ప్రజాప్రతినిధుల విషయంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజాప్రతినిధుల విషయంలో గౌరవాన్ని పాటించి తీరాల్సిందేనని తెలిపింది. దాదాపు లక్షల మంది ఓట్లు వేసి.. గెలిపించిన ప్రజా ప్రతినిధుల విషయంలో అగౌరవంగా వ్యవహరించేందుకు పోలీసులకు, అధికారులకు ఎలాంటి హక్కులు ఉన్నాయో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రాల హోం శాఖలను కూడా ఆదేశించింది.
తాజాగా ఓ కేసు విచారణ సందర్భంగా ఎమ్మెల్యే విషయంలో పోలీసులు నమోదు చేసిన కేసులో ఆయనను మిస్టర్ అని సంబోధించడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ప్రజా ప్రతినిధుల పేర్ల ముందు.. గౌరవనీయ(రెస్పెక్టెడ్) అని రాయాల్సిందేనని స్పష్టం చేసింది.
ఇది వ్యక్తులకు ఇస్తున్న గౌరవం కాదని.. ప్రజాప్రతినిధులుగా రెండు లక్షల మందికి పైగా వారు బాధ్యత వహిస్తున్నందన.. ప్రజలకు ఇచ్చే గౌరవమని పేర్కొంది. కేసు ఎలాంటిదైనా.. నేరం ఎలాంటిదైనా.. ప్రజా ప్రతినిధుల పేర్ల ముందు గౌరవనీయ అనే పదం చేర్చాల్సిందేనని తెలిపింది.
ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనమని పేర్కొంది. అంతేకాదు.. సాధారణ పౌరుల విషయంలోనూ పోలీసులు హద్దులు మీరుతున్నారని.. ఇది సరికాదని పేర్కొంది. రూల్ ఆఫ్ లా ప్రకారం.. దేశంలోని ప్రతి ఒక్కరూ గౌరవానికి అర్హులేనని స్పష్టం చేసింది.
పోలీసులు ప్రత్యేక చట్టాలు రాసుకున్నారా? అని ఈ సందర్భంగా న్యాయమూర్తి ప్రశ్నించారు. అలా కానప్పుడు.. భారత రాజ్యాంగం అందరినీ సమానం చూస్తుందని.. సామాన్య పౌరులకు కూడా ప్రభుత్వ కార్యాలయాల్లోనూ.. పోలీసు స్టేషన్లలోనూ గౌరవం దక్కి తీరాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు పోలీసులకు, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా నోటీసులు జారీ చేసింది.
This post was last modified on May 7, 2026 9:51 pm
పుట్టిన 13 రోజులకే పాస్పోర్ట్ తీసుకోవడం సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతుంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలోని దాసన్నపేటకు చెందిన…
కొన్ని సినిమాల ఫెయిల్యూర్లు కొందరు కెరీర్ల మీద తీవ్ర ప్రభావమే చూపిస్తుంటాయి. ఒక మూవీలో చాలామంది భాగం అయినా.. కొందరి మీదే ఎక్కువ ప్రభావం…
హిట్టు ఫ్లాపు సంగతి ఎలా ఉన్నా తన సినిమా వస్తోందంటే అభిమానులు, ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి కలిగేలా చేసే విజయ్…
మనం సినిమా అక్కినేని కుటుంబానికి ఎంత ప్రత్యేకమో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అందులో మూడు తరాల అక్కినేని హీరోలు…
ఈ శుక్రవారం విడుదల కానున్న ఎపిక్ సినిమా మీద ప్రేక్షకుల్లో ముందు నుంచి మంచి అంచనాలే ఉన్నాయి. కాకపోతే ఇటీవల…
టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబును వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులో అరెస్టు చేసి నిర్బంధించిన నాటి పరిణామాలను మంత్రి నారా…