ఏపీలో అధికార కూటమిలోని పార్టీల మధ్య తరచూ చిన్న చిన్న వివాదాలు చెలరేగుతున్నాయి. అయితే ఈ వివాదాలన్నీ ఆయా పార్టీల కీలక నేతల ప్రమేయం లేకుండానే జరిగిపోతున్నాయి. పార్టీ అధినేతలు పొత్తు ధర్మం అనుసరించి నడుచుకుంటూ ఉంటే… నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి నేతలు మాత్రం తమ తమ మాటలు నెగ్గలేదంటూ ఒకరిపై మరొకరు విరుచకుపడిపోతున్నారు.
ఈ తరహా ఘటనలతో పార్టీ అధినేతలు తలలు పట్టుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా టీడీపీ, జనసేనల మధ్య ఇలాంటి ఘటనలే కాకినాడ, కోనసీమ జిల్లాల్లో మంగళవారం రెండు చోటుచేసుకున్నాయి.
కాకినాడ జిల్లాలో జరిగిన ఘటన విషయానికి వస్తే… జనసేన అధినే, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో టీడీపీ, జనసేన నేతల మధ్య వాదులాట, తోపులాట చోటుచేసుకుంది. పిఠాపురంలోని పాడా కార్యాలయంలో మంగళవారం జరిగిన పీఎంజేఏవై కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో టీడీపీ అదినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఫొటో కనిపించలేదు. దీంతో టీడీపీ నియోజకవర్గ ఇంచార్జీ, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎన్ వర్మ అదేంటని నిలదీశారు.
ఈ సందర్భంగా జనసేన కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాటు ఆయనతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా జనసేనకే చెందిన మరో కీలక నేత పెండెం దొరబాబు ఆగ్రహంతో ఊగిపోయారు. వర్మపైకి ఆయన దూసుకుని వచ్చారు. దీంతో ఇరు పార్టీలకు చెందిన కేడర్ పరస్పరం హెచ్చరికలు జారీ చేసుకుంటూ సాగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితిని గ్రహించిన స్థానిక పోలీసులు ఇరు వర్గాల కేడర్ ను అక్కడి నుంచి పంపించివేయడంతో పరిస్థితి సద్దుమణిగింది.
ఇక డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసిమ జిల్లా పి.గన్నవరంలో టీడీపీ, జనసేన వర్గాల మధ్య వాదులాట చోటుచేసుకుంది. డ్వాక్రా మహిళలకు సెల్ ఫోన్ల పంపిణీ కోసం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే, జనసేన నేత గిడ్డి సత్యనారాయణ హాజరయ్యారు.
ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో జనసేనాని పవన్ కల్యాణ్ ఫొటో కనిపించలేదట. దీంతో పవన్ ఫొటో లేదేమిటని ప్రశ్నించిన జనసైనికులు… పవన్ ఫొటో లేని ఫ్లెక్సీని తీసివేయాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో టీడీపీ కేడర్ వారితో వాదులాటకు దిగారు. ఎమ్మెల్యే వారించినా ఇరు వర్గాల వారు ఏమాత్రం వినకపోవడంతో పోలీసులు రంగ ప్రవేశం చేయక తప్పలేదు.
This post was last modified on April 21, 2026 3:57 pm
దేశవ్యాప్తంగా పార్లమెంటు నియోజకవర్గాలను పునర్విభించి .. మహిళలకు రిజర్వేషన్ కల్పించాలన్న కేంద్ర ప్రభుత్వం ఆశలు ప్రస్తుత సమావేశాల్లో నెరవేరేలా కనిపించడం…
తెలంగాణాలో ఎమ్మెల్యేలు, మంత్రులకు తమ కుమారుల ప్రేమ వ్యవహారాలు తలనొప్పిగా మారుతున్నాయి. నిన్నా మొన్నటి వరకు కేంద్ర మంత్రి బండి…
ఇంకా రాకా షూటింగ్ పూర్తి కాలేదు. మూడు నెలలకు పైనే వర్కింగ్ డేస్ అవసరమవుతాయని అంటున్నారు. అందుకే విడుదల తేదీ…
రాష్ట్రంలో వైద్యం ఖరీదైన వస్తువుగా మారిపోయింది. ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ పరీక్షలు, ఇతరత్రా ఖర్చుల పేరుతో ప్రైవేటు ఆసుపత్రులు రోగుల నుంచి…
కన్నడ సినిమాలో అతి పెద్ద స్టార్లలో ఒకడైన దర్శన్.. ఏ బాధలూ లేని జీవితాన్ని, బంగారం లాంటి జీవితాన్ని ఎలా…
థియేటర్లలో రేపు నాలుగైదు సినిమాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రత్యేకంగా ఓటిటిలో వచ్చే కొత్త కంటెంట్ కోసం ఎదురు…