Political News

కూటమిది స్పీడు కాదు… జెట్ స్పీడు

ఏపీలో టీడీపీ సారథ్యంలో కొనసాగుతున్న కూటమి సర్కారు దూకుడు ప్రదర్శిస్తోంది. రాష్ట్రాన్ని అభివృద్ది బాట పట్టించే విషయంలో ప్రత్యేకించి రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టడంలో కూటమి సర్కారు మామూలు స్పీడుతో వెళ్లడం లేదు. జెట్ స్పీడుతో వెళుతోంది. ఇందుకు నిదర్శనమే శ్రీ సత్యసాయి జిల్లా. పుట్టపర్తిలో శుక్రవారం శంకుస్థాపన చేసుకున్ని ఏఎంసీఏ పరిశ్రమ. రూ.15,800 కోట్ల వ్యయంలో ఏర్పాటు కానున్న ఈ రక్షణ శాఖ పరిశ్రమను కూటమి సర్కారు కేవలం రోజుల వ్యవధిలోనే సాదించింది. కేవలం 36 రోజుల్లోనే ఈ పరిశ్రమను గ్రౌండ్ చేసి కూటమి సర్కారు తన స్పీడు ఏ పాటిదో ఇట్టే చెప్పేసింది.

రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో కలిసి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈ పరిశ్రమకు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాయలసీమలో ఏర్పాటు అవుతున్న ఈ పరిశ్రమను ఎలా సాదించామన్న విషయాన్ని ఆయన సోదాహరణంగా వివరించారు.

కేవలం 36 రోజుల వ్యవధిలోనే ఈ పరిశ్రమను సాధించడంతో పాటుగా ఏకంగా భూమి పూజ కూడా చేస్తున్నామని ఆయన వెల్లడించారు. చెప్పడానికేముంది…అందరూ అలా గొప్పలు చెప్పుకుంటారులే అనుకోవడానికి ఇక్కడ ఆస్కారమే లేదని చెప్పాలి. ఎందుకంటే… తేదీలతో సహా చంద్రబాబు ఈ పరిశ్రమ కోసం చేసిన పనులను ఏకరువు పెట్టారు.

రక్షణ శాఖ తయారు చేసే ఫైటర్ జెట్ విమానాలను పరీక్షించేందుకు ఓ భారీ యంత్రాంగాన్ని రూపుదిద్దేందుకు నిర్ణయించిందన్న సమాచారం తెలిసిన వెంటనే చంద్రబాబు రంగంలోకి దిగిపోయారు. గత నెల (ఏప్రిల్) 9న దీనిపై రక్షణ శాఖ ప్రతినిధులతో ఏపీ ప్రభుత్వం చర్చలు జరిపింది.

ఏపీ ఆఫర్ ను పరిశీలించిన రక్షణ శాఖ… ఏపీలో ఈ పరిశ్రమకు అనుకూలంగా ఏమున్నాయన్న విషయాన్ని తెలుసుకునేందుకు ఏప్రిల్ 20న ప్రతిపాదనలు పంపాలంటూ ఏపీకి లేఖ రాసింది. రక్షణ శాఖ అడిగిన నాలుగంటే నాలుగు రోజుల్లో అంటే… ఏప్రిల్ 24న ఏపీ సర్కారు ప్రతిపాదనలు సిద్ధం చేసి రక్షణ శాఖకు పంపింది.

ఏపీ పంపిన ప్రతిపాదనల పరిశీలనకు రక్షణ శాఖ ఓ నాలుగు రోజుల సమయాన్ని తీసుకుంది. ఈ నాలుగు రోజుల్లోనూ ఏపీ సర్కారు ఖాళీగా ఏమీ కూర్చోలేదు. నిత్యం రక్షణ శాఖ ప్రతినిధులతో చర్చలు జరుపుతూనే ఉంది. ఈ క్రమంలో ఏప్రిల్ 28 ఈ పరిశ్రమను ఏపీ ప్రతిపాదించినట్లుగా పుట్టపర్తిలో ఏర్పాటు చేసేందుకు రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఆ మరునాడే అంటే.. ఏప్రిల్ 29న రక్షణ శాఖ అధికారులు పుట్టపర్తిలోని ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. రక్షణ శాఖ అధికారులు ఓకే అన్నంతనే ఏప్రిల్ 30న ఏపీ ఈ పరిశ్రమ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను శరవేగంగా పూర్తి చేసి శుక్రవారం అంటే…మే 15న శంకుస్థాపన చేశారు.

This post was last modified on May 15, 2026 10:27 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఇంత నొప్పి ఎలా తట్టుకుంటున్నావ్ పవన్

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవలే శస్త్ర చికిత్స తీసుకుని… అనంతరం స్వల్ప వ్యవధి విశ్రాంతి…

1 hour ago

తెలుగు రాష్ట్రాల్లో `స‌ర్‌`: పార్టీల్లో ఆందోళ‌న‌!

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ స్పెష‌ల్‌ ఇంటెన్సివ్ రివిజ‌న్(స‌ర్‌) పేరుతో కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఓట‌ర్ల జాబితాను తాజా ప‌రిచే కార్య‌క్ర‌మానికి…

2 hours ago

‘రంగా గారికి ప్రాణహాని ఉన్నప్పుడు ఏం చేశారయ్యా మీరంతా?’ – పవన్

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుక్రవారం తనదైన శైలిలో అన్ని అంశాలపై కూలంకషంగానే స్పందించారు. అనారోగ్యం…

4 hours ago

రాకా సంగీతానికి పెద్ద ఛాలెంజ్ ఉంది

అనిరుధ్ రవిచందర్ తర్వాత తమిళ దర్శకులు ఎక్కువగా జపిస్తున్న పేరు సాయి అభ్యంక్కర్. కుర్రాడు చాలా చిన్న వయసులోనే మ్యూజిక్…

5 hours ago

యువ హీరోకి బాబాయితో చెడిందా

యువ కథానాయకుడు రామ్ పోతినేని తన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు పెద్ద సర్ప్రైజే ఇచ్చాడు. తన కొత్త సినిమాను…

5 hours ago

సైకిల్ ఎక్కిన వైసీపీ భూమన

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగానే కాకుండా… జగన్ కోసం ఏమైనా చేసేందుకు అనునిత్యం సిద్ధంగా…

5 hours ago