దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ప్రజలను ఉద్దేశించి తన మనసులోని భావాలను పంచుకునేందుకు ఎంచుకున్న కార్యక్రమమే.. మన్కీ బాత్. తన (ప్రధానిగా) మనసులోని భావాలను ప్రజలకు వివరించే ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. 2015లో ప్రారంభించిన ఈ మన్ కీ బాత్కు ఆదిలో మంచి గుర్తింపు, ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రజలు.. కర్షకులు.. ప్రధాని తమకోసం ఏం చెబుతారో.. అని ఆసక్తిగా ఎదురు చూసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు(మోడీ రెండో సారి పీఎం అయ్యాక) కూడా మన్ కీ బాత్ ప్రసారం అవుతూనే ఉంది.
తాజాగా ఈ ఏడాదికి(2020) సంబంధించిన చివరి మన్ కీ బాత్ కార్యక్రమం ముగిసింది. అయితే.. గతంలో జరిగిన మన్ కీ బాత్కి.. ఇప్పుడు జరిగిన దానికి మధ్య చాలా వ్యత్యాసం వుంది. గడిచిన 27 రోజులుగా దేశవ్యాప్తంగా రైతాంగం నూతన వ్యవసాయ చట్టాలపై రోడ్డెక్కి భీకరమైన చలిని తట్టుకుని మరీ ఉద్యమం చేస్తోంది. సదరు చట్టాలను రద్దు చేయాలని ఘోషిస్తోంది. అయితే..ఈ ఉద్యమాన్ని ఏదో ఒకరకంగా పక్కదారి పట్టించేందుకు.. రైతుల మధ్య విభేదాలు తీసుకువచ్చి.. విడగొట్టి రాజకీయం చేసేందుకు మోడీ సర్కారు చేయని ప్రయత్నం లేదనే విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో మేధావుల నుంచి సామాన్యుల వరకు అందరూ రైతులకు అండగా నిలిచారు.
అదేసమయంలో కరోనా వ్యాక్సిన్ విషయంలో పిల్లి మొగ్గలు వేస్తున్న ప్రభుత్వంపై .. ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఎప్పుడు జనబాహుళ్యంలోకి వస్తుందో తెలియని పరిస్థితి నెలకొన్న వ్యాక్సిన్.. అదిగో ఇదిగో.. అటూ.. మోడీ సర్కారు కాల యాపన చేస్తోంది. దీంతో ఈ రెండు విషయాలపైనా ప్రధాని తన మనసులో ఏముందో చెబుతారని.. అందరూ ఎదురు చూశారు. అయితే. ఆయన దీనికి భిన్నంగా.. వ్యవహరించారు. ఈ క్రమంలో .. జన్ కీ బాత్ సునో.. మోదీ జీ!! అంటూ.. యూట్యూబ్ సహా పలు సామాజిక మాధ్యమాల్లో వచ్చిన మన్ కీ బాత్ వీడియోల కింద కామెంట్లను కుమ్మరించారు. గతంలో లైకులు జోరుగా వచ్చిన మన్ కీబాత్కు ఇప్పుడు డిజ్లైకులు ప్రవాహంగా వచ్చాయి. దీంతో ప్రధాని మన్కీ బాత్ ఫెయిలైపోయింది.
అయితే.. జన్ మన్కీ బాత్ వినిపించుకునేందుకు ఇష్టపడలేదేమో.. సదరు సోషల్ మీడియాలో కేవలం లైకులు మాత్రమే కనిపించేలా వ్యవస్థలో మార్పులు కేవలం గంట వ్యవధిలోనే జరిగిపోవడం గమనార్హం. సో.. దీనిని బట్టి.. జన్ మన్కీ బాత్ వినేందుకు మోడీ భయపడుతున్నారే! అనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం.
This post was last modified on December 28, 2020 6:08 pm
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…