కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో మే 8న పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం భగీరథ్ పరారీలో ఉన్నారని, ముమ్మరంగా గాలిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. అదే సమయంలో ఈ రోజు భగీరథ్ పోలీసు విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులిచ్చారు. వాస్తవారిని ఆ నోటీసులు బండి సంజయ్ నివాసంలో ఇవ్వాల్సి ఉంది.
కానీ, అందుకు భిన్నంగా సంజయ్ బావమరిది ఇంటికి వెళ్లి నోటీసులిచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అంటే, భగీరథ్ ఆ ఇంట్లో ఉన్నారా అంటూ సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో భగీరథ్ విచారణకు హాజరు కావాల్సి ఉంది.
అయితే, భగీరథ్ విచారణకు గైర్హాజరవుతారు అన్నది ఊహించినదే. కానీ, అక్కడ విచారణ చేయాల్సిన సిట్ బృందంలోని పోలీసు అధికారులు కూడా స్టేషన్ కు రాలేదని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
అంటే, భగీరథ్ రాడని పోలీసులకు ముందస్తు సమాచారం ఉందంటూ కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. రాజకీయ నాయకులకు, సామాన్యులకు వేర్వేరుగా న్యాయం జరుగుతోందంటూ విమర్శిస్తున్నారు. ఇదే ఒక సామాన్యుడిపై పోక్సో కేసు నమోదై ఉంటే ఈ పాటికి అరెస్టు చేసి ముప్పుతిప్పలు పెట్టేవారని పోలీసుల తీరును కూడా చాలామంది నెటిజనులు తప్పుబడుతున్నారు.
This post was last modified on May 13, 2026 4:30 pm
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…
వైసీపీ అధినేత జగన్ పలువురు కీలక రాజకీయ వ్యూహకర్తలతో భేటీ అయ్యారా? వచ్చే ఎన్నికలు.. దీనికి ముందు ఆయన చేయనున్న…