తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. గురువారం నాటి సమావేశాల్లో భాగంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డి, మంత్రి సీతక్కలు అసలు చర్చను పక్కనపెట్టేసి ఏకంగా వ్యక్తిగత అంశాలను ప్రస్తావించుకుని వాదులాడుకున్నారు.
ఈ సందర్భంగా సీతక్క సంధించిన విమర్శలను ప్రస్తావించిన సబిత… సీతక్క ఏమైనా కాంగ్రెస్ లో పుట్టి పెరిగిందా అంటూ ఘాటు విమర్శలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వద్ద మంచి మార్కులు వేయించుకునేందుకే సీతక్క తనపై అనవసర ఆరోపణలు గుప్పిస్తున్నారని కూడా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అటు వైపు నుంచి సీతక్క వ్యాఖ్యలు… వాటికి సబిత ప్రతి వ్యాఖ్యలు సభలో వేడి పుట్టించాయి.
కాంగ్రెస్ పార్టీ సబితకు లెక్కలేనన్ని అవకాశాలు ఇచ్చిందని, అయినా కూడా కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేస్తూ సబిత బీఆర్ఎస్ లో చేరిపోయారని సీతక్క ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన సబిత…ఘాటుగా స్పందించారు. కేసీఆర్ కుటుంబాన్ని తనను విమర్శిస్తే సీఎం ఆనందిస్తారన్నట్లుగా వ్యవహారం సాగుతోందని సబిత సెటైర్లు సంధించారు.
కాంగ్రెస్ పార్టీ తనకు మంత్రి పదవి ఇచ్చిందని, అదే సమంలో 5 సీబీఐ కేసులు కూడా పెట్టిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనకు జరిగిన న్యాయం, అన్యాయాలను ప్రస్తావించే హక్కు కూడా తనకు లేదా? అని ఆమె ప్రశ్నించారు. తానేదో పార్టీ మారానని చెబుతుున్న సీతక్క కాంగ్రెస్ లో పుట్టి పెరిగిందా? అని ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్తీని తాను ఏనాడూ తులనాడలేదన్న సబిత… సీఎం నేరుగా తనపై విమర్శలు గుప్పించాకే తానుు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడాల్సి వచ్చిందని చెప్పారు.
వాస్తవానికి కాంగ్రెస్ తోనే రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన సబిత… రాష్ట్ర విభజన తర్వాత మారిన రాజకీయ పరిణామాలకు అనుగుణంగా కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరారు. అదే సమయంలో టీడీపీతో రాజకీయాలను ప్రారంభించిన సీతక్క… రాష్ట్ర విభజన తర్వాత రేవంత్ రెడ్డితో కలిసి టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరారు.
పార్టీ మారిన తర్వాత కూడా బీఆర్ఎస్ సర్కారులో సబిత మంత్రి పదవిని దక్కించుకున్నారు. ఇక టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరిన తర్వాత సీతక్క తొలిసారిగా మంత్రి పదవిని చేపట్టారు. సీఎం రేవంత్ కు అత్యంత సన్నిహితురాలిగా మెలగుతున్న సీతక్క… కాంగ్రెస్ సర్కారు తీసుకుంటున్న ప్రతి నిర్ణయంలోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి ఇద్దరు మహిళా నేతల మధ్య శాసనసభలో వ్యక్తిగత అంశాలను ప్రస్తావించుకుని మరీ వాదులాడుకోవడం ఆసక్తి రేకెత్తించింది.
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…
రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…