ఏపీకి ఏకైక, శాశ్వత రాజధానిగా అమరావతిని గుర్తించే కూటమి సర్కారు తీసుకున్న చర్యలు విపక్ష వైసీపీని ఓ రేంజిలో కలవరపాటుకు గురి చేశాయని చెప్పక తప్పదు. అమరావతికి తాము వ్యతిరేకం కాదంటూనే… అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగకుండా తాము అధికారంలోకి వస్తే మరో బిల్లు పెట్టలేమా? అంటూ భిన్న వాదనలతో స్వైర విహారం చేస్తున్నారు. ఈ తరహా వైఖరితో జనంలో పార్టీ బాగా పలచన అయిపోయిందన్న విశ్లేషణలు సాగుతున్నాయి. ఇలాంటి తరుణంగా ఆగ్నికి ఆజ్యం తోడైనట్లు వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు.
సోషల్ మీడియాలో ట్రోలింగ్ మెటీరియల్ అయిన మావిగన్ ను పట్టుకుని అంబటి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ అభివృద్ధికి మావిగన్ ఓ మంత్రం లాంటిదని ఆయన అన్నారు. ఈ విషయం తెలుసుకున్న తర్వాతే మావిగన్ పై ట్రోలింగ్ మొదలుపెట్టారని కూడా ఆయన తనదైన శైలి భాష్యం చెప్పారు.
వాస్తవానికి గతంలో అమరావతి, విశాఖ, కర్నూలు పేరిట మూడు రాజధానుల జపం చేసిన జగన్… ఇప్పుడు కొత్తగా మావిగన్ అనే నినాదం ఇవ్వడంతో ఆయన ఒక్కమాట మీద నిలబడరన్న వాదనలకు బలం చేకూరింది. అంతేకాకుండా మావిగన్ పై టీడీపీ సానుభూతిపరులే కాకుండా జనరల్ పబ్లిక్ కూడా ఓ రేంజిలో సెటైర్లు సంధిస్తున్నారు. అయినా అంబటి మావిగన్ అభివృద్ధి మంత్రం అంటూ చెప్పడం గమనార్హం.
జగన్ నోట నుంచి వచ్చిన మావిగన్ ను జనం అంగీకరిస్తున్నారని కూడా అంబటి ఓ కన్ క్లూజన్ ఇచ్చిపడేశారు. వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పినట్టుగానే.. అంబటి కూడా అమరావతిని తాము మార్చేస్తామని చెప్పేశారు. అమరావతిని శాశ్వత రాజధాని అని కూటమి ఓ బిల్లును పాస్ చేస్తే… దానిని తొలగించేందుకు తాము మరో బిల్లును పాస్ చేయించలేమా? అంటూ అంబటి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇక అమరావతి ఎప్పటికీ అభివృద్ధి కాదని చెప్పిన అంబటి… రాష్ట్రం అభివృద్ధి చెందాలంటూ మావిగన్ నే పరమావధి అన్నట్లుగా ఓ రూలింగ్ ఇచ్చేశారు. అంబటి వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
This post was last modified on April 3, 2026 8:02 pm
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…
పార్టీలు బలంగా ఉండాలంటే.. సమాజంలోని పలు వర్గాల మద్దతు అవసరం. నాయకులు, అధినేతలు ఎంత బలంగా ఉన్నా.. సమాజంలోని వర్గాలు…