ప్రజాప్రతినిధుల విషయంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజాప్రతినిధుల విషయంలో గౌరవాన్ని పాటించి తీరాల్సిందేనని తెలిపింది. దాదాపు లక్షల మంది ఓట్లు వేసి.. గెలిపించిన ప్రజా ప్రతినిధుల విషయంలో అగౌరవంగా వ్యవహరించేందుకు పోలీసులకు, అధికారులకు ఎలాంటి హక్కులు ఉన్నాయో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రాల హోం శాఖలను కూడా ఆదేశించింది.
తాజాగా ఓ కేసు విచారణ సందర్భంగా ఎమ్మెల్యే విషయంలో పోలీసులు నమోదు చేసిన కేసులో ఆయనను మిస్టర్ అని సంబోధించడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ప్రజా ప్రతినిధుల పేర్ల ముందు.. గౌరవనీయ(రెస్పెక్టెడ్) అని రాయాల్సిందేనని స్పష్టం చేసింది.
ఇది వ్యక్తులకు ఇస్తున్న గౌరవం కాదని.. ప్రజాప్రతినిధులుగా రెండు లక్షల మందికి పైగా వారు బాధ్యత వహిస్తున్నందన.. ప్రజలకు ఇచ్చే గౌరవమని పేర్కొంది. కేసు ఎలాంటిదైనా.. నేరం ఎలాంటిదైనా.. ప్రజా ప్రతినిధుల పేర్ల ముందు గౌరవనీయ అనే పదం చేర్చాల్సిందేనని తెలిపింది.
ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనమని పేర్కొంది. అంతేకాదు.. సాధారణ పౌరుల విషయంలోనూ పోలీసులు హద్దులు మీరుతున్నారని.. ఇది సరికాదని పేర్కొంది. రూల్ ఆఫ్ లా ప్రకారం.. దేశంలోని ప్రతి ఒక్కరూ గౌరవానికి అర్హులేనని స్పష్టం చేసింది.
పోలీసులు ప్రత్యేక చట్టాలు రాసుకున్నారా? అని ఈ సందర్భంగా న్యాయమూర్తి ప్రశ్నించారు. అలా కానప్పుడు.. భారత రాజ్యాంగం అందరినీ సమానం చూస్తుందని.. సామాన్య పౌరులకు కూడా ప్రభుత్వ కార్యాలయాల్లోనూ.. పోలీసు స్టేషన్లలోనూ గౌరవం దక్కి తీరాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు పోలీసులకు, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా నోటీసులు జారీ చేసింది.
This post was last modified on May 7, 2026 9:51 pm
జంతర్ మంతర్లో కాక్రోచ్ జనతా పార్టీ చేసిన ఆందోళన విరమించినప్పటికీ అది సృష్టించిన తుఫాన్ కొనసాగుతుంది. సద్దుమణిగిందనుకున్న విషయాన్ని శుక్రవారం…
చెన్నై లవ్ స్టోరీ పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లలో యూనిట్ సభ్యులు కొందరు వాడిన మాట ఒకటుంది. అదే కిరణ్ అబ్బవరం హ్యాట్రిక్…
ఆ మధ్య జరిగిన లెనిన్ సక్సెస్ మీట్ లో కింగ్ నాగార్జున ఒక మాట అన్నారు. ది ఒడిస్సి లాంటి…
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…
టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…
సూర్య, వెంకీ అట్లూరి కాంబినేషన్ లో తెరకెక్కిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా ఈ నెల 14న థియేటర్లలోకి రానుంది.…