Political News

జన్‌ మ‌న్ కీ బాత్ వినేందుకు మోడీ భ‌య‌ప‌డుతున్నారే?!

దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి త‌న మ‌న‌సులోని భావాల‌ను పంచుకునేందుకు ఎంచుకున్న కార్య‌క్ర‌మ‌మే.. మ‌న్‌కీ బాత్‌. త‌న (ప్ర‌ధానిగా) మ‌న‌సులోని భావాల‌ను ప్ర‌జల‌కు వివ‌రించే ఈ కార్య‌క్ర‌మాన్ని కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌లు చేస్తోంది. 2015లో ప్రారంభించిన ఈ మ‌న్ కీ బాత్‌కు ఆదిలో మంచి గుర్తింపు, ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్ర‌జ‌లు.. క‌ర్ష‌కులు.. ప్ర‌ధాని త‌మ‌కోసం ఏం చెబుతారో.. అని ఆస‌క్తిగా ఎదురు చూసిన సంద‌ర్భాలు అనేకం ఉన్నాయి. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు(మోడీ రెండో సారి పీఎం అయ్యాక‌) కూడా మ‌న్ కీ బాత్ ప్ర‌సారం అవుతూనే ఉంది.

తాజాగా ఈ ఏడాదికి(2020) సంబంధించిన చివ‌రి మ‌న్ కీ బాత్ కార్య‌క్ర‌మం ముగిసింది. అయితే.. గతంలో జ‌రిగిన మ‌న్ కీ బాత్‌కి.. ఇప్పుడు జ‌రిగిన దానికి మ‌ధ్య చాలా వ్య‌త్యాసం వుంది. గ‌డిచిన 27 రోజులుగా దేశ‌వ్యాప్తంగా రైతాంగం నూత‌న వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై రోడ్డెక్కి భీక‌ర‌మైన చ‌లిని త‌ట్టుకుని మ‌రీ ఉద్య‌మం చేస్తోంది. స‌ద‌రు చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల‌ని ఘోషిస్తోంది. అయితే..ఈ ఉద్య‌మాన్ని ఏదో ఒక‌ర‌కంగా ప‌క్క‌దారి ప‌ట్టించేందుకు.. రైతుల మ‌ధ్య విభేదాలు తీసుకువ‌చ్చి.. విడ‌గొట్టి రాజ‌కీయం చేసేందుకు మోడీ స‌ర్కారు చేయ‌ని ప్ర‌య‌త్నం లేద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఈ క్ర‌మంలో మేధావుల నుంచి సామాన్యుల వ‌ర‌కు అంద‌రూ రైతుల‌కు అండ‌గా నిలిచారు.

అదేస‌మ‌యంలో క‌రోనా వ్యాక్సిన్ విష‌యంలో పిల్లి మొగ్గ‌లు వేస్తున్న ప్ర‌భుత్వంపై .. ప్ర‌జ‌లు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. ఎప్పుడు జ‌న‌బాహుళ్యంలోకి వ‌స్తుందో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొన్న వ్యాక్సిన్‌.. అదిగో ఇదిగో.. అటూ.. మోడీ స‌ర్కారు కాల యాప‌న చేస్తోంది. దీంతో ఈ రెండు విష‌యాల‌పైనా ప్ర‌ధాని త‌న మ‌న‌సులో ఏముందో చెబుతార‌ని.. అంద‌రూ ఎదురు చూశారు. అయితే. ఆయ‌న దీనికి భిన్నంగా.. వ్య‌వ‌హ‌రించారు. ఈ క్ర‌మంలో .. జ‌న్ కీ బాత్ సునో.. మోదీ జీ!! అంటూ.. యూట్యూబ్ స‌హా ప‌లు సామాజిక మాధ్య‌మాల్లో వ‌చ్చిన మ‌న్ కీ బాత్ వీడియోల కింద కామెంట్ల‌ను కుమ్మ‌రించారు. గ‌తంలో లైకులు జోరుగా వ‌చ్చిన మ‌న్ కీబాత్‌కు ఇప్పుడు డిజ్‌లైకులు ప్ర‌వాహంగా వ‌చ్చాయి. దీంతో ప్ర‌ధాని మ‌న్‌కీ బాత్ ఫెయిలైపోయింది.

అయితే.. జ‌న్ మ‌న్‌కీ బాత్ వినిపించుకునేందుకు ఇష్ట‌ప‌డలేదేమో.. స‌ద‌రు సోష‌ల్ మీడియాలో కేవ‌లం లైకులు మాత్ర‌మే క‌నిపించేలా వ్య‌వ‌స్థ‌లో మార్పులు కేవ‌లం గంట వ్య‌వ‌ధిలోనే జ‌రిగిపోవ‌డం గ‌మ‌నార్హం. సో.. దీనిని బ‌ట్టి.. జ‌న్ మ‌న్‌కీ బాత్ వినేందుకు మోడీ భ‌య‌ప‌డుతున్నారే! అనే వాద‌న బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on December 28, 2020 6:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సింగల్ స్క్రీన్ VS మల్టీప్లెక్స్… ఏది రైటు?

ఓ పాతిక సంవత్సరాలు వెనక్కు వెళ్తే హైదరాబాద్ లో అత్యధిక శాతం సింగల్ స్క్రీన్లు ఉండేవి. టోలి చౌకి నుంచి…

1 hour ago

దురంధర్ పోటీ సినిమాకు ఘోర అవమానం

గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…

3 hours ago

ప్రీమియర్ రేట్లు నిర్ణయించుకున్న పెద్ది ?

జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…

4 hours ago

త‌మిళ రాజ‌కీయాల్లో పుష్ప సోఫా రచ్చ

గ‌త ప‌ది రోజులుగా త‌మిళనాడు రాజ‌కీయాలు దేశ‌వ్యాప్తంగా ఎంత చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…

4 hours ago

చిరంజీవి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది

ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…

6 hours ago

పెద్దిని వద్దనుకుంటే ఎవరికి నష్టం

నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…

6 hours ago