టీడీపీ రాష్ట్ర, జాతీయ కమిటీలను తాజాగా ప్రకటించారు. వీటిలో మెజారిటీ పదవులను యువతకు కేటా యించారు. దీనినే పార్టీలో కొందరు `లోకేష్ టీం`గా పేర్కొంటున్నారు. వీరంతా కూడా లోకేష్తో అనుబంధం ఉన్నవారే కావడం గమనార్హం. మంచిదే.. పార్టీలో అధినేత మొదలు ఎవరో ఒకరితో అనుబంధం ఉండడం తప్పుకాదు. కానీ.. తాజాగా ఎంపికైన పదవులను గమనిస్తే.. కీలకంగా ఉన్న యువ నాయకులకు భారీ బరువు బాధ్యతలే కనిపిస్తున్నాయి.
ముఖ్యంగా 3 రూపాల్లో ప్రస్తుతం ఏర్పడిన యువ నాయకత్వానికి బాధ్యతలు పెరగనున్నాయని పార్టీ సీనియర్లు చెబుతున్నారు. 1) వచ్చే ఎన్నికల్లో పార్టీని మరోసారి విజయ తీరాలకు చేర్చడం: దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీ తరఫున సరైన ప్రణాళికను ఇచ్చేశారు. ప్రజలతో మమేకం కావడం.. ప్రజల సమ్యలు తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను కూడా ప్రజలకు వివరించడం కీలకం.
2) యువతను పార్టీవైపు ఆకర్షించడం: ప్రస్తుతం యువ నాయకత్వానికి ప్రాధాన్యం ఇస్తున్న పార్టీలో మరింత మంది యువతకు ప్రాధాన్యం పెంచనున్నారు. ఈ బాధ్యతలను కొత్త కమిటీలే తీసుకుంటాయి. అంతేకాదు.. హుషారుగా కూడా పనిచేయనున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి బూత్ స్థాయి నుంచి అన్ని స్థాయిల్లోనూ యువతకు ప్రాధాన్యం పెరగనుంది.
3) కలివిడి: పార్టీలో ప్రస్తుతం యువ నాయకులకు-సీనియర్లకు మధ్య కలివిడి లోపించింది. దీనిని సరిదిద్దేందుకు ప్రస్తుతం ఏర్పడిన కమిటీలు కృషి చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా సలహాలు.. సూచనలు వంటి విషయాలతో పాటు నియోజకవర్గాల్లో పర్యటనలు వంటివి కూడా యువ నాయకత్వమే చూసుకోవాలి. మొత్తంగా రాష్ట్రంలో యువతను కేంద్రంగా చేసుకుని ఈ కమిటీలు పార్టీని డెవలప్ చేయడంతో పాటు.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకురావాల్సిన అతి పెద్ద బాధ్యతను పెట్టారు.
This post was last modified on April 18, 2026 8:11 am
ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో కథానాయికగా నటిస్తూనే.. ఇంకోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ మెరుస్తోంది కీర్తి సురేష్. మహానటి తర్వాత…
విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు ఇన్నాళ్లూ ఏం జరిగినా పరిస్థితి…
తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న బాలీవుడ్ నటుడు ప్రదీప్ రావత్ హఠాత్తుగా కన్ను మూశారు. 74 ఏళ్ల ఈ లెజెండరీ…
ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో అందరి దృష్టి ఒక్క కొరియన్ కనకరాజు మీదే ఉంది. గత పది రోజులుగా…
రాజమౌళి తీసిన ఒకే ఒక స్పోర్ట్స్ డ్రామా సై. హీరో నితిన్ ఎంతమందికి గుర్తుంటాడో చెప్పలేం కానీ ఆ మూవీతోనే…
ఏపీలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై సీఎం చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిని ఆయన వివరించారు.…