Political News

కాళేశ్వ‌రంలో `ల‌క్ష కోట్లు` తిన్నారు: కేంద్రం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

తెలంగాణ‌లో తీవ్ర రాజ‌కీయ వివాదానికి దారి తీసిన `కాళేశ్వ‌రం` ప్రాజెక్టుపై కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. కాళేశ్వ‌రం ప్రాజెక్టులో అవినీతి, అక్ర‌మాలు జ‌రిగాయ‌ని కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్ల‌డించారు. ఈక్ర‌మంలో ల‌క్ష కోట్ల రూపాయ‌ల‌ను తినేశార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. వాస్త‌వానికి మంత్రి చెప్పిన‌ప్ప‌టికీ.. ఆయ‌న కేంద్ర ప్ర‌భుత్వంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.. పైగా కీల‌క‌మైన‌ జ‌ల‌శ‌క్తిశాఖ‌కు మంత్రిగా ఉన్నారు. దీంతో మంత్రి ప్ర‌క‌ట‌న కేంద్రం చేసిన ప్ర‌క‌ట‌న‌గానే భావించాల‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

కేవ‌లం అవినీతి.. అక్ర‌మాలేకాదు.. ప్రాజెక్టుపై సీఆర్ పాటిల్ మ‌రిన్ని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. డిజైన్‌, నిర్మాణం, ప్ర‌ణాళిక‌ల లో పాల కార‌ణంగానే కాళేశ్వ‌రం ప్రాజెక్టు విఫ‌లం కావ‌డానికి కార‌ణ‌మ‌ని వివ‌రించారు. తాజాగా పార్లమెంటులోని త‌న కార్యాల‌యం లో కొంద‌రు బీజేపీ స‌భ్యులు ఈ అంశాన్ని ప్ర‌శ్నించిన‌ప్పుడు.. కాళేశ్వ‌రంపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇక‌, ఈ ప్రాజెక్టు వ్య‌వ‌హారా  న్ని తాము నిశితంగా గ‌మ‌నిస్తున్నామ‌న్నారు. త‌మ శాఖ సీనియ‌ర్ అధికారులు కూడాదీనిపై అధ్య‌య‌నం చేస్తున్నార‌ని చెప్పా రు. ప్ర‌జాధ‌నాన్ని దుర్వినియోగం చేయ‌డం స‌రికాద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

వివాదాల ప్రాజెక్టు!

కాళేశ్వ‌రం ప్రాజెక్టును గ‌త కేసీఆర్ ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన విష‌యం తెలిసిందే. దీనిని అప్ప‌ట్లో తెలంగాణ కు జీవ‌నాడిగా.. వెన్నెముక‌గా కూడా కేసీఆర్ అభివ‌ర్ణించారు. అయితే.. దీనికి సంబంధించిన లోపాలు బ‌య‌ట‌ప‌డ‌డం.. అప్ప‌టి కి ఆయ‌న ప్ర‌భుత్వం ప‌డిపోయి.. కాంగ్రెస్ అధికారంలోకి రావ‌డంతో కాళేశ్వ‌రంపై సీఎం రేవంత్ రెడ్డి విచార‌ణ‌కు ఆదేశించారు. ల‌క్ష‌ల కోట్ల అవినీతి జ‌రిగింద‌ని.. కాళేశ్వ‌రం కాదు.. కూలేశ్వ‌రం అంటూ.. వ్యంగ్యాస్త్రాలు కూడా సంధించారు. కేసీఆర్‌.. అప్ప‌టి జ‌ల‌వ‌న‌రుల మంత్రి హ‌రీష్‌రావుపైనా కాంగ్రెస్ నాయ‌కులు నిప్పులు చెరిగారు.

ఈ క్ర‌మంలోనే మాజీ న్యాయ‌మూర్తి పినాకి చంద్ర‌ఘోష్ నేతృత్వంలో క‌మిష‌న్‌.. సుదీర్ఘ విచార‌ణ చేసి నివేదిక‌ను ఇచ్చింది. ప‌లు సంద‌ర్భాల్లో కేసీఆర్‌ను ఈ క‌మిష‌న్ విచారించింది. ఇటీవ‌ల అసెంబ్లీలోనూ ఈ వ్య‌వ‌హారం ర‌చ్చ‌రేపిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామాల క్ర‌మంలోనే కేంద్రం ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. అయితే.. దీనిపై కేంద్రం చ‌ర్య‌లు తీసుకుంటుందా? అనే విష‌యంపై మాత్రం కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ స్పందించ‌లేదు.

This post was last modified on March 31, 2026 8:25 am

Share

Recent Posts

దాయ్‌రాగా మారిన దిశా… బాగా లేటయ్యింది

ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…

2 hours ago

షర్మిల కూతురి పెళ్ళికి జగన్ డుమ్మా ?

వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…

2 hours ago

ప్యారడైజ్ పోటీ నుండి తప్పుకున్న కీర్తి సురేష్

ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…

4 hours ago

టార్గెట్ గ‌జ్వేల్‌.. కాంగ్రెస్ వ్యూహం ఇదీ!

గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గం.. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కంచుకోట‌. అయితే.. ఇక్క‌డే పాగా వేయాల‌ని.. వ‌చ్చే…

4 hours ago

మొహమాట పడితే ఎలాగయ్యా సట్టపులి

తమిళంలో డెబ్యూతోనే సూపర్ హిట్ అందుకున్న సుహాస్ గురించి చెన్నై మండాడి సక్సెస్ మీట్ లో దర్శకుడు చేసిన కామెంట్స్…

4 hours ago

సిగ్మా సౌండ్ సరిపోతుందంటారా

అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది.…

10 hours ago