కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో మే 8న పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం భగీరథ్ పరారీలో ఉన్నారని, ముమ్మరంగా గాలిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. అదే సమయంలో ఈ రోజు భగీరథ్ పోలీసు విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులిచ్చారు. వాస్తవారిని ఆ నోటీసులు బండి సంజయ్ నివాసంలో ఇవ్వాల్సి ఉంది.
కానీ, అందుకు భిన్నంగా సంజయ్ బావమరిది ఇంటికి వెళ్లి నోటీసులిచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అంటే, భగీరథ్ ఆ ఇంట్లో ఉన్నారా అంటూ సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో భగీరథ్ విచారణకు హాజరు కావాల్సి ఉంది.
అయితే, భగీరథ్ విచారణకు గైర్హాజరవుతారు అన్నది ఊహించినదే. కానీ, అక్కడ విచారణ చేయాల్సిన సిట్ బృందంలోని పోలీసు అధికారులు కూడా స్టేషన్ కు రాలేదని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
అంటే, భగీరథ్ రాడని పోలీసులకు ముందస్తు సమాచారం ఉందంటూ కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. రాజకీయ నాయకులకు, సామాన్యులకు వేర్వేరుగా న్యాయం జరుగుతోందంటూ విమర్శిస్తున్నారు. ఇదే ఒక సామాన్యుడిపై పోక్సో కేసు నమోదై ఉంటే ఈ పాటికి అరెస్టు చేసి ముప్పుతిప్పలు పెట్టేవారని పోలీసుల తీరును కూడా చాలామంది నెటిజనులు తప్పుబడుతున్నారు.
This post was last modified on May 13, 2026 4:30 pm
ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. 108 సీట్లు గెలుచుకున్న విజయ్ పార్టీ…మ్యాజిక్…
పొట్లూరి వరప్రసాద్.. ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో గట్టిగా వినిపించిన పేరు. రవితేజ బ్లాక్ బస్టర్ మూవీ ‘బలుపు’తో ఆయన…
టీవీకే అధినేత, తమిళనాడు సీఎం విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశంసలు వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పాఠశాలలు, దేవాలయాల సమీపంలో…
రాత్రి వేళ గస్తీ కాసేందుకు దేశం కాని దేశం వస్తున్న నేపాలీలు ఇప్పుడు నేరాల్లో ఆరితేరిపోయారని చెప్పాలి. గుర్ఖాలుగా ఎంట్రీ…
చట్టం గెలిచిందనుకున్న ప్రతీసారి పైరసీ కొత్త అవతారం ఎత్తుతోంది. ఐబొమ్మ ఆపరేటర్ రవి అరెస్ట్, సైట్ క్లోజ్ అని పోలీసులు…
ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా విషయాల మీద వేడి వేడి చర్చలు జరుగుతున్నాయి. సింగల్ స్క్రీన్లకు పర్సెంటెజ్ ఇవ్వడం, పేరు మోసిన…