Political News

కాళేశ్వ‌రంలో `ల‌క్ష కోట్లు` తిన్నారు: కేంద్రం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

తెలంగాణ‌లో తీవ్ర రాజ‌కీయ వివాదానికి దారి తీసిన `కాళేశ్వ‌రం` ప్రాజెక్టుపై కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. కాళేశ్వ‌రం ప్రాజెక్టులో అవినీతి, అక్ర‌మాలు జ‌రిగాయ‌ని కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్ల‌డించారు. ఈక్ర‌మంలో ల‌క్ష కోట్ల రూపాయ‌ల‌ను తినేశార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. వాస్త‌వానికి మంత్రి చెప్పిన‌ప్ప‌టికీ.. ఆయ‌న కేంద్ర ప్ర‌భుత్వంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.. పైగా కీల‌క‌మైన‌ జ‌ల‌శ‌క్తిశాఖ‌కు మంత్రిగా ఉన్నారు. దీంతో మంత్రి ప్ర‌క‌ట‌న కేంద్రం చేసిన ప్ర‌క‌ట‌న‌గానే భావించాల‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

కేవ‌లం అవినీతి.. అక్ర‌మాలేకాదు.. ప్రాజెక్టుపై సీఆర్ పాటిల్ మ‌రిన్ని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. డిజైన్‌, నిర్మాణం, ప్ర‌ణాళిక‌ల లో పాల కార‌ణంగానే కాళేశ్వ‌రం ప్రాజెక్టు విఫ‌లం కావ‌డానికి కార‌ణ‌మ‌ని వివ‌రించారు. తాజాగా పార్లమెంటులోని త‌న కార్యాల‌యం లో కొంద‌రు బీజేపీ స‌భ్యులు ఈ అంశాన్ని ప్ర‌శ్నించిన‌ప్పుడు.. కాళేశ్వ‌రంపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇక‌, ఈ ప్రాజెక్టు వ్య‌వ‌హారా  న్ని తాము నిశితంగా గ‌మ‌నిస్తున్నామ‌న్నారు. త‌మ శాఖ సీనియ‌ర్ అధికారులు కూడాదీనిపై అధ్య‌య‌నం చేస్తున్నార‌ని చెప్పా రు. ప్ర‌జాధ‌నాన్ని దుర్వినియోగం చేయ‌డం స‌రికాద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

వివాదాల ప్రాజెక్టు!

కాళేశ్వ‌రం ప్రాజెక్టును గ‌త కేసీఆర్ ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన విష‌యం తెలిసిందే. దీనిని అప్ప‌ట్లో తెలంగాణ కు జీవ‌నాడిగా.. వెన్నెముక‌గా కూడా కేసీఆర్ అభివ‌ర్ణించారు. అయితే.. దీనికి సంబంధించిన లోపాలు బ‌య‌ట‌ప‌డ‌డం.. అప్ప‌టి కి ఆయ‌న ప్ర‌భుత్వం ప‌డిపోయి.. కాంగ్రెస్ అధికారంలోకి రావ‌డంతో కాళేశ్వ‌రంపై సీఎం రేవంత్ రెడ్డి విచార‌ణ‌కు ఆదేశించారు. ల‌క్ష‌ల కోట్ల అవినీతి జ‌రిగింద‌ని.. కాళేశ్వ‌రం కాదు.. కూలేశ్వ‌రం అంటూ.. వ్యంగ్యాస్త్రాలు కూడా సంధించారు. కేసీఆర్‌.. అప్ప‌టి జ‌ల‌వ‌న‌రుల మంత్రి హ‌రీష్‌రావుపైనా కాంగ్రెస్ నాయ‌కులు నిప్పులు చెరిగారు.

ఈ క్ర‌మంలోనే మాజీ న్యాయ‌మూర్తి పినాకి చంద్ర‌ఘోష్ నేతృత్వంలో క‌మిష‌న్‌.. సుదీర్ఘ విచార‌ణ చేసి నివేదిక‌ను ఇచ్చింది. ప‌లు సంద‌ర్భాల్లో కేసీఆర్‌ను ఈ క‌మిష‌న్ విచారించింది. ఇటీవ‌ల అసెంబ్లీలోనూ ఈ వ్య‌వ‌హారం ర‌చ్చ‌రేపిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామాల క్ర‌మంలోనే కేంద్రం ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. అయితే.. దీనిపై కేంద్రం చ‌ర్య‌లు తీసుకుంటుందా? అనే విష‌యంపై మాత్రం కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ స్పందించ‌లేదు.

Kumar

Recent Posts

వైసీపీకీ ఓ ‘సూపర్ యాప్’ వచ్చేసింది!

ఆదునిక సాంకేతికతను వినియోగించుకునే విషయంలో రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు కీలక అడుగులు వేస్తున్నాయి. అందివచ్చిన సాంకేతికతతో ఆయా పార్టీలు తమ కార్యకలాపాల నిర్వహణ, కార్యకర్తలతో నిత్యం…

49 minutes ago

కాంగ్రెస్ చెయ్యలేనిది మోదీ చేసి చూపించారు

విష‌యం చిన్న‌దే అయినా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండ‌గా చేయ‌లేనిది.. ప్ర‌స్తుత ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చేసి చూపించారు. అదే.. దేశంలో…

2 hours ago

ముద్రగడకు గవర్నర్ పదవిని సిఫార్సు చేసిన పవన్

కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లో కీలక నేతగా వ్యవహరించారు. తెలుగు నేల రాజకీయాల్లో మూడు పర్యాయాలు…

2 hours ago

చెన్నై ల‌వ్ స్టోరీ ఎందుకు చేతులు మారింది?

బేబీ సినిమాతో పెద్ద సంచ‌ల‌న‌మే రేపాడు ద‌ర్శ‌క నిర్మాత సాయిరాజేష్‌. కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న వైష్ణ‌వి చైత‌న్య‌, ఆనంద్…

4 hours ago

డ్ర‌గ్స్ కోసం ఎగ‌బ‌డ్డ ఎమ్మెల్సీ కొడుకు… ప‌ట్టేసుకున్న పోలీసులు

హైద‌రాబాద్‌ను డ్ర‌గ్స్ మ‌హ‌మ్మారి వెంటాడుతోంది. ఇటు ప్ర‌భుత్వం, అటు పోలీసులు అనుక్ష‌ణం డ్ర‌గ్స్ క‌ట్ట‌డికి ఎంతగా ప్ర‌య‌త్నిస్తున్నా.. ఏదో ఒక…

5 hours ago

హ‌మ్మ‌య్య‌… ఎట్ట‌కేల‌కు క‌దిలిన క‌మ‌ల‌నాథులు!

ఏపీలో కూట‌మిగా ఏర్పడి.. అధికారాన్ని పంచుకుంటున్న బీజేపీ.. గ‌త రెండేళ్ల కాలంలో ఎప్పుడూ.. పెద‌వి విప్పి.. కూట‌మి ప్ర‌భుత్వం సాధించిన…

5 hours ago