Movie News

జెట్లీ సినిమాకు పెద్ద షాక్

ఈ శుక్ర‌వారం మంచి అంచ‌నాల మ‌ధ్య రిలీజ‌వుతోంది జెట్లీ సినిమా. ఐతే హైద‌రాబాద్‌లో టాప్ మ‌ల్టీప్లెక్స్ ఛైన్స్ అయిన ఏఎంబీ, ఏఏఏ, ఏఆర్టీ లాంటి థియేట‌ర్ల‌లో ఈ సినిమా విడుద‌ల కావ‌ట్లేదు. ఇంకా చాలా వ‌ర‌కు సింగిల్ స్క్రీన్స్‌లో ఈ చిత్రాన్ని ప్ర‌ద‌ర్శించ‌ట్లేదు. ఇటు ఏషియ‌న్ మూవీస్ సునీల్ నారంగ్ నేతృత్వంలోని థియేట‌ర్లు, అటు దిల్ రాజు సంస్థ‌ ఎస్వీసీకి చెందిన స్క్రీన్ల‌లో ఈ సినిమాను నిషేధించారు. రెవెన్యూ షేరింగ్ విష‌యంలో ఏకాభిప్రాయం కుద‌ర‌క‌పోవ‌డమే ఇందుకు కార‌ణ‌మ‌ని తెలుస్తోంది.

మైత్రీ వాళ్ల‌కు కొన్నేళ్ల నుంచి ఎస్వీసీ, ఏషియ‌న్ వాళ్ల‌తో డిస్ట్రిబ్యూష‌న్, ఎగ్జిబిష‌న్ విష‌యంలో గొడ‌వ‌లు న‌డుస్తున్నాయి. వీళ్ల ఏక‌ఛ‌త్రాధిప‌త్యానికి చెక్ పెడుతూ మైత్రీ సంస్థ సొంతంగా డిస్ట్రిబ్యూష‌న్ ఆఫీసు పెట్టుకుంది. అంతే కాక సింగిల్ స్క్రీన్ల‌ను కొంటోంది. ఐతే దిల్ రాజు, సునీల్ నారంగ్ లాంటి టాప్ ఎగ్జిబిట‌ర్లు క‌లిసి ఇటీవ‌ల 60-50-40 ప‌ద్ధ‌తిలో రెవెన్యూ షేరింగ్ ప్ర‌తిపాద‌న చేశారు. దాని విష‌యంలో ఇండ‌స్ట్రీ నుంచి భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి.

ఇది త‌మ‌కు స‌మ్మ‌తం కాద‌ని కొంద‌రు నిర్మాత‌లు తేల్చి చెప్పారు. కానీ ఎగ్జిబిట‌ర్లు ఆ ప‌ద్ధ‌తినే అనుస‌రిస్తామంటున్నారు. ఐతే మైత్రీ సంస్థ జెట్లీ మూవీకి అలా రెవెన్యూ షేర్ చేయ‌డానికి నిరాక‌రించ‌డంతో జెట్లీ సినిమాను త‌మ స్క్రీన్ల‌లో ప్ర‌దర్శించ‌కూడ‌ద‌ని ఏషియ‌న్ మూవీస్, ఎస్వీసీ సంస్థ‌లు నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది.

మామూలుగా కొత్త సినిమాలు రిలీజ‌వుతుంటే.. నిర్మాత‌లు రాజీ ప‌డి ఎగ్జిబిట‌ర్ల డిమాండ్ల‌కు త‌లొంచుతుంటారు. కానీ మైత్రీ సంస్థ మాత్రం అలా చేయ‌డం లేదు. ఇంత‌కుముందు పుష్ప‌-2 సినిమా విష‌యంలోనూ ప్ర‌సాద్ మ‌ల్టీప్లెక్స్‌తో రెవెన్యూ షేరింగ్ విష‌యంలో గొడ‌వ జ‌రిగి అక్క‌డ ఆ చిత్రం ప్ర‌ద‌ర్శితం కాలేదు.

కారణాలు ఏవైనా స‌రే.. త‌ర‌చుగా మైత్రీ వాళ్ల సినిమాలు రిలీజ్ ముంగిట స‌మ‌స్య‌లు ఎదుర్కొంటుండ‌డం హీరోల అభిమానుల అసంతృప్తికి కూడా దారి తీస్తోంది. మైత్రీ రిలీజ్ చేసిన‌ స‌లార్, రాజాసాబ్.. ఆ సంస్థ ప్రొడ్యూస్ చేసిన‌ పుష్ప‌-2 లాంటి భారీ చిత్రాల‌కు కూడా త‌ల‌నొప్పులు త‌ప్ప‌లేదు. ఇప్పుడు జెట్లీ సినిమా ప‌రిస్థితి చూస్తుంటే.. ఈ సంస్థ నుంచి రాబోయే పెద్ది, ఫౌజీ, డ్రాగ‌న్ లాంటి భారీ చిత్రాల ప‌రిస్థితి ఏమ‌వుతుందో అని ఆయా చిత్రాల అభిమానులు ఆందోళ‌న చెందుతున్నారు.

This post was last modified on May 1, 2026 12:06 am

Share

Recent Posts

జనసేన ఎమ్మెల్యేపై చంద్రబాబు అసంత్రుప్తి

కూటమిలో భాగస్వామి అయిన జనసేన పార్టీ ఎమ్మెల్యే పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు బాగోలేని…

13 minutes ago

ఏపీలో పెరిగిపోతున్న బీపీ… ఆ జిల్లాలో మరీ ఎక్కువ!

ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…

1 hour ago

సినిమా షూటింగ్… ఐదుసార్లు చావుకు దగ్గరగా

సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…

6 hours ago

తెలంగాణా కాంగ్రెస్లో టిక్.. టిక్.. టిక్

తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…

9 hours ago

రంభ ఊర్వశి సరే… మరి అప్పట్లో ఎలా

సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…

9 hours ago

అభిమానుల విన్నపం నాగ్ పట్టించుకోలేదా

వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…

10 hours ago