టీవీకే అధినేత, తమిళనాడు సీఎం విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశంసలు వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పాఠశాలలు, దేవాలయాల సమీపంలో మద్యం షాపులు తీసివేయాలన్న విజయ్ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇక, బ్యానర్లు, ఫ్లెక్సీలు అంటూ ప్రజలకు ఇబ్బంది కలిగించే కార్యక్రమాలు చేయొద్దంటూ టీవీకే ఎమ్మెల్యేలకు హుకుం జారీ చేసిన విజయ్ రీల్ లైఫ్ మాదిరే రియల్ లైఫ్ లో పాలన సాగిస్తారని అంతా భావించారు.
అయితే, తన వ్యక్తిగత జ్యోతిష్యుడు రిక్కి రాధన్ ను తన ఓఎస్డీగా నియమించడంతో విజయ్ పై తొలి విమర్శ మొదలైంది. ఇక, నేడు అసెంబ్లీలో అయితే ఈ విషయంపై డీఎంకేతో పాటు టీవీకే మిత్రపక్షాలు కూడా విజయ్ తీరును తప్పుబట్టాయి. ఈ నేపథ్యంలోనే విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఓఎస్డీగా రిక్కి రాధన్ నియామకాన్ని రద్దు చేశారు. విపక్షాల ఆరోపణలతో వెనక్కి తగ్గిన సీఎం విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇటు విపక్షాలు, అటు ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో విజయ్ చాలా వేగంగా రియాక్ట్ అయ్యి చేసిన పొరపాటును సరిదిద్దుకున్నారు. ఈ విషయంలో విజయ్ తీరు అభినందనీయం.
రిక్కి రాధన్ విషయంలో పడ్డ మచ్చ మాత్రం ఎప్పటికీ చెరిగిపోదు అన్న విషయం విజయ్ గుర్తు పెట్టుకోవాలి. అయితే, ఇటువంటి పొరపాట్లు మళ్లీ రిపీట్ కాకుండా విజయ్ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. ఏది ఏమైనా రిక్కీ రాధన్ నియామకం రద్దు రూపంలో విజయ్ కు తొలి షాక్ తగిలినట్లయింది.
This post was last modified on May 13, 2026 7:45 pm
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…