“రాజకీయ నేతలు.. ప్రజల కోసం పనిచేసేది తక్కువ.. సెక్స్ వీడియోలు చూసేది ఎక్కువ. కావాలంటే.. నా ఫోన్ సహా.. రాష్ట్రంలోని ప్రజా ప్రతినిధులు అందరి ఫోన్లూ చెక్ చేసుకోండి.“ అని బీహార్కు చెందిన వివాదాస్పద ఎంపీ.. రాజేష్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్.. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. 80% నాయకుల పోన్లలో పెద్ద ఎత్తున సెక్స్ , పోర్న్ వీడియోలు ఉన్నాయని.. వీరిలో మహిళా నాయకులు కూడా ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ ఒక్క వివాదంతోనే ఆయన సరిపుచ్చలేదు. బీహార్ మహిళా కమిషన్ సభ్యురాలు.. సజలపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “సజల పవిత్రమైందా? నాకు నోటీసులు ఇవ్వడానికి?. ఆమె ఎవరెవరితో ఉందో.. నా దగ్గర ఫొటోలు ఉన్నాయి. వాటిని బయట పెట్టాలా? “ అని పప్పు యాదవ్ హెచ్చరించారు. అంతేకాదు.. దేశవ్యాప్తంగా 755 మంది నాయకులపై లైంగిక వేధింపుల కేసులు ఉన్నాయని తెలిపారు. వీరంతా రాముళ్లయితే.. ఇన్ని కేసులు ఎలా నమోదయ్యాయని నిలదీశారు.
అసలు ఏం జరిగింది?
మహిళా రిజర్వేషన్ బిల్లుపై మంగళవారం మీడియాతో మాట్లాడినపప్పు యాదవ్.. మహిళలకు రాజకీయంగా కెరీర్ ఉండాలంటే.. ఎవరో ఒకరి గదిలోకి వెళ్లాల్సిందేనని తీర్మానించారు. ఈవ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో ఆయనకు మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. మరో వైపు కొందరు నాయకులు కూడా ఆయనపై విమర్శలు చేశారు. ఈ క్రమంలో బుధవారం మరోసారి మీడియా ముందుకు వచ్చిన పప్పు.. తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు.
పైగా తాను మహిళా పక్షపాతినని.. వారికి మేలు జరగాలనే కోరుకుంటున్నానని అన్నారు. కొసమెరుపు ఏంటంటే.. పాలల్లో వెన్న పైకి కనిపించనట్టే.. తన వ్యాఖ్యల్లో మంచి కూడా పైకి కనిపించడం లేదన్నారు. దీనిని సూక్ష్మంగా గ్రహిస్తే అర్థమవుతుందని వ్యాఖ్యానించారు. కాగా.. బీజేపీ సహా.. ఆర్డేజీ, బీజేడీల పరోక్ష మద్దతు ఉన్న పప్పు.. పూర్నియా నియోజకవర్గం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
This post was last modified on April 23, 2026 10:56 am
అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ హీరోగా స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి రూపొందించిన ‘ఏజెంట్’ టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద…
కేంద్ర విద్యా శాఖకు నూతన మంత్రిగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా కొనసాగుతున్న ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు.…
బాక్సాఫీస్ దగ్గర పోటీ ఉన్నప్పుడు కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతాయి. ఇది అలాంటిదే. కేవలం ఒక్క రోజు గ్యాప్ తో…
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న స్పైడర్ మ్యాన్ సిరీస్ లోని కొత్త సినిమా బ్రాండ్ న్యూ డే జూలై…
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ కొత్త లాజిక్ మాట్లాడుతున్నారు. నైతిక బాధ్యత వహిస్తూ…
ఇప్పుడు హీరోయిన్ గా కనిపించడం తగ్గించేసింది కానీ టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన బ్లాక్ బస్టర్స్ లో నటించిన ట్రాక్…