లోక్ సభలో ఒక చారిత్రాత్మక బిల్లుపై ఓటింగ్ జరిగింది. అనూహ్యంగా ఎన్డీఏ ఓటింగ్ లో ఓటమి ఫాలయింది. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లులపై దేశవ్యాప్తంగా చర్చలు కొనసాగుతున్న వేళ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
ఎక్స్ వేదికగా స్పందించిన జగన్, ఈ రెండు బిల్లులను వ్యతిరేకించిన పార్టీలు తమ నిర్ణయాలపై ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాల్లో లోక్సభ సీట్ల సంఖ్య తగ్గే అవకాశం ఉన్నదని, అదే సమయంలో మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా వాయిదా పడటంతో మహిళలకు అన్యాయం జరిగిందని పేర్కొన్నారు.
2026 జనగణన ఆధారంగా భవిష్యత్తులో సీట్ల కేటాయింపు జరిగితే దక్షిణాది రాష్ట్రాల పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుందని జగన్ అభిప్రాయపడ్డారు. కుటుంబ నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా వృద్ధి తక్కువగా ఉండటంతో, సీట్ల వాటాలో తగ్గుదల వచ్చే ప్రమాదం ఉందని ఆయన సూచించారు.
ఇదిలా ఉండగా, జగన్ వ్యాఖ్యలపై వైసీపీ వర్గాలు మరింత వివరణ ఇచ్చాయి. 2011 జనగణన ఆధారంగా ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలకు లభించే సీట్ల సంఖ్య భవిష్యత్తులో అలాగే ఉండకపోవచ్చని పేర్కొన్నాయి.
ఒకవేళ ప్రస్తుత బిల్లు ఆమోదం పొందకుండా ఆలస్యమైతే, 2026 జనగణన ఆధారంగా వచ్చే పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాల వాటా మరింత తగ్గే అవకాశం ఉందని వివరించాయి. ప్రస్తుతం 38 సీట్ల వరకు లభించే అవకాశమున్న వాటా కూడా భవిష్యత్తులో తగ్గిపోవచ్చని వైసీపీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
.
This post was last modified on April 17, 2026 10:49 pm
టాలీవుడ్ స్టార్ హీరోలు స్టేజ్ ఎక్కితే చాలు, ఇకపై ఏడాదికి రెండు మూడు సినిమాలు పక్కా అని ఫ్యాన్స్కు హామీ…
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నోట నుంచి వస్తున్న వ్యాఖ్యలు... తాను వదిలేసి వచ్చిన బీఆర్ఎస్…
డీలిమిటేషన్, చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులు లోక్ సభలో వీగిపోయిన నేపథ్యంలో ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి. ఆ విశ్లేషణలన్నింటిలో ఒకటి మాత్రం…
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు.. తమపై చేస్తున్న యుద్ధం నేపథ్యంలో కీలకమైన హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన విషయం తెలిసిందే. ఈ…
దేశమంతా ఆసక్తిగా ఎదురు చూసిన నియోజకవర్గాల పునర్విభజన, మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లకు ఉద్దేశించిన బిల్లులకు పార్లమెంటులో చుక్కెదురైంది. డీలిమిటేషన్, మహిళా బిల్లులకు ఆమోదం…
మతపరంగా రిజర్వేషన్లను కల్పించేది లేదని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పార్లమెంటులో తెగేసి చెప్పారు. మహిళా బిల్లు…