బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ హనుమాన్ జయంతి సందర్భంగా రాముడి పాత్ర పరిచయంతో విడుదల చేశారు. కథగా చెప్పేందుకు కొత్త విషయం లేదు కానీ విజువల్స్ తోనే తమ విజన్ ఏ స్థాయిలో ఉందో చూపెట్టేందుకు ప్రయత్నించారు దర్శకులు నితేష్ తివారి, నిర్మాత నమిత్ మల్హోత్రా. కేవలం రాముడిని చూపించే కాన్సెప్ట్ కాబట్టి ఇతర ఆర్టిస్టులను రివీల్ చేయలేదు.
ప్రపంచంలోనే అత్యున్నత విఎఫ్ఎక్స్ కంపెనీల్లో ఒకటైన డిఎన్ఈజి ఈ రామాయణలో భాగస్వామ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. 8 ఆస్కార్ అవార్డులు దక్కించుకున్న ఈ సంస్థ ఎప్పుడూ చూడని గ్రాఫిక్స్ ని ఈ ఎపిక్ డ్రామాలో చూపించబోతున్నట్టు ఇన్ సైడ్ టాక్. ఇక వీడియో విషయానికి వస్తే ఏఆర్ రెహమాన్, జిమ్స్ హ్యామర్ నేపధ్య సంగీతంలో ప్రతి క్షణం ఎలివేట్ అయ్యే స్థాయిలో అబ్బురపరిచే దృశ్యాలు రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్లు కట్టిపడేస్తాయి.
నాలుగు వేల కోట్ల బడ్జెట్ అంటున్నారు కాబట్టి ఆ స్థాయిలో అనిపించాయా అంటే వెంటనే సమాధానం చెప్పడం కష్టం. ఎందుకంటే ఇది కేవలం శాంపిల్ మాత్రమే. రుచి చెప్పడానికి ఒక్క మెతుకు సరిపోతుంది కానీ ఇలాంటి కంటెంట్ విషయంలో తొందరపడి ఎలాంటి జడ్జ్ మెంట్లు ఇవ్వలేం. పైగా రిలీజ్ ఇంకా చాలా దూరం ఉంది కాబట్టి పరిమితంగా సీన్స్ చూపించాలన్న ఉద్దేశంతో కట్ చేసిన విధానం ఎన్నో విషయాలను దాచి పెట్టిందన్నది వాస్తవం.
డేట్ ఇంకా నిర్ధారణగా చెప్పకపోయినా ఇదే సంవత్సరం దీపావళికి విడుదల కావడం పక్కా. మరోసారి దాన్ని టీజర్ లో నొక్కి చెప్పారు. సాయిపల్లవి సీతగా, యాష్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా నటిస్తున్న రామాయణ ఇకపై ఎవరూ ఇంత గొప్పగా రామకథను చెప్పలేరన్న రీతిలో నితేశ్ తివారి తెరకెక్కిస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్. ఈ స్థాయి అంచనాలను నిలబెట్టుకోగలిగితే వరల్డ్ వైడ్ వసూళ్లతో పెట్టిన పెట్టుబడి రికవరీ చేసుకోవచ్చు. అదే జరిగితే కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టినట్టే.
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…
ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రముఖ ప్రవచ కర్త చాగంటి కోటేశ్వరరావు ప్రసంగాలను పాఠ్యాంశాలుగా ప్రవేశ పెడుతున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించి…
ఏపీలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపిలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కూటమికి నేతృత్వం…
ఓ రాజకీయ పార్టీ తనను వేధించిన విషయంపై అలుపెరగని పోరాటం చేసి తీరుతుంది. అలా చేయకుంటే… అది రాజకీయ పార్టీ…
భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోమారు తెలంగాణ అంశం మీద నోరు విప్పారు. భారత దేశంలో…