రాష్ట్రంలో కీలకమైన నాలుగు రాజ్యసభ ఖాళీ అవుతున్నాయి. వీటిలో మూడు వైసీపీకి చెందిన నాయకులవి కాగా ఒకటి టిడిపికి చెందిన సానా సతీష్ ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానం. వచ్చే నెల 21తో ఈ నాలుగు స్థానాలకు గడువు తీరుతుంది. ఈ నేపథ్యంలో ఈ నెల ఆఖరి నాటికి రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయనుంది.
ఇప్పుడు ఉన్న అసెంబ్లీ బలాలను బట్టి ఈ నాలుగు స్థానాలు తిరిగి టిడిపికి దక్కనున్నాయి. ఈ క్రమంలో ఆయా స్థానాలు ఎవరికి కేటాయిస్తారు ఎవరిని పెద్దల సభకు పంపిస్తారు అనే విషయం ఆసక్తిగా మారింది. ప్రధానంగా గతంలో టికెట్లను త్యాగం చేసిన వారిలో దేవినేని ఉమామహేశ్వరరావు ముందు వరుసలో ఉన్నారు. తనకు రాజ్యసభ అవకాశం కల్పించాలని ఆయన కోరుతున్నారు. అదేవిధంగా మాజీ మంత్రి సీనియర్ మోస్ట్ నాయకుడు యనమల రామకృష్ణుడు కూడా ఈ జాబితాలోనే ఉన్నారు.
వీరితో పాటుగా వైసీపీ నుంచి వచ్చి టిడిపిలో చేరిన మోపిదేవి వెంకటరమణ కూడా ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక నారా లోకేష్ విధేయుడైన సానా సతీష్ కు తిరిగి రాజ్యసభకు పంపిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ ఇలా ఉంటే ఈ నాలుగు స్థానాల్లో ఒకటి ఇప్పటికే ముస్లిం సామాజిక వర్గానికి రిజర్వు చేశారని ఈ స్థానం నుంచి బలమైన నాయకుడిగా ఉన్న ఎం ఏ షరీఫ్ ను పంపిస్తారని తెలుస్తోంది.
మరోవైపు గతంలో రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వర్ల రామయ్య కూడా సీటు ఆశిస్తున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే కూటమి పక్షాన ఒక సీటును జనసేన మరో సీటును బిజెపి కోరుకుంటున్నాయి. ఇవి పోగా మిగిలిన రెండు స్థానాల్లో ఒకటి సానా సతీష్ కు రిజర్వు చేశారని ప్రచారం జరుగుతుంది.
మరొకటి ముస్లిం సామాజిక వర్గానికికేటాయిస్తున్నారని కూడా తెలుస్తోంది. దీంతో ఉన్న నాలుగు స్థానాలు అప్పుడే రిజర్వ్ అయిపోయాయి అనేది ఒక వాదన వినిపిస్తుండగా లేదు ఇంకా ఖరారు కాలేదని మరికొందరు చెబుతున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం రాజ్యసభ సీట్ల వ్యవహారం టిడిపిలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
This post was last modified on May 15, 2026 10:29 pm
శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టడని పెద్దలు చెప్పే మాట నిజమని మరోసారి రుజువయ్యింది. కైలాస మానస సరోవర యాత్ర కోసం…
ఇరుముడి ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ కావడం అభిమానులకే కాదు రవితేజకు కూడా ఎక్కడ లేని హుషారు తీసుకొచ్చింది. హిట్…
మొన్నటిదాకా హాయ్ నాన్న, జెర్సీ అంటూ ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా టార్గెట్ చేసుకున్న న్యాచురల్ స్టార్ నాని ఇప్పుడు పూర్తిగా…
ఖైరతాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందర్ అలిగారు. డబుల్ బెడ్ రూం లక్కీ డ్రా కార్యక్రమం నుంచి మధ్యలోనే…
వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల ఇంకో ముప్పై రెండు రోజుల్లో…
గత మూడు నెలలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ మంచి జోష్ మీద నడుస్తోంది. కనీసం రెండు వారాలకో మంచి సినిమా పడుతోంది.…