Political News

అంబానీకి రైతు ఉద్యమ సెగ

అటు తిరిగి ఇటు తిరిగి రైతుల ఉద్యమసెగ అంబానీకి గట్టిగానే తగులుతోంది. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ తో పంజాబ్, హర్యానా, మహారాష్ట్రలోని రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. గడచిన 34 రోజులుగా ఢిల్లీ-హర్యానా సరిహద్దుల్లోని సింఘూ ప్రాంతంలో రైతులు చేస్తున్న ఉద్యమసెగ యావత్ దేశమంతా పాకుతోంది.

రైతుల ఉద్యమాన్ని ఎలాగైనా మాన్పించాలని కేంద్రం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్న సాధ్యం కావటం లేదు. ఎందుకంటే నూతన వ్యవసాయ చట్టాలను రద్ద చేయటానికి కేంద్రప్రభుత్వం సిద్ధంగా లేదు కాబట్టి. కేంద్రం చేసిన చట్టాలు అంబానీలు, అదానీల ప్రయోజనాల కోసమే అనేది రైతుసంఘాల ఆరోపణ. ఇందుకు తగ్గట్లే ఉత్తరాధిలోని చాలా చోట్ల ఏర్పాటు చేస్తున్న కోల్డుస్టోరేజీలు అదాని కంపెనీలవనే ప్రచారం ఊపందుకుంది. దాంతో రైతులు రగిలిపోతున్నారు.

టవర్ల ధ్వంసం…

సో కేంద్రప్రభుత్వం మీద కోపమంతా అంబనీలు, అదానీలపై మళ్ళింది. అందుకనే పంజాబులో జియో టెలికాం టవర్లపై రైతులు చూపించారు. జియో టెలికం కంపెనీకి ఉన్న టవర్లలో 1500 టవర్లను రైతులు ధ్వంసం చేశారు. మొత్తం మీద 9 వేల టవర్లపై రైతులు, రైతు సంఘాలు, స్ధానికులు దాడులు చేశారు. ఈ 9 వేల టవర్లలో కొన్నింటిని ధ్వంసం చేయటం, మరికొన్నింటికి విద్యుత్ తదితర కనెక్షన్లను పీకేయటం, మరికొన్నింటి రిసీవర్లను + జనరేటర్లను ఆందోళణకారులు పగలగొట్టేశారు.

ప్రభుత్వం సీరియస్

రోజురోజుకు టెలికాం టవర్లపై పెరిగిపోతున్న దాడుల విషయమై ప్రభుత్వం సీరియస్ అయిపోయింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేయటం మంచిది కాదని సీఎం అమరేందర్ సింగ్ రైతులకు విజ్ఞప్తి చేశారు. ఆస్తులపై దాడులు చేసే వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోమని పోలీసులకు ఆదేశాలిచ్చారు. మొత్తానికి కేంద్రం మీద కోపం కాస్త రిలయన్స్ జియో టవర్లపై ప్రభావం చూపుతోంది.

Satya

Recent Posts

ఓడిన చోటే గెలిచి చూపించింది

శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…

40 minutes ago

చిరు లీక్ చేశాడు… నందిని కన్ఫమ్ చేసింది

మెగాస్టార్ చిరంజీవి సినిమా రహస్యాలను లీక్ చేయడంలో ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా టైటిల్‌ను అనుకోకుండా రివీల్…

2 hours ago

జగన్.. బాలయ్య సాయం కోరిన వేళ..!

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… టీడీపీ ఎమ్మెల్యే, టాలీవుడ్ అగ్ర నటుడు నందమూరి…

2 hours ago

డీఎస్సీపై గగ్గోలు… నీట్‌పై మౌనం..?

"ఏనుగు పోతుంటే చూడరు.. చీమ కుడితే గగ్గోలు పెడతారు" అనే సామెత రాజకీయాలకు కూడా సరిగ్గా సరిపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.…

2 hours ago

వంద దేవుళ్ళు తల్లిది పెద్ద టాలెంటే

ఇటీవలే విడుదలైన వంద దేవుళ్ళులో కథ మొత్తం ఆర్టిస్ట్ స్వసిక చుట్టూ నడుస్తుంది. భర్తను కోల్పోయి పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లల…

3 hours ago

వింటేజ్ హీరో నెక్స్ట్ ఏం చేయబోతున్నారో

కంబ్యాక్ అవ్వాలనే సంకల్పంతో నిర్మాతగా మారి మరీ హీరోగా నటించిన వడ్డే నవీన్ కు ఆశించిన స్వాగతం దక్కలేదు. ట్రాన్స్…

5 hours ago