Political News

జన్‌ మ‌న్ కీ బాత్ వినేందుకు మోడీ భ‌య‌ప‌డుతున్నారే?!

దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి త‌న మ‌న‌సులోని భావాల‌ను పంచుకునేందుకు ఎంచుకున్న కార్య‌క్ర‌మ‌మే.. మ‌న్‌కీ బాత్‌. త‌న (ప్ర‌ధానిగా) మ‌న‌సులోని భావాల‌ను ప్ర‌జల‌కు వివ‌రించే ఈ కార్య‌క్ర‌మాన్ని కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌లు చేస్తోంది. 2015లో ప్రారంభించిన ఈ మ‌న్ కీ బాత్‌కు ఆదిలో మంచి గుర్తింపు, ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్ర‌జ‌లు.. క‌ర్ష‌కులు.. ప్ర‌ధాని త‌మ‌కోసం ఏం చెబుతారో.. అని ఆస‌క్తిగా ఎదురు చూసిన సంద‌ర్భాలు అనేకం ఉన్నాయి. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు(మోడీ రెండో సారి పీఎం అయ్యాక‌) కూడా మ‌న్ కీ బాత్ ప్ర‌సారం అవుతూనే ఉంది.

తాజాగా ఈ ఏడాదికి(2020) సంబంధించిన చివ‌రి మ‌న్ కీ బాత్ కార్య‌క్ర‌మం ముగిసింది. అయితే.. గతంలో జ‌రిగిన మ‌న్ కీ బాత్‌కి.. ఇప్పుడు జ‌రిగిన దానికి మ‌ధ్య చాలా వ్య‌త్యాసం వుంది. గ‌డిచిన 27 రోజులుగా దేశ‌వ్యాప్తంగా రైతాంగం నూత‌న వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై రోడ్డెక్కి భీక‌ర‌మైన చ‌లిని త‌ట్టుకుని మ‌రీ ఉద్య‌మం చేస్తోంది. స‌ద‌రు చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల‌ని ఘోషిస్తోంది. అయితే..ఈ ఉద్య‌మాన్ని ఏదో ఒక‌ర‌కంగా ప‌క్క‌దారి ప‌ట్టించేందుకు.. రైతుల మ‌ధ్య విభేదాలు తీసుకువ‌చ్చి.. విడ‌గొట్టి రాజ‌కీయం చేసేందుకు మోడీ స‌ర్కారు చేయ‌ని ప్ర‌య‌త్నం లేద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఈ క్ర‌మంలో మేధావుల నుంచి సామాన్యుల వ‌ర‌కు అంద‌రూ రైతుల‌కు అండ‌గా నిలిచారు.

అదేస‌మ‌యంలో క‌రోనా వ్యాక్సిన్ విష‌యంలో పిల్లి మొగ్గ‌లు వేస్తున్న ప్ర‌భుత్వంపై .. ప్ర‌జ‌లు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. ఎప్పుడు జ‌న‌బాహుళ్యంలోకి వ‌స్తుందో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొన్న వ్యాక్సిన్‌.. అదిగో ఇదిగో.. అటూ.. మోడీ స‌ర్కారు కాల యాప‌న చేస్తోంది. దీంతో ఈ రెండు విష‌యాల‌పైనా ప్ర‌ధాని త‌న మ‌న‌సులో ఏముందో చెబుతార‌ని.. అంద‌రూ ఎదురు చూశారు. అయితే. ఆయ‌న దీనికి భిన్నంగా.. వ్య‌వ‌హ‌రించారు. ఈ క్ర‌మంలో .. జ‌న్ కీ బాత్ సునో.. మోదీ జీ!! అంటూ.. యూట్యూబ్ స‌హా ప‌లు సామాజిక మాధ్య‌మాల్లో వ‌చ్చిన మ‌న్ కీ బాత్ వీడియోల కింద కామెంట్ల‌ను కుమ్మ‌రించారు. గ‌తంలో లైకులు జోరుగా వ‌చ్చిన మ‌న్ కీబాత్‌కు ఇప్పుడు డిజ్‌లైకులు ప్ర‌వాహంగా వ‌చ్చాయి. దీంతో ప్ర‌ధాని మ‌న్‌కీ బాత్ ఫెయిలైపోయింది.

అయితే.. జ‌న్ మ‌న్‌కీ బాత్ వినిపించుకునేందుకు ఇష్ట‌ప‌డలేదేమో.. స‌ద‌రు సోష‌ల్ మీడియాలో కేవ‌లం లైకులు మాత్ర‌మే క‌నిపించేలా వ్య‌వ‌స్థ‌లో మార్పులు కేవ‌లం గంట వ్య‌వ‌ధిలోనే జ‌రిగిపోవ‌డం గ‌మ‌నార్హం. సో.. దీనిని బ‌ట్టి.. జ‌న్ మ‌న్‌కీ బాత్ వినేందుకు మోడీ భ‌య‌ప‌డుతున్నారే! అనే వాద‌న బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on December 28, 2020 6:08 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

మూడో టిల్లు జోడిగా బుట్టబొమ్మ?

టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…

7 hours ago

శ్యామ్ సింగ రాయ్ దర్శకుడి కొత్త ట్యాక్సీ

కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…

8 hours ago

అల్లరోడికి అసలు పరీక్ష రేపే

వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…

9 hours ago

స‌మ‌యం మించి పోయింది.. సేనానీ: ఎన్నిక‌ల సంఘం

ఏపీలో త‌లెత్తిన ఎన్నిక‌ల  గుర్తు ర‌గ‌డ మ‌రో మ‌లుపు తిరిగింది. జ‌న‌సేన‌కు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వ‌తంత్ర…

10 hours ago

క్రిష్‌కు ఇది సమ్మతమేనా?

టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…

10 hours ago

వరలక్ష్మితో రూమ్ బుక్ చేయనా అన్నాడట

ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…

11 hours ago