కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో మే 8న పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం భగీరథ్ పరారీలో ఉన్నారని, ముమ్మరంగా గాలిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. అదే సమయంలో ఈ రోజు భగీరథ్ పోలీసు విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులిచ్చారు. వాస్తవారిని ఆ నోటీసులు బండి సంజయ్ నివాసంలో ఇవ్వాల్సి ఉంది.
కానీ, అందుకు భిన్నంగా సంజయ్ బావమరిది ఇంటికి వెళ్లి నోటీసులిచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అంటే, భగీరథ్ ఆ ఇంట్లో ఉన్నారా అంటూ సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో భగీరథ్ విచారణకు హాజరు కావాల్సి ఉంది.
అయితే, భగీరథ్ విచారణకు గైర్హాజరవుతారు అన్నది ఊహించినదే. కానీ, అక్కడ విచారణ చేయాల్సిన సిట్ బృందంలోని పోలీసు అధికారులు కూడా స్టేషన్ కు రాలేదని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
అంటే, భగీరథ్ రాడని పోలీసులకు ముందస్తు సమాచారం ఉందంటూ కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. రాజకీయ నాయకులకు, సామాన్యులకు వేర్వేరుగా న్యాయం జరుగుతోందంటూ విమర్శిస్తున్నారు. ఇదే ఒక సామాన్యుడిపై పోక్సో కేసు నమోదై ఉంటే ఈ పాటికి అరెస్టు చేసి ముప్పుతిప్పలు పెట్టేవారని పోలీసుల తీరును కూడా చాలామంది నెటిజనులు తప్పుబడుతున్నారు.
This post was last modified on May 13, 2026 4:30 pm
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 22ఏ భూములపై…
మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని చరిత్రలో ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. కాసుల కంటే కని పెంచిన తలిదండ్రులు…
ఒక గంట కునుకు పడితే ఎక్కడ పనికి బ్రేక్ పడుతుందో అన్న రేంజ్ లో చివరి దశ ప్యారడైజ్ పనులను…
దేవుడు నుదుటి మీద రాసే రాతైనా అర్ధం అవుతుందేమో కానీ వైద్యుడు రాసే మందుల పేర్లు మాత్రం అర్ధం కావన్నది…
రెండేళ్ల క్రితం పెద్దగా అంచనాలు లేకుండా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకున్న మహారాజ త్వరలో హాలీవుడ్ రీమేక్ కాబోతోందన్న వార్త…
సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్ హీరోగా పరిచయమవుతున్న ఎల్లమ్మను నెలల తరబడి వేధించిన సమస్య హీరోయిన్ ఎంపిక. మృణాల్ ఠాకూర్,…