కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి ప్రసాదం తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారన్న కేసులో రోజుకో కొత్త అంశం బయటకు వస్తోంది. వైసీపీ అధికారంలో ఉండగా యథేచ్ఛగా సాగిన ఈ దందాలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ బాబాయి, టీటీడీ మాజీ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి హస్తం ఉన్నట్లుగా ఇప్పటికే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
తాజాగా జగన్ కు అత్యంత సన్నిహితులుగా పేరుగాంచిన వైసీపీ కీలక నేతలు, ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు భూమన కరుణాకర రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డిల పాత్ ఉన్నట్లుగా తాజాగా వెల్లడైంది. కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏపీ సర్కారు ఏర్పాటు చేసిన దినేశ్ కుమార్ కమిషన్ నివేదిక ఈ కొత్త విషయాన్ని వెల్లడించింది.
భూమన కరుణాకర రెడ్డి తిరుపతి ఎమ్మెల్యేగా వ్యవహరించారు. అంతేకాకుండా ఆయన టీటీడీ చైర్మన్ గానూ పనిచేశారు. ఇక చెవిరెడ్డి భాస్కరరెడ్డి చంద్రగిరి ఎమ్మెల్యేగా కొనసాగిన సంగతి తెలిసిందే. తిరుమలకు సంబంధించిన ఆయా వస్తువుల కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో వీరిద్దరూ సభ్యులుగా కొనసాగారట.
కమిటీకి కన్వీనర్ గా టీటీడీ ప్రొక్యూర్ మెంట్ విభాగం జనరల్ మేనేజర్ వ్యవహరిస్తారు. వైసీపీ హయాంలో ఈ కమిటీలో ప్రత్యేక ఆహ్వానితులుగా భూమన, చెవిరెడ్డి కొనసాగారు. నెయ్యి కొనుగోలుకు సంబంధించి ఈ కమిటీ కొన్ని నిబంధనలను ఏర్పాటు చేసింది. ఏదేని ఎంపిక చేసిన డెయిరీని రెండేళ్లపాటు ఎంప్యానల్ చేయాలని ఈ కమిటీ పక్కాగా చెబుతోంది.
అయితే ఈ కమిటీ సమావేశాన్ని ప్రత్యేక ఆహ్వానితుల హోదాలో ఏర్పాటు చేసిన భూమన, చెవిరెడ్డిలు.. కమిటీ కన్వీనర్ లేకుండానే కొనసాగించారు. అసలు కమిటీ సమావేశాన్ని కమిటీ కన్వీనర్ కు సమాచారం ఇవ్వకుండా… కమిటీలో ఉన్న సభ్యుల్లో ఒక్కరిని మాత్రమే పిలిచి…మిగిలిన కమిటీ సభ్యులనూ పిలవకుండానే సమావేశాన్ని వారు కొనసాగించారు. వ్యూహాత్మకంగా జరిగిన ఈ సమావేశంలో డెయిరీల ఎంప్యానల్ ను ఎత్తివేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతోనే కల్తీ నెయ్యి సరఫరా చేసే కంపెనీలు టీటీడీ టెండర్లలో పాలుపంచుకుని ఎంచక్కా టెండర్లను దక్కించుకున్నాయి.
ఈ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం విశ్రాంత ఐఏఎస్ అధికారి దినేశ్ కుమార్ నేతృత్వంలో కమిషన్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిషన్ కల్తీ నెయ్యి వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేపట్టింది. తన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఈ నివేదికలోనే చెవిరెడ్డి, భూమనల చేతివాటాన్ని కమిషన్ విస్పష్టంగా ప్రస్తావించింది.
కల్తీ నెయ్యి సరఫరా చేసే కంపెనీలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకే కొనుగోలు కమిటీ సమావేశాన్ని వారిద్దరూ అత్యంత రహస్యంగా నిర్వహించారని, డెయిరీల ఎంప్యానల్ ను పట్టించుకోకుండా టెండర్లకు ప్రకటన ఇచ్చేలా వారు యంత్రాంగాన్ని నడిపారని కమిషన్ తేల్చిచెప్పింది. కమిషన్ నివేదిక అందిన నేపథ్యంలో వారిద్దరిపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందోనన్న దానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.
This post was last modified on May 3, 2026 10:19 am
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ 2024…
ఏపీ సీఎం చంద్రబాబు గత 2024లో కూటమి కట్టి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత..…
బాలీవుడ్లో బలమైన ముద్ర వేసిన దక్షిణాది దర్శకుల్లో ప్రియదర్శన్ ఒకరు. ఆయన అక్కడ ఎన్నో కామెడీ సినిమాలు తీసి హిట్లు…
వైసీపీ నేతలకు మరో చిక్కు ఎదురు కానుందా? మరో కీలక పరిణామాన్ని ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుందా? అంటే.. ఔననే…
నాలుగు నెలల నుంచి విజయ్ అభిమానులు ఎదురు చూస్తున్న జన నాయకుడు వ్యవహారాలు మెల్లగా ఒక్కొక్కటి కొలిక్కి వస్తున్నాయి. మే…
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, తిరుమల శ్రీవారి దర్శనం ఎంత పుణ్యమని భక్తులు భావిస్తారో.. ఆయన లడ్డూ ప్రసాదాన్ని అంతే…