ప్రస్తుతం వైసీపీకి ఉన్న 11 నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల నాటికి 4 నియోజకవర్గాలు చేజారి పోవడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు. వాస్తవానికి గత ఎన్నికల్లో వైనాట్ 175 అంటూ బరిలో నిలిచిన వైసీపీకి ప్రజలు 11 సీట్లే ఇచ్చారు. కానీ.. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా.. ఆయా ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు రావడంలేదు. అసెంబ్లీకి పోవడం లేదు. సమస్యలు ఎక్కడివక్కడే అన్నట్టుగా కూడా ఉన్నాయి.
ఇది పార్టీకి ప్రధాన చిక్కుగా మారింది. అయితే.. ఈ 11 స్థానాల్లో కొందరు ఎమ్మెల్యే వ్యక్తిగతంగా పనులు చేసుకుంటున్నా.. కీలకమైన 4 నియోజకవర్గాల్లో మాత్రం.. పనులు ముందుకు సాగడం లేదు. ప్రజలు కూడా ఆగ్రహంతో ఉన్నారు దీంతో ఆయా స్థానాలు దక్కడం కష్టమనే వాదన వినిపిస్తోంది. వీటిలో ప్రధానంగా పుంగనూరు నియోజకవర్గం పేరు వినిపిస్తోంది. ఈ నియోజకవర్గం నుంచి 2009 టు 2024 వరకు వరుసగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజయం దక్కించుకున్నారు.
కానీ.. గత ఎన్నికల్లో ఆయనకు అత్యంత తక్కువ మెజారిటీనే వచ్చింది. కేవలం 6 వేల ఓట్ల మెజారిటీతో నే ఆయన కుస్తీ పట్టి గెలుపు గుర్రం ఎక్కారు. ఇక్కడ పోటీ ఇప్పటి నుంచే ప్రారంభమైంది. బీసీవై నాయకుడు బోడే బలంగా పోరాడుతున్నారు. మరోవైపు పెద్దిరెడ్డి ప్రజలకు దూరమయ్యారు. వ్యాపారాలు, కేసులతో ఆయన తీరిక లేకుండా ఉన్నారు.
ఇక, 2) బద్వేల్. ఈ నియోజకవర్గం కడపలో ఉంది. కానీ.. ఓటమి దిశగా ఇక్కడ ఎమ్మెల్యే సుధ అడుగులు వేగంగా పడుతున్నాయట.
3) దర్శి: ఉమ్మడి ప్రకాశంలో అత్యంత తక్కువ మెజారిటీతో గత ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కిక వైసీపీ నేత బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఇప్పుడు మైనస్లలో పడిపోయారని అంటున్నారు. మంత్రి గొట్టిపాటి రవి.. గత ఎన్నికల్లో పోటీ చేసిన గొట్టిపాటి లక్ష్మిలు.. దర్శిపై దృష్టి పెట్టారు. దీంతో బూచేపల్లి ఓటమి ఖాయమని అంటున్నారు.
4) అరకు.. గత ఎన్నికల్లో రేగం మత్స్యలింగం విజయం సాధించారు. కానీ, ఇక్కడ జనసేన దూకుడుగా ఉంది. దీనికి టీడీపీ కలిసి వస్తోంది.
ఫలితంగా వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఇక్కడ పరాజయం పాలవడం ఖాయమని అంటున్నారు. అయితే.. జగన్ పాదయాత్ర ప్రభావం ఉంటే ఈ నియోజకవర్గాల్లో ఛాన్స్ మిస్సయినా.. ఇతర నియోజకవర్గాల్లో విజయం దక్కించుకుంటామని వైసీపీ నాయకులు అంచనా వేస్తున్నారు.
ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబుకు కేంద్రంలోని పెద్దలు బిగ్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్డీయే కూటమిని మరింత బలోపేతం…
తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్.. ఇటీవల వరుసగా వివాదాల్లో చిక్కుకుంటోంది. వరలక్ష్మి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘సరస్వతి’ సినిమాకు…
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తన వ్యూహాన్ని దాదాపు తేల్చేశారు. రాజకీయంగా తనకు ఉన్న లక్ష్యాన్ని కూడా వివరించారు. దేశాన్ని…
ఇప్పుడంతా అప్ డేటెడ్ వెర్షన్లే వినిపిస్తున్నాయి. వ్యవహారికంతో పాటుగా పాలిటిక్స్ లోనూ నయా తరం వచ్చేసింది. ఆ ఫలితమే జన్…
మెగా డీఎస్సీ పరీక్షలు జరిగి దాదాపు ఏడాది అవుతోంది. సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరి ఆరు నెలలు దాటిపోయింది.…
కొన్ని నెలల క్రితం అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఒక ప్రకటన వెలువడింది. 2027 సంక్రాంతికి థియేటర్లను బ్లాస్ట్ చేయబోతున్నాం అనే…