ప్రస్తుతం ఇండియాలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో లోకేష్ కనకరాజ్ ఒకడు. ఖైదీ, విక్రమ్ చిత్రాలతో అతను తెచ్చుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మల్టీవెర్స్ అనేక కాన్సెప్టుతో హీరోలతో సమానంగా ఫాలోయింగ్ సంపాదించాడతను. ఐతే తన చుట్టూ హైప్ పెరిగాక లియో, కూలీ చిత్రాలతో నిరాశపరిచిన లోకేష్.. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా ఒక సినిమా తీయడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.
ఈలోపు అతను.. హీరోగా ఒక సినిమా చేశాడు. అదే.. డీసీ. కీర్తి సురేష్తో సాని కాయితం, ధనుష్తో కెప్టెన్ మిల్లర్ సినిమాలు తీసిన అరుణ్ మాథేశ్వరన్.. లోకేష్ను హీరోగా పరిచయం చేస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్తో ప్రేక్షకులను పలకరించింది. హీరోగా లోకేష్ చిత్రం ఆషామాషీదేమీ కాదని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.
ఒక రౌడీ.. ఒక వేశ్య.. వీళ్లిద్దరి మధ్య పరిచయం.. ప్రేమ.. సంఘర్షణ.. గ్యాంగ్ వార్స్ ఈ నేపథ్యంలో నడిచే కథ ఇది. అనుకోని పరిస్థితుల్లో వేశ్యగా మారిన హీరోయిన్ దగ్గరికి వచ్చిన హీరో.. ఆమెకు ఆకర్షితుడై తనతో ప్రయాణం చేయడం.. తర్వాత ఇద్దరూ చిక్కుల్లో పడడం.. ఇటు పోలీసులు, అటు రౌడీలు వీళ్లిద్దరి వెంట పడడం.. ఈ క్రమంలో ఒకరి కోసం ఒకరు ఎంతకైనా తెగించే పరిస్థితి రావడం.. ఈ నేపథ్యంలో చాలా వయొలెంట్గా నడిచే సినిమాలా ఉందిది.
ప్రస్తుత ట్రెండుకు తగ్గట్లే వయొలెన్స్ను హద్దులు దాటించేశారు. ట్రైలర్లో కొన్ని హింసాత్మక సన్నివేశాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. ఒక దర్శకుడు హీరోగా మారిన సినిమాలో మరీ ఇంత బీభత్సమా అనిపించేలా సాగింది ట్రైలర్. కథ పాతగా అనిపించినా.. నరేషన్ కొత్తగా ఉంటుందని.. యాక్షన్ ప్రియులకు సినిమా కనువిందే అని ట్రైలర్ సంకేతాలు ఇచ్చింది.
లోకేష్ మీద నమ్మకంతో ఖర్చు బాగానే పెట్టినట్లున్నారు. సన్ పిక్చర్స్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించగా.. అనిరుధ్ సంగీతం అందించాడు. ఈ సినిమాకు ఇంకా రిలీజ్ డేట్ ఖరారవ్వలేదు.
This post was last modified on May 16, 2026 6:35 am
రాష్ట్రంలో కీలకమైన నాలుగు రాజ్యసభ ఖాళీ అవుతున్నాయి. వీటిలో మూడు వైసీపీకి చెందిన నాయకులవి కాగా ఒకటి టిడిపికి చెందిన…
ఐపీఎల్-2026లో అత్యధిక క్రేజ్ దక్కించుకున్న మ్యాచ్లలో సన్రైజర్స్ హైదరాబాద్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోరు ఒకటి. మే 22న ఉప్పల్లోని రాజీవ్…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది ప్రమోషన్లలో జాన్వీ కపూర్ కనిపించకపోవడం గురించి సోషల్ మీడియాలో రకరకాల అర్థాలు తీస్తున్నారు.…
తెలుగు దేశం పార్టీ వార్షిక పండుగ మహానాడు ఈ దఫా సరికొత్తగా జరగనుంది. ఏటా మే నెల 27,28 తేదీల్లో…
ఏపీలో టీడీపీ సారథ్యంలో కొనసాగుతున్న కూటమి సర్కారు దూకుడు ప్రదర్శిస్తోంది. రాష్ట్రాన్ని అభివృద్ది బాట పట్టించే విషయంలో ప్రత్యేకించి రాష్ట్రానికి…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవలే శస్త్ర చికిత్స తీసుకుని… అనంతరం స్వల్ప వ్యవధి విశ్రాంతి…