వైసీపీ సీనియర్ నేత, ఏపీ శాసన మండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వెక్కివెక్కి ఏడ్చారు. ఇలా బహిరంగంగా బొత్స ఏడ్చింది.. ఏదో పార్టీ సమావేశంలో కాదు. మీడియా ముందు ఆయన వెక్కివెక్కి ఏడ్చారు. ఈ మేరకు విశాఖలో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిని గుర్తు చేసుకుని బొత్స కన్నీటి పర్యంతం అయ్యారు. ఈ దృశ్యాలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
వైఎస్ మరణం వెనుక జగన్ హస్తం ఉందని… ఈ విషయాన్ని వైసీపీకి చెందిన బొత్స సత్యనారాయణనే చెప్పారంటూ టీడీపీ సీనియర్ నేత, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలను ఖండించేందుకు వెనువెంటనే మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన బొత్స… వైఎస్ మరణం, నాడు చోటుచేసుకున్న పరిణామాలను ప్రస్తావిస్తున్న సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు. వైఎస్ తో తనకున్న అనుబంధం అలాంటిది అని వ్యాఖ్యానించిన బొత్స…కూటమి నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
వైఎస్ చనిపోయిన సందర్భంలో జగన్ ఏపీలో లేరని, ఇతర రాష్ట్రాల్లో ఉన్నారని అచ్చెన్న చెప్పిన మాటల్లో వాస్తవం లేదని బొత్స అన్నారు. నాడు సీఎం క్యాంపు ఆఫీస్ లో నుంచి జగన్ ను తాను, తన భార్చ ఝాన్సీ చెరో పక్క పట్టుకుని తీసుకుని వచ్చామని ఆయన చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగానే భావోద్వేగానికి గురైన బొత్స కన్నీటిపర్యంతం అయ్యారు. రాజకీయంగా విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకోవడానికి తాను సిద్ధమేనని, అయితే దిగజారుడు మాటలు మాట్లాడటం సరికాదని ఆయన అన్నారు. అచ్చెన్న అహంకారంతో మాట్లాడుతున్నారన్న బొత్స… కూటమి నేతలు అహంకారాన్ని వీడాలని హితవు పలికారు.
దర్శకులందు అనిల్ రావిపూడి వేరయాని ఊరికే అనలేదు. షూటింగ్ మొదలుపెట్టడానికి ముందే తనదైన ప్రమోషన్లతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్…
దేశంలో ఇటీవలే లోక్ సభ, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపునకు సంబందించి ఓ రేంజిలో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే.…
రెడ్ బుక్ మూసేయలేదని.. అది ఇంకా తెరిచే ఉందని మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్లో…
ఈ ఏడాది ‘దురంధర్-2’ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ బాగానే కళకళలాడినప్పటికీ.. ఓవరాల్ సక్సెస్ రేట్ ఏమీ అంత గొప్పగా లేదు.…
తమరిది అన్నదమ్ముల అనుబంధం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మంత్రి నారా లోకేష్ పలుమార్లు వ్యాఖ్యానించారు.…
రాష్ట్రంలో బౌలర్స్(ప్రత్యర్థులు) మారినా బ్యాట్స్మెన్ మాత్రం చంద్రబాబు నాయుడేనని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. తిరుపతిలో జరిగిన ప్రభుత్వ వియోజత్సవ…