Political News

‘కల్తీ నెయ్యి’లో ఆ ఇద్దరిదే కీలక భూమిక?

కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి ప్రసాదం తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారన్న కేసులో రోజుకో కొత్త అంశం బయటకు వస్తోంది. వైసీపీ అధికారంలో ఉండగా యథేచ్ఛగా సాగిన ఈ దందాలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ బాబాయి, టీటీడీ మాజీ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి హస్తం ఉన్నట్లుగా ఇప్పటికే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

తాజాగా జగన్ కు అత్యంత సన్నిహితులుగా పేరుగాంచిన వైసీపీ కీలక నేతలు, ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు భూమన కరుణాకర రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డిల పాత్ ఉన్నట్లుగా తాజాగా వెల్లడైంది. కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏపీ సర్కారు ఏర్పాటు చేసిన దినేశ్ కుమార్ కమిషన్ నివేదిక ఈ కొత్త విషయాన్ని వెల్లడించింది.

భూమన కరుణాకర రెడ్డి తిరుపతి ఎమ్మెల్యేగా వ్యవహరించారు. అంతేకాకుండా ఆయన టీటీడీ చైర్మన్ గానూ పనిచేశారు. ఇక చెవిరెడ్డి భాస్కరరెడ్డి చంద్రగిరి ఎమ్మెల్యేగా కొనసాగిన సంగతి తెలిసిందే. తిరుమలకు సంబంధించిన ఆయా వస్తువుల కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో వీరిద్దరూ సభ్యులుగా కొనసాగారట.

కమిటీకి కన్వీనర్ గా టీటీడీ ప్రొక్యూర్ మెంట్ విభాగం జనరల్ మేనేజర్ వ్యవహరిస్తారు. వైసీపీ హయాంలో ఈ కమిటీలో ప్రత్యేక ఆహ్వానితులుగా భూమన, చెవిరెడ్డి కొనసాగారు. నెయ్యి కొనుగోలుకు సంబంధించి ఈ కమిటీ కొన్ని నిబంధనలను ఏర్పాటు చేసింది. ఏదేని ఎంపిక చేసిన డెయిరీని రెండేళ్లపాటు ఎంప్యానల్ చేయాలని ఈ కమిటీ పక్కాగా చెబుతోంది.

అయితే ఈ కమిటీ సమావేశాన్ని ప్రత్యేక ఆహ్వానితుల హోదాలో ఏర్పాటు చేసిన భూమన, చెవిరెడ్డిలు.. కమిటీ కన్వీనర్ లేకుండానే కొనసాగించారు. అసలు కమిటీ సమావేశాన్ని కమిటీ కన్వీనర్ కు సమాచారం ఇవ్వకుండా… కమిటీలో ఉన్న సభ్యుల్లో ఒక్కరిని మాత్రమే పిలిచి…మిగిలిన కమిటీ సభ్యులనూ పిలవకుండానే సమావేశాన్ని వారు కొనసాగించారు. వ్యూహాత్మకంగా జరిగిన ఈ సమావేశంలో డెయిరీల ఎంప్యానల్ ను ఎత్తివేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతోనే కల్తీ నెయ్యి సరఫరా చేసే కంపెనీలు టీటీడీ టెండర్లలో పాలుపంచుకుని ఎంచక్కా టెండర్లను దక్కించుకున్నాయి.

ఈ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం విశ్రాంత ఐఏఎస్ అధికారి దినేశ్ కుమార్ నేతృత్వంలో కమిషన్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిషన్ కల్తీ నెయ్యి వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేపట్టింది. తన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఈ నివేదికలోనే చెవిరెడ్డి, భూమనల చేతివాటాన్ని కమిషన్ విస్పష్టంగా ప్రస్తావించింది.

కల్తీ నెయ్యి సరఫరా చేసే కంపెనీలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకే కొనుగోలు కమిటీ సమావేశాన్ని వారిద్దరూ అత్యంత రహస్యంగా నిర్వహించారని, డెయిరీల ఎంప్యానల్ ను పట్టించుకోకుండా టెండర్లకు ప్రకటన ఇచ్చేలా వారు యంత్రాంగాన్ని నడిపారని కమిషన్ తేల్చిచెప్పింది. కమిషన్ నివేదిక అందిన నేపథ్యంలో వారిద్దరిపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందోనన్న దానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.

This post was last modified on May 3, 2026 10:19 am

Share

Recent Posts

స్థానిక ఎన్నికలకు SIR చిక్కుముడి?

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ( SIR ) చిక్కుముడిగా మారింది.…

4 minutes ago

జనసేన ఎమ్మెల్యేపై చంద్రబాబు అసంతృప్తి

కూటమిలో భాగస్వామి అయిన జనసేన పార్టీ ఎమ్మెల్యే పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు బాగోలేని…

2 hours ago

ఏపీలో పెరిగిపోతున్న బీపీ… ఆ జిల్లాలో మరీ ఎక్కువ!

ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…

3 hours ago

సినిమా షూటింగ్… ఐదుసార్లు చావుకు దగ్గరగా

సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…

8 hours ago

తెలంగాణా కాంగ్రెస్లో టిక్.. టిక్.. టిక్

తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…

11 hours ago

రంభ ఊర్వశి సరే… మరి అప్పట్లో ఎలా

సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…

11 hours ago