Political News

ఎంత పెద్ద నాయకుడు ఫోన్ చేసినా పట్టించుకోకండి: అనిత

టీడీపీ మహిళా నేత, ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత నోట నుంచి వచ్చే మాటలు ఎప్పటికప్పుడు వైరల్ గా మారుతూ ఉంటాయి. అంతేకాకుండా ఆయా వర్గాలకు చెందిన వారిని ఎప్పటికప్పుడు ఆమె షాక్ లకు గురి చేస్తూ ఉంటారు. తాజాగా ఆమె తీసుకున్న ఓ నిర్ణయం పార్టీలతో సంబంధం లేకుండా అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలకు భారీ షాక్ ఇస్తూ ఆమె ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. వాహనాలు నడిపే సమయంలో ట్రాఫిక్ రూల్స్ పాటించని నేతలకు సాధారణ జరిమానాలకు బదులుగా రెట్టింపు జరిమానాలు విధించాలని ఆమె ఆదేశాలు జారీ చేశారు.

అనకాపల్లి జిల్లాలో మంగళవారం ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ వినియోగంపై ఓ అవగాహన ర్యాలీ జరిగింది. నక్కపల్లి పరిధిలో జరిగిన ఈ ర్యాలీలో హోం మంత్రి హోదాలో అనిత స్వయంగా పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై నమోదు అవుతున్న కేసుల్లో రాజకీయ నేతల జోక్యం అదికంగా ఉంటోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాఫిక్ రూల్స్ వాయిలేషన్ కేసులకు సంబంధించి ఇకపై ఎంత పెద్ద రాజకీయ నేత ఫోన్ చేసినా పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆమె పోలీసు అధికారులకు సూచించారు.

ఇక రాజకీయ నేతలే ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే ఎలా అనే అంశం కూడా ఈ సందర్భంగా చర్చకు రాగా.. దానిపై అనిత తనదైన శైలిలో స్పందించారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన సందర్భాల్లో సామాన్యులకు జరిమానాలు విధించడం సరైనదేనని చెప్పిన అనిత… ఈ ఉల్లంఘనలకు రాజకీయ నేతలు పాల్పడితే..వారిపై డబుల్ ఫైన్ లు విధించాలని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. నేతలు సామాన్య జనానికి ఆదర్శంగా నిలబడాలన్న మాటను గట్టిగానే పలికిన అనిత… ట్రాఫిక్ నిబంధనలను నేతలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. లేని పక్షంలో వారికి రెట్టింపు జరిమానాలు తప్పవన్నారు. ఈ విషయంలో ఏ పార్టీ వారన్న అంశాన్ని చూడకుండా వ్యవహరించాలని ఆమె పోలీసు అధికారులకు సూచించారు.

This post was last modified on May 6, 2026 10:13 am

Share

Recent Posts

అనుప‌మ ఆ రోజు ఏడ్చింది అందుకా?

గ‌త కొన్ని రోజులుగా మ‌ల‌యాళ క‌థానాయిక అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ బ్రేకప్ వ్య‌వ‌హారం సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే.…

4 hours ago

తమిళ ప్రేక్షకుల ప్రేమ ఎందుకు తక్కువంటే

తాజాగా విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ తెలుగులో చూపిస్తున్న జోరు తమిళంలో ప్రదర్శించడం లేదన్నది వాస్తవం. ఓపెనింగ్స్ నెంబర్లు పోల్చుకుని…

4 hours ago

సోష‌ల్ మీడియా ఎటాక్… ఫరియా క‌న్నీళ్లు

జాతిర‌త్నాలు సినిమాతో మంచి గుర్తింపు సంపాదించి, తెలుగులో వ‌రుస‌గా సినిమాలు చేస్తున్న క‌థానాయిక‌.. ఫ‌రియా అబ్దుల్లా. థియేట‌ర్ బ్యాగ్రౌండ్ నుంచి…

7 hours ago

ప‌వ‌న్ ఒక్క ఆలోచ‌న‌… 5 వేల కుటుంబాల క‌ళ్ల‌లో మెరుపులు!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. అట‌వీశాఖ మంత్రిగా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆయ‌న చేసిన ఒకే ఒక్క ఆలోచ‌న.. 5…

7 hours ago

రాహుల్ రాముడైతే… జగ్గారెడ్డి హనుమంతుడు

పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ వీరాభిమాని జగ్గారెడ్డి వ్యవహార శైలి గురించి తెలిసిందే. తన…

8 hours ago

కేటీఆర్ బిడ్డ చదువుకోవడానికి గొప్ప కాలేజీ లేదా

‘‘రేపు నా బిడ్డను డ్రాప్ చేయడానికి అమెరికా వెళ్లాలి...ఇక్కడే చదువుకోవచ్చు కదా అని అడిగితే...అంత గొప్ప కాలేజీలు ఇక్కడ ఎక్కడున్నాయి…

8 hours ago