తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి…అనూహ్య రాజకీయ పరిణామాలను దాటుకుని మరీ తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలిగారు. తెలంగాణను సాధించిన బీఆర్ఎస్ ను గద్దె దించి… తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీని ఆయన అధికార పార్టీగా మలచారు. సీఎంగా రేవంత్ పదవీ బాధ్యతలు చేపట్టి అప్పుడే రెండేళ్లు దాటిపోయింది. ఈ క్రమంలో రాజకీయంగా రేవంత్ కాన్ఫిడెన్స్ రెట్టింపు అయ్యిందనే చెప్పాలి. 2034 వరకూ తెలంగాణ సీఎంగా తానే కొనసాగుతానని ఆయన శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో ఎలాంటి అనుమానం లేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో శుక్రవారం ఓ న్యూస్ యాప్ ఏర్పాటు చేసిన న్యూస్ కాన్ క్లేవ్ లో పాల్గొన్న సందర్భంగా రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా ఉచ్ఛ స్థితిలో ఉన్న రేవంత్… ఇదే స్థితిలో మరో ఏడెనిమిది ఏళ్ల పాటు కొనసాగుతానన్న ధీమాను వ్యక్తం చేశారు. 2034 వరకు తాను రాష్ట్ర రాజకీయీల్లోనే కొనసాగుతానని చెప్పిన రేవంత్… అప్పటిదాకా రాష్ట్రానికి సీఎంగా తానే కొనసాగుతానని చెప్పారు. 2034 తర్వాత తాను జాతీయ రాజకీయాల్లోకి వెళతానని ఆయన చెప్పారు.
వాస్తవానికి ఈ మాటను గతంలోనూ పలుమార్లు రేవంత్ చెప్పారు. అయితే ఈ దఫా ఆయన నోట స్పష్టమైన ధీమా వ్యక్తం అయ్యిందని చెప్పాలి. 2034 వరకు తెలంగాణ సీఎంగా తానే ఉంటానని చెప్పిన రేవంత్… కావాలంటే రాసి పెట్టుకోండని ఆసక్తికర వ్యాఖ్య చేశారు.
ఓ జడ్పీటీసీగా ఉన్న తనను సీఎంవి అవుతావా? అంటూ కొందరు ప్రశ్నించారని ఆయన తన గత అనుభవాలను గుర్తు చేసుకున్నారు. నాడు వారి ప్రశ్నలకు తన మౌనమే సమాధానం చెప్పిందన్న రేవంత్… జడ్పీటీసీ నుంచి సీఎం అయి చూపించానని వ్యాఖ్యానించారు. 2034 తర్వాత తన తర్వాతి తరానికి సీఎం పదవిని అందిస్తానని ఆయన చెప్పుకొచ్చారు.
ఆదునిక సాంకేతికతను వినియోగించుకునే విషయంలో రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు కీలక అడుగులు వేస్తున్నాయి. అందివచ్చిన సాంకేతికతతో ఆయా పార్టీలు తమ కార్యకలాపాల నిర్వహణ, కార్యకర్తలతో నిత్యం…
విషయం చిన్నదే అయినా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా చేయలేనిది.. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ చేసి చూపించారు. అదే.. దేశంలో…
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లో కీలక నేతగా వ్యవహరించారు. తెలుగు నేల రాజకీయాల్లో మూడు పర్యాయాలు…
బేబీ సినిమాతో పెద్ద సంచలనమే రేపాడు దర్శక నిర్మాత సాయిరాజేష్. కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న వైష్ణవి చైతన్య, ఆనంద్…
హైదరాబాద్ను డ్రగ్స్ మహమ్మారి వెంటాడుతోంది. ఇటు ప్రభుత్వం, అటు పోలీసులు అనుక్షణం డ్రగ్స్ కట్టడికి ఎంతగా ప్రయత్నిస్తున్నా.. ఏదో ఒక…
ఏపీలో కూటమిగా ఏర్పడి.. అధికారాన్ని పంచుకుంటున్న బీజేపీ.. గత రెండేళ్ల కాలంలో ఎప్పుడూ.. పెదవి విప్పి.. కూటమి ప్రభుత్వం సాధించిన…