ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేరుతో రూపొందించిన ఓ ఫేక్ లెటర్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలుపుతున్నట్లుగా ఈ లేఖను సృష్టించారు.
ఈ లేఖలో.. “2024 ఎన్నికల్లో వర్మ గారు అందించిన సహకారం మరువలేనిది” అంటూ పేర్కొన్నారు. అలాగే పిఠాపురం నుంచి తాను పోటీ చేస్తున్నానని తెలిసిన వెంటనే బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ వర్మ తన సీటును త్యాగం చేసి సంపూర్ణ మద్దతు ప్రకటించారని, ఆయనకు, కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని లేఖలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
భవిష్యత్తులో వర్మ చట్టసభల్లో అడుగుపెట్టి ప్రజల తరఫున బలంగా పనిచేస్తారనే నమ్మకం వ్యక్తం చేస్తూ.. పిఠాపురం అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తామని కూడా ఆ లేఖలో పేర్కొన్నట్లు కనిపిస్తోంది.
అయితే ఈ లేఖ పూర్తిగా నకిలీదేనని జనసేన వర్గాలు చెబుతున్నాయి. డీసీఎం కార్యాలయం నుంచి ఇలాంటి ఎలాంటి అధికారిక లేఖ విడుదల కాలేదని స్పష్టం చేస్తున్నాయి. ఈ ఫేక్ లెటర్ను ఎవరు రూపొందించారు? ఏ ఉద్దేశంతో వైరల్ చేస్తున్నారు? అన్న దానిపై జనసేన నాయకత్వం ఆరా తీస్తోంది. మరోవైపు పిఠాపురం టీడీపీ వాట్సాప్ గ్రూపుల్లో ఈ లేఖ విస్తృతంగా షేర్ కావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
హీరోలు నిర్మాతలు కావడం కొత్తేమి కాదు. చిరంజీవి పీక్స్ లో ఉన్నప్పుడే అంజనా ప్రొడక్షన్స్ స్థాపించారు. కార్డు నాగబాబు పేరు…
వినుకొండ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత బొల్లా బ్రహ్మనాయుడుపై భూకబ్జా ఆరోపణలు వచ్చిన వైనం ఇరు తెలుగు రాష్ట్రాలలో సంచలనం…
వైసీపీ అధినేత జగన్పై ఇప్పటికే ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ఉంది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్య మంత్రిగా ఉన్న సమయంలో…
అనుకున్నంతా అయ్యింది. గత కొంతకాలంగా బీజేపీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్న ఆ పార్టీ తమిళనాడు మాజీ అధ్యక్షుడు అన్నామలై తాజాగా ఆ…
ఎవరో జ్వాలలు రగిలించారు వేరెవరో దానికి బలి అయ్యారు అనే పాట ఊరికే పుట్టలేదు. గత నెల విడుదలై తమిళంలో…
రాష్ట్రంలో ఎదగాలని, వచ్చే ఎన్నికల నాటికి పుంజుకోవాలని భావిస్తున్న జనసేన ఏపీలో పెద్ద వ్యూహాన్నే అనుసరిస్తోంది. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా…