Political News

జన్‌ మ‌న్ కీ బాత్ వినేందుకు మోడీ భ‌య‌ప‌డుతున్నారే?!

దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి త‌న మ‌న‌సులోని భావాల‌ను పంచుకునేందుకు ఎంచుకున్న కార్య‌క్ర‌మ‌మే.. మ‌న్‌కీ బాత్‌. త‌న (ప్ర‌ధానిగా) మ‌న‌సులోని భావాల‌ను ప్ర‌జల‌కు వివ‌రించే ఈ కార్య‌క్ర‌మాన్ని కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌లు చేస్తోంది. 2015లో ప్రారంభించిన ఈ మ‌న్ కీ బాత్‌కు ఆదిలో మంచి గుర్తింపు, ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్ర‌జ‌లు.. క‌ర్ష‌కులు.. ప్ర‌ధాని త‌మ‌కోసం ఏం చెబుతారో.. అని ఆస‌క్తిగా ఎదురు చూసిన సంద‌ర్భాలు అనేకం ఉన్నాయి. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు(మోడీ రెండో సారి పీఎం అయ్యాక‌) కూడా మ‌న్ కీ బాత్ ప్ర‌సారం అవుతూనే ఉంది.

తాజాగా ఈ ఏడాదికి(2020) సంబంధించిన చివ‌రి మ‌న్ కీ బాత్ కార్య‌క్ర‌మం ముగిసింది. అయితే.. గతంలో జ‌రిగిన మ‌న్ కీ బాత్‌కి.. ఇప్పుడు జ‌రిగిన దానికి మ‌ధ్య చాలా వ్య‌త్యాసం వుంది. గ‌డిచిన 27 రోజులుగా దేశ‌వ్యాప్తంగా రైతాంగం నూత‌న వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై రోడ్డెక్కి భీక‌ర‌మైన చ‌లిని త‌ట్టుకుని మ‌రీ ఉద్య‌మం చేస్తోంది. స‌ద‌రు చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల‌ని ఘోషిస్తోంది. అయితే..ఈ ఉద్య‌మాన్ని ఏదో ఒక‌ర‌కంగా ప‌క్క‌దారి ప‌ట్టించేందుకు.. రైతుల మ‌ధ్య విభేదాలు తీసుకువ‌చ్చి.. విడ‌గొట్టి రాజ‌కీయం చేసేందుకు మోడీ స‌ర్కారు చేయ‌ని ప్ర‌య‌త్నం లేద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఈ క్ర‌మంలో మేధావుల నుంచి సామాన్యుల వ‌ర‌కు అంద‌రూ రైతుల‌కు అండ‌గా నిలిచారు.

అదేస‌మ‌యంలో క‌రోనా వ్యాక్సిన్ విష‌యంలో పిల్లి మొగ్గ‌లు వేస్తున్న ప్ర‌భుత్వంపై .. ప్ర‌జ‌లు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. ఎప్పుడు జ‌న‌బాహుళ్యంలోకి వ‌స్తుందో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొన్న వ్యాక్సిన్‌.. అదిగో ఇదిగో.. అటూ.. మోడీ స‌ర్కారు కాల యాప‌న చేస్తోంది. దీంతో ఈ రెండు విష‌యాల‌పైనా ప్ర‌ధాని త‌న మ‌న‌సులో ఏముందో చెబుతార‌ని.. అంద‌రూ ఎదురు చూశారు. అయితే. ఆయ‌న దీనికి భిన్నంగా.. వ్య‌వ‌హ‌రించారు. ఈ క్ర‌మంలో .. జ‌న్ కీ బాత్ సునో.. మోదీ జీ!! అంటూ.. యూట్యూబ్ స‌హా ప‌లు సామాజిక మాధ్య‌మాల్లో వ‌చ్చిన మ‌న్ కీ బాత్ వీడియోల కింద కామెంట్ల‌ను కుమ్మ‌రించారు. గ‌తంలో లైకులు జోరుగా వ‌చ్చిన మ‌న్ కీబాత్‌కు ఇప్పుడు డిజ్‌లైకులు ప్ర‌వాహంగా వ‌చ్చాయి. దీంతో ప్ర‌ధాని మ‌న్‌కీ బాత్ ఫెయిలైపోయింది.

అయితే.. జ‌న్ మ‌న్‌కీ బాత్ వినిపించుకునేందుకు ఇష్ట‌ప‌డలేదేమో.. స‌ద‌రు సోష‌ల్ మీడియాలో కేవ‌లం లైకులు మాత్ర‌మే క‌నిపించేలా వ్య‌వ‌స్థ‌లో మార్పులు కేవ‌లం గంట వ్య‌వ‌ధిలోనే జ‌రిగిపోవ‌డం గ‌మ‌నార్హం. సో.. దీనిని బ‌ట్టి.. జ‌న్ మ‌న్‌కీ బాత్ వినేందుకు మోడీ భ‌య‌ప‌డుతున్నారే! అనే వాద‌న బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on December 28, 2020 6:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

1 hour ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

2 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

2 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

3 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

5 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

6 hours ago