Political News

అంబానీకి రైతు ఉద్యమ సెగ

అటు తిరిగి ఇటు తిరిగి రైతుల ఉద్యమసెగ అంబానీకి గట్టిగానే తగులుతోంది. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ తో పంజాబ్, హర్యానా, మహారాష్ట్రలోని రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. గడచిన 34 రోజులుగా ఢిల్లీ-హర్యానా సరిహద్దుల్లోని సింఘూ ప్రాంతంలో రైతులు చేస్తున్న ఉద్యమసెగ యావత్ దేశమంతా పాకుతోంది.

రైతుల ఉద్యమాన్ని ఎలాగైనా మాన్పించాలని కేంద్రం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్న సాధ్యం కావటం లేదు. ఎందుకంటే నూతన వ్యవసాయ చట్టాలను రద్ద చేయటానికి కేంద్రప్రభుత్వం సిద్ధంగా లేదు కాబట్టి. కేంద్రం చేసిన చట్టాలు అంబానీలు, అదానీల ప్రయోజనాల కోసమే అనేది రైతుసంఘాల ఆరోపణ. ఇందుకు తగ్గట్లే ఉత్తరాధిలోని చాలా చోట్ల ఏర్పాటు చేస్తున్న కోల్డుస్టోరేజీలు అదాని కంపెనీలవనే ప్రచారం ఊపందుకుంది. దాంతో రైతులు రగిలిపోతున్నారు.

టవర్ల ధ్వంసం…

సో కేంద్రప్రభుత్వం మీద కోపమంతా అంబనీలు, అదానీలపై మళ్ళింది. అందుకనే పంజాబులో జియో టెలికాం టవర్లపై రైతులు చూపించారు. జియో టెలికం కంపెనీకి ఉన్న టవర్లలో 1500 టవర్లను రైతులు ధ్వంసం చేశారు. మొత్తం మీద 9 వేల టవర్లపై రైతులు, రైతు సంఘాలు, స్ధానికులు దాడులు చేశారు. ఈ 9 వేల టవర్లలో కొన్నింటిని ధ్వంసం చేయటం, మరికొన్నింటికి విద్యుత్ తదితర కనెక్షన్లను పీకేయటం, మరికొన్నింటి రిసీవర్లను + జనరేటర్లను ఆందోళణకారులు పగలగొట్టేశారు.

ప్రభుత్వం సీరియస్

రోజురోజుకు టెలికాం టవర్లపై పెరిగిపోతున్న దాడుల విషయమై ప్రభుత్వం సీరియస్ అయిపోయింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేయటం మంచిది కాదని సీఎం అమరేందర్ సింగ్ రైతులకు విజ్ఞప్తి చేశారు. ఆస్తులపై దాడులు చేసే వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోమని పోలీసులకు ఆదేశాలిచ్చారు. మొత్తానికి కేంద్రం మీద కోపం కాస్త రిలయన్స్ జియో టవర్లపై ప్రభావం చూపుతోంది.

This post was last modified on December 29, 2020 7:21 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

‘కొండా’నే వణికిస్తున్న నంబర్ 5 !

చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…

5 hours ago

రోజాకు రంగు ప‌డుతోంది..

ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో న‌టించిన రోజా.. రంగుప‌డుద్ది అనే డైలాగుతో అల‌రించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…

6 hours ago

కేసీఆర్ ఆ పని ఎందుకు చేయట్లేదంటే…

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డ్డ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా…

9 hours ago

‘పార’పట్టిన పద్మశ్రీ !

తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…

9 hours ago

సమీక్ష – ప్రసన్నవదనం

ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…

10 hours ago

నోట్ల కట్టలను వదలని శేఖర్ కమ్ముల

దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…

10 hours ago