‌హ‌మ్మారి వెంటాడుతోంది. ఇటు ప్ర‌భుత్వం, అటు పోలీసులు అనుక్ష‌ణం డ్ర‌గ్స్ క‌ట్ట‌డికి ఎంతగా ప్ర‌య‌త్నిస్తున్నా.. ఏదో ఒక…

2 hours ago

హ‌మ్మ‌య్య‌… ఎట్ట‌కేల‌కు క‌దిలిన క‌మ‌ల‌నాథులు!

ఏపీలో కూట‌మిగా ఏర్పడి.. అధికారాన్ని పంచుకుంటున్న బీజేపీ.. గ‌త రెండేళ్ల కాలంలో ఎప్పుడూ.. పెద‌వి విప్పి.. కూట‌మి ప్ర‌భుత్వం సాధించిన…

2 hours ago

నోలన్ విధ్వంసానికి ఆకాశమే హద్దు

ఇప్పుడు వరల్డ్ నంబర్ వన్ డైరెక్టర్ ఎవరు అంటే మరో మాట లేకుండా క్రిస్టోఫర్ నోలన్ పేరు చెప్పేస్తారు ఆడియన్స్.…

3 hours ago

ప్రభాస్ పోస్టర్ ఏం చెబుతోంది

అనుకున్నట్టే ఫౌజీ విడుదల తేదీ డిసెంబర్ 3 లాకైపోయింది. ఇది రెండు వారాల క్రితమే లీకైన న్యూస్ అయినప్పటికీ ఫైనల్…

3 hours ago

వారణాసికి ఐమాక్స్ తెరల సమస్య

ప్రపంచవ్యాప్తంగా ఐమాక్స్ కున్న క్రేజ్ తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో లేదన్న మాటే కానీ పదిహేను సంవత్సరాల క్రితం ప్రసాద్ మల్టీప్లెక్స్…

5 hours ago