వైసీపీ సీనియర్ నేత, ఏపీ శాసన మండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వెక్కివెక్కి ఏడ్చారు. ఇలా బహిరంగంగా బొత్స ఏడ్చింది.. ఏదో పార్టీ సమావేశంలో కాదు. మీడియా ముందు ఆయన వెక్కివెక్కి ఏడ్చారు. ఈ మేరకు విశాఖలో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిని గుర్తు చేసుకుని బొత్స కన్నీటి పర్యంతం అయ్యారు. ఈ దృశ్యాలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
వైఎస్ మరణం వెనుక జగన్ హస్తం ఉందని… ఈ విషయాన్ని వైసీపీకి చెందిన బొత్స సత్యనారాయణనే చెప్పారంటూ టీడీపీ సీనియర్ నేత, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలను ఖండించేందుకు వెనువెంటనే మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన బొత్స… వైఎస్ మరణం, నాడు చోటుచేసుకున్న పరిణామాలను ప్రస్తావిస్తున్న సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు. వైఎస్ తో తనకున్న అనుబంధం అలాంటిది అని వ్యాఖ్యానించిన బొత్స…కూటమి నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
వైఎస్ చనిపోయిన సందర్భంలో జగన్ ఏపీలో లేరని, ఇతర రాష్ట్రాల్లో ఉన్నారని అచ్చెన్న చెప్పిన మాటల్లో వాస్తవం లేదని బొత్స అన్నారు. నాడు సీఎం క్యాంపు ఆఫీస్ లో నుంచి జగన్ ను తాను, తన భార్చ ఝాన్సీ చెరో పక్క పట్టుకుని తీసుకుని వచ్చామని ఆయన చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగానే భావోద్వేగానికి గురైన బొత్స కన్నీటిపర్యంతం అయ్యారు. రాజకీయంగా విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకోవడానికి తాను సిద్ధమేనని, అయితే దిగజారుడు మాటలు మాట్లాడటం సరికాదని ఆయన అన్నారు. అచ్చెన్న అహంకారంతో మాట్లాడుతున్నారన్న బొత్స… కూటమి నేతలు అహంకారాన్ని వీడాలని హితవు పలికారు.
This post was last modified on April 9, 2026 6:53 pm
అది ఢిల్లీ హైకోర్టు. ప్రధాన న్యాయమూర్తి ఓ కేసు విచారణను ఆన్లైన్లో ప్రారంభించారు. కొన్ని నిమిషాలు జరిగాయి. వర్చువల్ విచారణలో…
టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ఇటీవల పార్టీలో జాతీయ, రాష్ట్ర స్థాయి కార్యవర్గాలతోపాటు.. పొలిట్ బ్యూరోను…
మెగా ఫ్యాన్స్ కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న శుభ వార్త పెద్ది విడుదల తేది. ఏప్రిల్ 30 నుంచి…
కేరళంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సుదీర్ఘ విరామం తర్వాత.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తోందా? అంటే.. ఔననే అంటు న్నాయి……
ఈశాన్య రాష్ట్రం అస్సాంలో బీజేపీ తన పట్టును వరుసగా మూడో సారి కూడా నిలబెట్టుకుంటోందని సర్వే సంస్థలు తేల్చి చెప్పాయి.…
దీదీనా-మోదీనా నినాదంతో జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోటీలో మోదీదే పైచేయి అని బీజేపీనే విజయం దక్కించు కుంటుందని…