Political News

మండలి చైర్మన్ పై అవివేశ్వాస తీర్మానం?

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, ప్ర‌స్తుతం శాస‌న మండ‌లి చైర్మ‌న్‌గా ఉన్న మోషేన్ రాజుపై అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ పెట్టే అంశంపై సీఎం చంద్ర‌బాబు పార్టీ నాయ‌కుల‌తో చ‌ర్చించారు. వైసీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. టీడీపీలో చేరిన ఎమ్మెల్సీ బ‌ల్లి క‌ల్యాణ్ చ‌క్ర‌వ‌ర్తి స‌హా.. బీజేపీ తీర్థం పుచ్చుకున్న పోతుల సునీత‌.. ఇప్ప‌టికే చైర్మ‌న్‌పై అవిశ్వాస తీర్మానం ఇచ్చారు. ఈ తీర్మానాలు పెండింగులో ఉన్నాయి. వ‌చ్చే స‌మావేశాల్లో వీటిపై చర్చించే అవ‌కాశం ఉంది. అయితే.. ఈలోగా మ‌రింత మంది కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. దీనిపై సీఎం చంద్ర‌బాబు దృష్టికి టీడీపీ ఎమ్మెల్సీలు తీసుకువెళ్లారు.

తాజాగా జ‌య‌మంగ‌ళ వెంక‌ట‌ర‌మ‌ణ చేసిన రాజీనామాను చైర్మ‌న్ తిర‌స్క‌రించారు. స‌రైన ఫార్మాట్‌లోనే రాజీనామా చేసినా.. దీనికి సంబంధించి తాను అడిగిన వివ‌ర‌ణ‌లో స‌రైన స‌హేతుక కార‌ణాలు చూప‌లేద‌ని పేర్కొంటూ స‌ద‌రు రాజీనామాను చైర్మ‌న్ తిర‌స్క‌రించారు. ఈ విష‌యం కూడా చంద్ర‌బాబు చ‌ర్చించారు. జ‌య‌మంగ‌ళ‌తో ఆయ‌న ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు.

వాస్త‌వానికి జ‌య‌మంగ‌ళ వెంక‌ట ర‌మ‌ణ ఏడాదిన్న‌ర కింద‌టే రాజీనామా చేశారు. అయినా.. ఇప్ప‌టికీ ఆమోదం పొంద‌లేదు. ప్ర‌స్తుతం ఆయ‌న జ‌న‌సేన‌లో చేరారు. ఇక‌, మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌, పోతుల సునీత‌, క‌ర్రి ప‌ద్మ‌శ్రీ వంటివారి రిజైన్ లు కూడా ప‌రిశీల‌న‌లోనే ఉన్నాయి.

ఈ క్ర‌మంలో చైర్మ‌న్ పై త‌మ‌కు విశ్వాసం లేద‌ని.. రాజ్యాంగం ప్ర‌కారం న‌డుచుకోవాల్సిన చైర్మ‌న్‌.. వైసీపీ చెప్పిన‌ట్టు చేస్తున్నార‌ని ప‌లువురు ఎమ్మెల్సీలు ఆరోపించారు. అయితే.. నేరుగా చైర్మ‌న్‌ను ఏమీ అనొద్ద‌ని.. అవిశ్వాసం పెట్టుకునే హ‌క్కు స‌భ్యుల‌కు ఉంటుంద‌ని.. ఆ విష‌యంపైనే మాట్లాడాల‌ని చంద్ర‌బాబు సూచించారు.

చైర్‌ను అన‌వ‌స‌ర వివాదంలోకి లాగొద్ద‌ని.. ఆయ‌న‌పై అవిశ్వాసం పెట్టేందుకు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని వ్యాఖ్యానించారు. అయితే.. ఒక్కొక్క‌రుగా కాకుండా.. ఎవ‌రైతే.. అవిశ్వాసం పెట్టాల‌ని అనుకుంటున్నారో.. అంద‌రూ క‌లిసి ఒకే తీర్మానం ప్ర‌వేశ పెడితే బాగుంటుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

దీనిపై నాయ‌కుల‌తో చ‌ర్చించాల‌ని.. సీనియ‌ర్ ఎమ్మెల్సీల‌ను చంద్ర‌బాబు ఆదేశించారు. అంద‌రూ ఒకే మాట‌పై ఉండి.. అవిశ్వాసం పెడితే.. అది వీగిపోకుండా కూడా చూడాల‌ని సూచించారు. ఏదో పెట్టామంటే పెట్టామ‌ని అనుకుంటే.. వైసీపీ దానిని రాజకీయ వ‌స్తువుగా వాడుకునే అవ‌కాశం ఉంటుందని అభిప్రాయ‌ప‌డ్డారు. దీనిపై అంద‌రి నుంచి స‌మాచారంతీసుకుని త‌దుప‌రి స‌మావేశాల్లో వ‌చ్చేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీనియ‌ర్ ఎమ్మెల్సీల‌కు పేర్కొన్నారు.

This post was last modified on April 24, 2026 11:27 pm

Share

Recent Posts

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

2 hours ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

3 hours ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

3 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

3 hours ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

5 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

5 hours ago