టీడీపీ రాష్ట్ర, జాతీయ కమిటీలను తాజాగా ప్రకటించారు. వీటిలో మెజారిటీ పదవులను యువతకు కేటా యించారు. దీనినే పార్టీలో కొందరు `లోకేష్ టీం`గా పేర్కొంటున్నారు. వీరంతా కూడా లోకేష్తో అనుబంధం ఉన్నవారే కావడం గమనార్హం. మంచిదే.. పార్టీలో అధినేత మొదలు ఎవరో ఒకరితో అనుబంధం ఉండడం తప్పుకాదు. కానీ.. తాజాగా ఎంపికైన పదవులను గమనిస్తే.. కీలకంగా ఉన్న యువ నాయకులకు భారీ బరువు బాధ్యతలే కనిపిస్తున్నాయి.
ముఖ్యంగా 3 రూపాల్లో ప్రస్తుతం ఏర్పడిన యువ నాయకత్వానికి బాధ్యతలు పెరగనున్నాయని పార్టీ సీనియర్లు చెబుతున్నారు. 1) వచ్చే ఎన్నికల్లో పార్టీని మరోసారి విజయ తీరాలకు చేర్చడం: దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీ తరఫున సరైన ప్రణాళికను ఇచ్చేశారు. ప్రజలతో మమేకం కావడం.. ప్రజల సమ్యలు తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను కూడా ప్రజలకు వివరించడం కీలకం.
2) యువతను పార్టీవైపు ఆకర్షించడం: ప్రస్తుతం యువ నాయకత్వానికి ప్రాధాన్యం ఇస్తున్న పార్టీలో మరింత మంది యువతకు ప్రాధాన్యం పెంచనున్నారు. ఈ బాధ్యతలను కొత్త కమిటీలే తీసుకుంటాయి. అంతేకాదు.. హుషారుగా కూడా పనిచేయనున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి బూత్ స్థాయి నుంచి అన్ని స్థాయిల్లోనూ యువతకు ప్రాధాన్యం పెరగనుంది.
3) కలివిడి: పార్టీలో ప్రస్తుతం యువ నాయకులకు-సీనియర్లకు మధ్య కలివిడి లోపించింది. దీనిని సరిదిద్దేందుకు ప్రస్తుతం ఏర్పడిన కమిటీలు కృషి చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా సలహాలు.. సూచనలు వంటి విషయాలతో పాటు నియోజకవర్గాల్లో పర్యటనలు వంటివి కూడా యువ నాయకత్వమే చూసుకోవాలి. మొత్తంగా రాష్ట్రంలో యువతను కేంద్రంగా చేసుకుని ఈ కమిటీలు పార్టీని డెవలప్ చేయడంతో పాటు.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకురావాల్సిన అతి పెద్ద బాధ్యతను పెట్టారు.
This post was last modified on April 18, 2026 8:11 am
కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే కూతురు, మహిళా ఎస్సై మధ్య జరిగిన ఫైటింగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆలయ…
టాక్సిక్ విడుదల నేపథ్యంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ గురించి ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆసక్తి నెలకొంది. ఎందుకంటే కెజిఎఫ్ తర్వాత…
ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న ఇరుముడి మీద టీచర్ల సమాఖ్య అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సినిమాలో ప్రభుత్వ…
రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ మీద అభిమానుల అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఆశ్చర్యకరంగా హిందీ వెర్షన్ అమ్మకాలు…
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుతో లిక్కర్ కుంభకోణం మళ్ళీ తెరపైకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో నాశిరకం మద్యం వ్యాపారాన్ని…
``కాంగ్రెస్ పార్టీలో నేనైనా ఆమె అయినా ఒక్కటే. పార్టీ క్రమశిక్షణ విషయంలో అందరూ సమానమే. ఎవరు ఏం చేశారన్నది పార్టీ…