కరోనా కారణంగా యావత్ ప్రపంచంలో ఇప్పుడు ప్రత్యేక పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి కర్ణాటకలో చోటు చేసుకుంది. లాక్ డౌన్ వేళలోనే పెళ్లి చేసుకుంటున్నారు కొందరు. ఇందుకు అధికారుల వద్ద పర్మిషన్ తీసుకుంటున్నారు. లాక్ డౌన్ నిబంధనల్ని పాటిస్తూ పెళ్లిళ్లు చేసుకున్న ఒక జంటకు అధికారులు ఊహించని షాకిచ్చారు.
కర్ణాటకలోని ఉడిపి జిల్లా కుత్యూరులో ఒక జంటకు పెళ్లి జరిగింది. అధికారులు సూచించిన దానికి తగ్గట్లే అతి తక్కువమందితో వారి పెళ్లి కార్యక్రమం పూర్తి అయ్యింది. పెళ్లి చేసుకున్న అమ్మాయిని వెంటపెట్టుకొని తమ ఊరికి తీసుకెళ్లాడు పెళ్లికొడుకు. గ్రామానికి చేరుకున్న వారు ఫస్ట్ నైట్ కార్యక్రమానికి రంగం సిద్ధం చేసుకున్నారు.
పెళ్లి చేసుకున్న జంట ఊరికి వచ్చి.. ఫస్ట్ నైట్ కోసం రెఢీ అవుతున్న వేళ.. అధికారులు ఎంట్రీ ఇచ్చి షాకిచ్చారు. కరోనా వేళ.. ముందస్తు జాగ్రత్తగా పెళ్లి కొడుకుతో సహా.. పెళ్లికి హాజరైన 26 మంది ముందు హోం క్వారంటైన్ లో ఉండాలని.. అప్పటివరకూ ఫస్ట్ నైట్ ను వాయిదా వేసుకోవాలని ఆరోగ్య శాఖ అధికారులు సూచించారు.
అప్పటివరకూ కోటి ఆశలతో ఉన్న పెళ్లికొడుకు మీద బిందెలతో నీళ్లు పోసిన చందంగా పరిస్థితి మారింది. అప్పటివరకూ ఫస్ట్ నైట్ గురించి కలలు కన్న ఆ పెళ్లి కొడుకు బాధలు అన్నిఇన్ని కావట. నిజమే.. ఇలాంటి పరిస్థితి పగోడికి కూడా రాకూడదని పలువురు వ్యాఖ్యానించటం గమనార్హం.
This post was last modified on May 4, 2020 7:17 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…