Political News

లోకేశ్ ‘యాక్షన్ ప్లాన్’ అదిరిందా ?

టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ అద్భుత ఫలితాలు రాబడుతూ సత్తా చాటుతున్నారు. పార్టీ నిర్వహణలో ఇప్పటికే ఓ బెంచ్ మార్క్ విజయాన్ని నమోదు చేసుకున్న లోకేశ్… ఇప్పుడు మంత్రి హోదాలోనూ రికార్డు విక్టరీని నమోదు చేశారు. గురువారం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో లోకేశ్ కార్యాచరణ అద్భుతాన్ని సృష్టించిందని చెప్పాలి. పదో తరగతి ఉత్తీర్ణత శాతాన్ని పెంచే దిశగా లోకేశ్ అమలు చేసిన యాక్షన్ ప్లాన్ రికార్డు ఫలితాలన అందించింది.

2024లో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేపట్టిన తర్వాత టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కేబినెట్ లో విద్యా శాఖ మంత్రిగా లోకేశ్ కీలక బాధ్యతలు చేపట్టారు. ఐటీ, పెట్టుబడుల ప్రోత్సాహం వంటి శాఖలనూ పర్యవేక్షిస్తున్నప్పటికీ విద్యా శాఖపై లోకేశ్ ప్రధాన దృష్టి సారించారు. అందులో భాగంగా పదో తరగతిలో మంచి ఫలితాలు సాధించే దిశగా ఆయన వంద రోజుల యాక్షన్ ప్లాన్ ను అమలు చేశారు.

ఈ ప్లాన్ కింద విద్యార్థులు…ప్రత్యేకించి ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల…అందులోనూ బాలికల విద్యపై నిరంతర పర్యవేక్షణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అందులో ఉపాధ్యాయులతో పాటుగా తల్లిదండ్రులు, ఆయా పాఠశాలలపై విద్యా శాఖ ఉన్నతాధికారులు ఐక్యంగా పనిచేసేలా కార్యాచరణను రూపొందించారు. పిల్లలకు ఉత్తమ విద్యా బోధనతో పాటుగా ఆయా పాఠ్యాంశాలపై విద్యార్థులకు మరింత లోతుగా అవగాహన పెరిగేలా చేశారు. ఇక విద్య నుంచి పిల్లల దృష్టి మరలకుండా ఈ టీం ప్రత్యేకంగా పనిచేసింది.

గురువారం ఏపీలో పదో తరగతి ఫలితాలు వెల్లడి కాగా… గతేడాదితో పోలిస్తే ఉత్తీర్ణతా శాతం భారీగా పెరిగింది. గతేడాది 81.1 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా… ఈ ఏడాది ఆ శాతం ఏకంగా 85.25కు పెరిగింది. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం 72.8 శాతం నుంచి ఏకంగా 78.39 శాతానికి పెరిగింది.

ఇక ఓవరాల్ ఉత్తీర్ణత శాతానికి వస్తే… బాలుర కంటే బాలికలు 5.22 శాతం మేర అధిక ఉత్తీర్ణత సాధించారు. ఈ ఫలితాలను చూస్తే… లొోకేశ్ అమలు చేసిన వంద రోజుల యాక్షన్ ప్లాన్ ఓ రేంజిలో పనిచేసిందని చెప్పక తప్పదు.

Kumar

Recent Posts

ఈసారి పాదయాత్ర ఈజీ కాదేమో జగన్

ఇప్ప‌టి వ‌ర‌కు ఒక లెక్క‌.. ఇక నుంచి మరో లెక్క‌.. అన్న‌ట్టుగా వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ ప‌రిస్థితి…

15 minutes ago

పట్టు వదలకుండా పరిగెత్తాలి పెద్ది

పెద్ది మొదటి వారం పూర్తి చేసుకుని సెకండ్ వీక్ లో అడుగు పెట్టింది. మూడు వందల యాభై కోట్ల వైపు…

46 minutes ago

పవన్ పేరు ఎందుకు మారింది?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…

6 hours ago

కేంద్ర మంత్రుల ‘కార్ పూలింగ్’ షురూ!

పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇందన పొదుపు దిశగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక సూచనలు చేశాక… మన…

6 hours ago

ఏపీ పాఠ‌శాల‌ల్లో చాగంటి పాఠ్యాంశాలు..!

ఏపీ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప్ర‌ముఖ ప్ర‌వ‌చ క‌ర్త చాగంటి కోటేశ్వ‌ర‌రావు ప్ర‌సంగాల‌ను పాఠ్యాంశాలుగా ప్ర‌వేశ పెడుతున్నట్టు ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించి…

7 hours ago

ఆమెకు జీతం రూ.1.4 లక్షలు… భరణం రూ.1.35

ఒక విడాకుల కేసుకు సంబంధించి కోర్టు ఇచ్చిన తీర్పుపై ఇప్పుడు పెద్ద ఎత్తున డిబేట్ జరుగుతోంది. సోషల్ మీడియాలో దీనిపై…

8 hours ago