తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న `హైడ్రా` వ్యవస్థపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేతలు చేపట్టడం ఏంటని నిలదీసింది.“మీరేమైనా ప్రజలపై యుద్ధం చేస్తున్నారా? మీరు చేపడుతున్న కూల్చివేతలను గమనిస్తే..యుద్ధ సన్నివేశాలను తలపిస్తున్నాయి. ఇలాంటి చర్యలు చేపట్టే అధికారం మీకు ఉందా? ఉంటే ఎవరు అధికారం ఇచ్చారు“ అని నిలదీసింది. ఎలాంటి నిబంధనలు పాటించకుండా.. ముందస్తు నోటీసులు కూడా ఇవ్వకుండానే కూల్చివేతలు ఎలా చేపడతారని ప్రశ్నించింది.
ఇటీవల అమీన్పూర్ మండలం ఐలాపురంలో భారీ అంతస్థుల భవనాన్ని ఆక్రమించారంటూ.. హైడ్రా దానిని కూల్చివేసింది. ఈ సందర్భంగా బాధితులు గగ్గోలు పెట్టినా హైడ్రా అధికారులు వినిపించుకోలేదన్న చర్చ తెరమీదికి వచ్చింది. తాజాగా వీరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు.. హైడ్రాకు ఉన్న అధికారాలను ప్రశ్నించింది. ఏ అథారిటీతో కూల్చివేతలు చేపడుతున్నారని ప్రశ్నల వర్షం కురిపించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎక్కడా ఎలాంటి నిర్మాణాలను కూల్చివేయడానికి వీల్లేదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ముఖ్యంగా కూల్చివేతలు అంటే.. భారీ భవనాలను అడ్డగోలుగా కూల్చివేయడం కాదని పేర్కొంది. “అక్రమ కట్టడాల వల్ల పర్యావరణం దెబ్బతింటోందని భావించినా.. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకున్నారని తెలిసినా.. కాల్వలు, చెరువులను ఆక్రమించుకున్నా వాటిని తొలగించేందుకు మాత్రమే అనుమతి ఉంటుంది.“ అని స్పష్టం చేసింది.
అయినప్పటికీ నిబంధనలను పాటించాల్సిందేనని తేల్చి చెప్పింది. సరైన ప్రామాణికతలు పాటించకుండా కూల్చివేతలు చేపట్టవద్దని గతంలోనే ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని హైకోర్టు మరోసారి గుర్తు చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు కూల్చివేతలు చేపట్టరాదని స్పష్టం చేసింది.
This post was last modified on April 14, 2026 2:06 pm
ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…
కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన…
ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…
ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్ను పక్కన పెడితే.. అల్లు…