భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం నాటి తన హైదరాబాద్ పర్యటనలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా మోదీని విశిష్ట అతిథిగా పరిగణించిన చంద్రబాబు కుటుంబం మోదీకి మచిరిపోలేని అతిథ్యం ఇచ్చింది. బాబు ఫ్యామిలీ అందించిన ఆతిథ్యంతో మోదీ కూడా మంత్రముగ్ధులయ్యారని చెప్పక తప్పదు. ఎందుకంటే…ఓ వైపు తాను ఎంతగానో ఇష్టపడే యువ రాజకీయవేత్త నారా లోకేశ్, మరోవైపు దేశంలోనే సీనియర్ మోస్ట్ రాజకీయవేత్త చంద్రబాబు.. ఇద్దరూ కలిసి తనకు ఇచ్చిన ఆతిథ్యం మోదీకి మెమరబుల్ గానే నిలిచిందని చెప్పాలి.
తెలంగాణలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటుగా బీజేపీ తెలంగాణ శాఖ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాలుపంచుకునేందుకు ఆదివారం మోదీ హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన చంద్రబాబు ఇంటికి వెళ్లారు. ప్రధాని హోదాలో ఉన్న మోదీ తమ ఇంటికి రావడంతో బాబు ఫ్యామిలీ… మోదీని విశిష్ట అతిథిగా పరిగణించింది. ఈ సందర్భంగా తెలుగుదనం ఉట్టిపడేలా సంప్రదాయ వంటకాలను తయారు చేయించిన బాబు ఫ్యామిలీ మోదీకి పసందైన విందును అందించింది.
చంద్రబాబు, లోకేశ్ లు ఇచ్చిన విందుతో మైమరచిన మోదీ దాని నుంచి తేరుకునేలోపే… మరో స్పెషల్ ఆయన ముందు ప్రత్యక్షమైంది. తమ ఇంటికి వస్తున్న మోదీకి అరుదైన బహుమతిని తయారు చేయించిన బాబు ఫ్యామిలీ.. దానిని మోదీ చేతిలో పెట్టింది.
ఈ బహుమతి ఏమిటన్న విషయానికి వస్తే… వెంకటగిరి చేనేత కళాకారులు రూపొందించిన తిరుమల శ్రీవేంకటేశ్వరుడి చిత్రపటాన్ని బాబు ఫ్యామిలీ మోదీకి అందించింది. ఈ చిత్రపటం ప్రత్యేకత ఏమిటంటే.. ఈ చిత్రపటంపై శ్రీవారిని కీర్తించే శ్లోకం ఉంది. అంతేకాదండోయ్… ఈ చిత్రపటం తయారీకి ప్రత్యేకమైన జామ్దారీ నేతను వినియోగించారట. ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ, ఆధ్యాత్మిక, చేనేత కళా వైభవానికి గుర్తుగా బాబు ఫ్యామిలీ ఈ చిత్రపటాన్ని మోదీకి అందజేసిందట.
కూటమిని అధికారంలోకి తీసుకురావడంలో కీలక భూమిక పోషించిన టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ తో మోదీ అత్యంత స్నేహపూర్వకంగా మెలగుతున్న సంగతి తెలిసిందే. మోదీ అమరావతి వచ్చినా, లోకేశ్ ఢిల్లీ వెళ్లినా…వీరిద్దరి కలయిక అందరినీ ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే.
అలాంటిది తమ ఇంటికి మోదీ రావడంతో లోకేశ్ తన కుటుంబ సభ్యులందరితో కలిసి మోదీకి గుర్తుండిపోయే ఆతిథ్యం ఇచ్చారు. చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరితో పాటుగా నారా లోకేశ్, ఆయన సతీమణి బ్రాహ్మణి, వారి కుమారుడు నారా దేవాన్ష్.. అందరూ కలిసి మోదీకి చిత్రపటాన్ని అందించారు.
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…