Political News

జన్‌ మ‌న్ కీ బాత్ వినేందుకు మోడీ భ‌య‌ప‌డుతున్నారే?!

దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి త‌న మ‌న‌సులోని భావాల‌ను పంచుకునేందుకు ఎంచుకున్న కార్య‌క్ర‌మ‌మే.. మ‌న్‌కీ బాత్‌. త‌న (ప్ర‌ధానిగా) మ‌న‌సులోని భావాల‌ను ప్ర‌జల‌కు వివ‌రించే ఈ కార్య‌క్ర‌మాన్ని కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌లు చేస్తోంది. 2015లో ప్రారంభించిన ఈ మ‌న్ కీ బాత్‌కు ఆదిలో మంచి గుర్తింపు, ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్ర‌జ‌లు.. క‌ర్ష‌కులు.. ప్ర‌ధాని త‌మ‌కోసం ఏం చెబుతారో.. అని ఆస‌క్తిగా ఎదురు చూసిన సంద‌ర్భాలు అనేకం ఉన్నాయి. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు(మోడీ రెండో సారి పీఎం అయ్యాక‌) కూడా మ‌న్ కీ బాత్ ప్ర‌సారం అవుతూనే ఉంది.

తాజాగా ఈ ఏడాదికి(2020) సంబంధించిన చివ‌రి మ‌న్ కీ బాత్ కార్య‌క్ర‌మం ముగిసింది. అయితే.. గతంలో జ‌రిగిన మ‌న్ కీ బాత్‌కి.. ఇప్పుడు జ‌రిగిన దానికి మ‌ధ్య చాలా వ్య‌త్యాసం వుంది. గ‌డిచిన 27 రోజులుగా దేశ‌వ్యాప్తంగా రైతాంగం నూత‌న వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై రోడ్డెక్కి భీక‌ర‌మైన చ‌లిని త‌ట్టుకుని మ‌రీ ఉద్య‌మం చేస్తోంది. స‌ద‌రు చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల‌ని ఘోషిస్తోంది. అయితే..ఈ ఉద్య‌మాన్ని ఏదో ఒక‌ర‌కంగా ప‌క్క‌దారి ప‌ట్టించేందుకు.. రైతుల మ‌ధ్య విభేదాలు తీసుకువ‌చ్చి.. విడ‌గొట్టి రాజ‌కీయం చేసేందుకు మోడీ స‌ర్కారు చేయ‌ని ప్ర‌య‌త్నం లేద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఈ క్ర‌మంలో మేధావుల నుంచి సామాన్యుల వ‌ర‌కు అంద‌రూ రైతుల‌కు అండ‌గా నిలిచారు.

అదేస‌మ‌యంలో క‌రోనా వ్యాక్సిన్ విష‌యంలో పిల్లి మొగ్గ‌లు వేస్తున్న ప్ర‌భుత్వంపై .. ప్ర‌జ‌లు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. ఎప్పుడు జ‌న‌బాహుళ్యంలోకి వ‌స్తుందో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొన్న వ్యాక్సిన్‌.. అదిగో ఇదిగో.. అటూ.. మోడీ స‌ర్కారు కాల యాప‌న చేస్తోంది. దీంతో ఈ రెండు విష‌యాల‌పైనా ప్ర‌ధాని త‌న మ‌న‌సులో ఏముందో చెబుతార‌ని.. అంద‌రూ ఎదురు చూశారు. అయితే. ఆయ‌న దీనికి భిన్నంగా.. వ్య‌వ‌హ‌రించారు. ఈ క్ర‌మంలో .. జ‌న్ కీ బాత్ సునో.. మోదీ జీ!! అంటూ.. యూట్యూబ్ స‌హా ప‌లు సామాజిక మాధ్య‌మాల్లో వ‌చ్చిన మ‌న్ కీ బాత్ వీడియోల కింద కామెంట్ల‌ను కుమ్మ‌రించారు. గ‌తంలో లైకులు జోరుగా వ‌చ్చిన మ‌న్ కీబాత్‌కు ఇప్పుడు డిజ్‌లైకులు ప్ర‌వాహంగా వ‌చ్చాయి. దీంతో ప్ర‌ధాని మ‌న్‌కీ బాత్ ఫెయిలైపోయింది.

అయితే.. జ‌న్ మ‌న్‌కీ బాత్ వినిపించుకునేందుకు ఇష్ట‌ప‌డలేదేమో.. స‌ద‌రు సోష‌ల్ మీడియాలో కేవ‌లం లైకులు మాత్ర‌మే క‌నిపించేలా వ్య‌వ‌స్థ‌లో మార్పులు కేవ‌లం గంట వ్య‌వ‌ధిలోనే జ‌రిగిపోవ‌డం గ‌మ‌నార్హం. సో.. దీనిని బ‌ట్టి.. జ‌న్ మ‌న్‌కీ బాత్ వినేందుకు మోడీ భ‌య‌ప‌డుతున్నారే! అనే వాద‌న బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Satya

Recent Posts

ప్రభాస్ ఫోన్ లో ఆ వాల్ పేపర్ ఎందుకుంది?

ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…

4 hours ago

“మ‌రో వందేళ్ల‌యినా… కాంగ్రెస్ ఇంతే”

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. ప‌శ్చిమ‌బెంగాల్‌లో శ‌నివారం సాయంత్రం ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న దేశ‌వ్యాప్తంగా అన్న‌దాత‌ల‌కు పీఎం-కిసాన్ నిధుల‌ను…

5 hours ago

‘గొడ్డ‌లి పార్టీ అంత‌కు మించి ఏం చేసింది?’

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. మ‌రోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గ‌త ఐదేళ్ల కాలంలో గొడ్డ‌లి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయ‌డం..…

7 hours ago

నేను హోమ్ మినిస్టర్ కాకపోవడమే నేరస్తుల అదృష్టం: పవన్

ఏపీలో అంతకంతకూ పెరిగిపోతున్న కుల భావనపైనా, విపక్షాలు నిత్యం ఆరోపణలు గుప్పిస్తున్న శాంతి భద్రతల మీద జనసేన అధినేత, డిప్యూటీ…

8 hours ago

సెన్సార్ చిక్కులు చిన్న సినిమాలకేనా

వందల కోట్లతో తీసినా, తక్కువ బడ్జెట్ లో పూర్తి చేసినా ఏదైనా సినిమానే. వేసేది ప్రొజెక్టర్ వాడే తెరపైనే. చిన్నాపెద్దా…

9 hours ago

పింక్ శారీలో రాశి.. చూపు తిప్పుకోవడం కష్టమే!

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే రాశీ సింగ్ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫోటోలు భలే ఆకట్టుకుంటున్నాయి.…

9 hours ago