Political News

సర్వేలో షాకులు… బాబు ఏం చేస్తారు?

ఆంధ్రప్రదేశ్లో ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా ఎమ్మెల్యేల పనితీరును చంద్రబాబు మరోసారి రాబట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 164 స్థానాల్లో కూటమి పార్టీల నాయకులు ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తున్నారు. వీరిలో 134 మంది టిడిపి ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ ఎమ్మెల్యేలలో దాదాపు 70 మంది పనితీరు ఏ మాత్రం సరిగా లేదని పలు మార్లు చంద్రబాబు చెప్పుకొచ్చారు. వారి పనితీరును మార్చుకోవాలని కూడా ఆయన పదేపదే విన్నవించారు.

ఆ తర్వాత కొన్నాళ్లకు పరిస్థితి మారినప్పటికీ ఇంకా దారిలో పడని ఎమ్మెల్యేల సంఖ్య 30 నుంచి 40 మంది వరకు ఉన్నారనేది స్పష్టమైనది. ఇటీవల తాజాగా మరోసారి ఐ వి ఆర్ ఎస్ సర్వే ద్వారా ఎమ్మెల్యేల పరి తీరును చంద్రబాబు తెలుసుకున్నారు. దీనిలో ప్రధానంగా ప్రజల మధ్యకు వెళ్లడం, ప్రతినెలా ఇంటింటికి పంపిణీ చేస్తున్న పింఛన్ల కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాల్గొనడం, ప్రజాదర్బార్లు నిర్వహించి ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేయటం వంటివి కీలకంగా ఉన్నాయి.

అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పెట్టుబడుల ఆకర్షణ వంటి అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని చంద్రబాబు కోరుతున్నారు. ఎమ్మెల్యేల పనితీరును తాజాగా మరోసారి తెలుసుకున్నారు. దీనిలో మళ్లీ 30 నుంచి 40 మంది పనితీరు అలాగే ఉందని స్పష్టమైనట్టు సిఎం ఓ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో పనిచేయని ఎమ్మెల్యేలకు మరోసారి చంద్రబాబు క్లాసులు ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చూచాయగా చెప్పుకొచ్చారు.

నిజానికి ఎన్నికల సమయానికి మరో రెండు ఏళ్ల‌కుపైగా సమయం ఉంది. అయినప్పటికీ ఇప్పటినుంచే వైసిపి పై బలమైన పోరాటం చేయడంతో పాటు ప్రజల మధ్యకు వెళ్లాలి అనేది చంద్రబాబు ఆలోచన. ఆ దిశగా నాయకులు నడవాలని పదేపదే ఆయన చెబుతున్నారు. అయినా కొంతమంది నాయకులు పనితీరును మార్చుకోలేక పోతున్నారు. చంద్ర‌బాబు చెబుతున్న ఫార్ములాను  విస్మరిస్తున్నారు. ఈ వ్యవహారమే చంద్రబాబుకు ఆగ్రహం తెప్పిస్తోంది. మరి ఇప్పటికైనా నాయకులు మారతారా లేదా అనేది చూడాలి.

Kumar

Recent Posts

బాక్సాఫీస్‌కు మంచి రోజులొచ్చాయి

2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’,…

17 minutes ago

థియేట‌ర్లు, షోలు పెంచుకుంటున్న బంగారం

ఈ రోజుల్లో చిన్న‌, మిడ్ రేంజ్ సినిమాల‌కు రిలీజ్రోజు ఇచ్చిన థియేట‌ర్ల‌ను జ‌నంతో నింప‌డ‌మే క‌ష్టమైపోతోంది. జ‌నం థియేట‌ర్ల‌కు రావ‌డం…

49 minutes ago

కూట‌మికి రెండేళ్లు ఓకే… చేయవలసినవి ఇంకా ఉన్నాయి

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం రెండేళ్ల పాల‌న‌ను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్ర‌భుత్వం ఏం చేయాల‌న్నా.. మ‌రో…

3 hours ago

ప్రభాస్ ఫోన్ లో ఆ వాల్ పేపర్ ఎందుకుంది?

ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…

8 hours ago

“మ‌రో వందేళ్ల‌యినా… కాంగ్రెస్ ఇంతే”

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. ప‌శ్చిమ‌బెంగాల్‌లో శ‌నివారం సాయంత్రం ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న దేశ‌వ్యాప్తంగా అన్న‌దాత‌ల‌కు పీఎం-కిసాన్ నిధుల‌ను…

9 hours ago

‘గొడ్డ‌లి పార్టీ అంత‌కు మించి ఏం చేసింది?’

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. మ‌రోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గ‌త ఐదేళ్ల కాలంలో గొడ్డ‌లి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయ‌డం..…

11 hours ago