తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో వింత పరిణామం చోటుచేసుకుంటూ ఉన్నాయి. తాజాగా విజయ్ తన ప్రభుత్వ బల పరీక్షకు సిద్ధమవుతున్న తరుణంలో మద్రాస్ హైకోర్టు ఓ కీలక ఆదేశాన్ని జారీ చేసింది.
విజయ్ పార్టీ టీవీకే తరఫున ఒక్క ఓటుతో విజయం సాధించిన ఎమ్మెల్యే అసెంబ్లీలో జరిగే విశ్వాస పరీక్షలో పాల్గొనరాదంటూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. అసలే విజయ్ సర్కారుకు అంతంత మెజారిటీ ఉన్న నేపథ్యంలో కోర్టు ఇచ్చిన ఈ తీర్పుపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.
హైకోర్టు తీర్పునకు దారి తీసిన పరిణామాల్లోకి వెళితే.. శివగంగై జిల్లా తిరుపత్తూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీవీకే అభ్యర్థిగా బరిలోకి దిగిన శ్రీనివాస సేతుపతి విజయం సాధించారు. డీఎంకే తరఫున అక్కడ బరిలోకి దిగిన తాజా మాజీ మంత్రి, సీనియర్ రాజకీయవేత్త పెరియ కరుప్పన్ పై ఆయన ఒక్కటంటే ఒక్క ఓటుతో విజయం సాధించారు.
కరుప్పన్ కు 83,374 ఓట్లు రాగా సేతుపతికి 83,735 ఓట్లు వచ్చాయి. దీంతో సేతుపతి విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఆ పత్రం పట్టుకుని అసెంబ్లీకి వెళ్లిన సేతుపతి ఎమ్మెల్యేగా కూడా ప్రమాణం చేశారు.
అయితే సేతుపతి విజయంపైనా, ఓట్ల లెక్కింపుపైనా కరుప్పన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో పొరపాటు జరిగిందని కరుప్పన్ ఆరోపించారు. అంతేకాకుండా మొత్తంగా ఓట్ల లెక్కింపే సవ్యంగా జరగలేదని కూడా ఆయన ఆరోపించారు.
ఆరోపణలతో సరిపెట్టని కరుప్పన్… మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. కరుప్పన్ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు… విజయ్ సర్కారు బల పరీక్షలో సేతుపతి పాల్గొనరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఫలితంగా ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ…సేతుపతి తన పార్టీ ప్రభుత్వ విశ్వాస పరీక్షకు దూరంగా ఉండాల్సి వస్తోంది.
విజయ్ సర్కారుకు ఇప్పుడు 120 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉంది. తాజాగా మంగళవారం అన్నాడీఎంకేకు చెందిన చీలిక వర్గం 30 మంది ఎమ్మెల్యేలతో మద్దతు ప్రకటించింది. ఈ మద్దతును ఇప్పటిదాకా విజయ్ అయితే స్వీకరించలేదు.
ఇలాంటి నేపథ్యంలో విశ్వాసన పరీక్షలో సేతుపతి దూరంగా ఉంటే… విజయ్ సర్కారుకు కేవలం 119 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఈ మద్దతు సరిపోయినా… అనుకోని కారణాల వల్ల ఓ ఇద్దరు ఎమ్మెల్యేలు డుమ్మా కొడితే విజయ్ సర్కారు కుప్పకూలడం ఖాయమే. మరి ఇలాంటి కీలక పరిస్థితుల్లో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై తమిళనాట ఆసక్తికర చర్చ నడుస్తోంది.
This post was last modified on May 12, 2026 4:05 pm
యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…
ప్రమోషన్ల సంగతి ఎలా ఉన్నా పెద్ది ఇంకో ఇరవై రెండు రోజుల్లో థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఈ నెల 18…
పెళ్లి చూపులు, జాతి రత్నాలు టైంలో బిజీ ఆర్టిస్టుగా మారిపోయిన రాహుల్ రామకృష్ణ ఈ మధ్య కనిపించడం తగ్గించేశాడు. అడపాదడపా…
హైదరాబాద్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు.. రాజకీయంగా చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. నువ్వు నాతో…
తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్…వరుసబెట్టి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్నికల ముందు తమ పార్టీ అధికారంలోకి…
తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్ కి నిజంగానే బంపర్ ఆఫర్ వచ్చిందని చెప్పాలి. అదికార డీఎంకేతో…