అదేంటో గానీ.. మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని ఏ విషయంపై అయినా అధికారులు, పోలీసులపైకి ఎగబడిపోతూ ఉంటారు. తాను చెప్పిందే వేదమంటూ ఆయన చేస్తున్న వాగ్వాదాలు వైరల్ అవుతూ ఉంటాయి. నాని రాజకీయ వారసత్వం పుచ్చుకున్న ఆయన కుమారుడు పేర్ని వాక సాయి కృష్ణమూర్తి అలియాస్ పేర్ని కొట్టు కూడా అచ్చూ తన తండ్రి మాదిరే వ్యవహరిస్తున్నారు. అధికారులన్నా, పోలీసులన్నా ఆయన ఏమాత్రం లెక్క చేయడం లేదు. తాజాగా ఓ సర్కిల్ ఇన్స్ పెక్టర్ పై ఆయన ఎగబడిపోయిన వైనం వైరల్ గా మారింది.
పేర్ని కిట్టు పోలీసులపైకి ఎందుకు ఎగబడిపోయారన్న విషయానికి వస్తే…మచిలీపట్నంలోని కొబ్బరితోట ప్రాంతంలో అనుమతి లేకుండా నిర్మించిన ఓ కట్టడాన్ని కూల్చేవేసేందుకు అధికారులు అక్కడికి వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న పేర్ని కిట్టు…మందీమార్చలాన్ని వెంటేసుకుని హుటాహుటీన అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ విధుల్లో ఉన్న పోలీసులపైకి ఆయన ఎగబడిపోయారు. ఈ సందర్భంగా మర్యాద పాటించాలంటూ కిట్టుకు ఇనుకుదురుపేట సీఐ పరమేశ్వరరావు సూచించారు. ఈ మాటతో ఒక్కసారిగా స్వరం పెంచేసిన కిట్టు… పరమేశ్వరరావుపైకి ఎగబడిపోయారు.
నీకు మర్యాద ఇవ్వడమేమిటంటూ కిట్టు పోలీసు అధికారిని ఏకవచనంతో సంబోధించారు. ఇదేం పద్దతి అని సీఐ ప్రశ్నించగా… నీకు మర్యాద ఇవ్వడమే ఎక్కువ… నీవేం చేస్తున్నావో నాకన్నీ తెలుసునంటూ కిట్టు మరింతగా ఫైరైపోయారు. దీంతో కిట్టు, సీఐల మధ్య వాగ్వాదం పెరిగిపోయింది. కిట్టును వారించడానికి బదులుగా మరింత రెచ్చపొమ్మన్నట్లుగా వైసీపీ నేతలు చోద్యం చూడగా… ఇతర పోలీసులు సీఐని పక్కకు లాక్కెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మచిలీపట్నం నుంచి పేర్ని నాని మూడు పర్యాయములు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019లో మూడో సారి విజయం సాధించిన నాని…జగన్ కేబినెట్ లో మంత్రిగా వ్వహరించారు. 2024 ఎన్నికల్లో తాను పోటీ చేయకుండా తన కుమారుడు కిట్టుకు టికెట్ ఇప్పించుకున్న నాని… తాను పోటీకి దూరంగా ఉండిపోయారు. ఈ ఎన్నికల్లో గతంలో పేర్ని నానిని ఓడించిన టీడీపీ సీనియర్ నేత, మంత్రి కొల్లు రవీంద్ర… కిట్టును కూడా చిత్తుగా ఓడించారు. ఎమ్మెల్యేగా పోటీ చేస్తేనే పోలీసులపైకి ఇంతగా ఎగబడిపోతున్న కిట్టు…ఒకవేళ ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే ఇంకెంతగా ఎగసిపడేవారోనన్న విశ్లేషణలు సాగుతున్నాయి.
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…
ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రముఖ ప్రవచ కర్త చాగంటి కోటేశ్వరరావు ప్రసంగాలను పాఠ్యాంశాలుగా ప్రవేశ పెడుతున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించి…
ఏపీలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపిలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కూటమికి నేతృత్వం…
ఓ రాజకీయ పార్టీ తనను వేధించిన విషయంపై అలుపెరగని పోరాటం చేసి తీరుతుంది. అలా చేయకుంటే… అది రాజకీయ పార్టీ…
భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోమారు తెలంగాణ అంశం మీద నోరు విప్పారు. భారత దేశంలో…