లోక్ సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఖరారైన నేపథ్యంలో దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఆయా పరిణామాలపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఈ రచ్చల్లో తమ నేతల తలరాతలు ఎలా ఉంటాయన్న దిశగా జనం రకరకాల సమరణాలను ప్రస్తావించుకుంటున్నారు. ఈ తరహా చర్చలు ఆంధ్రప్రదేశ్ లో ఓ రేంజిలో సాగుతున్నాయి.
ఆయా పార్టీల కీలక నేతల భవిష్యత్తు ఎలా ఉండబోతోందన్న దానిపై పెద్ద ఎత్తున చర్చలు సాగుతున్నాయి. అందులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ కేబినెబ్ లో కీలక శాఖల మంత్రి నారా లోకేశ్ భవిష్యత్తుపై జరుగుతున్న చర్చ మరింత ఆసక్తి రేపుతోంది. 2029 ఎన్నికల్లో లోకేశ్ ప్రస్తుతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నుంచే పోటీ చేస్తారా?… లేదంటే వేరే నియోజకవర్గానికి మారతారా? అన్న అంశపై జోరుగా చర్చ నడుస్తోంది.
లోక్ సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభనతో పాటుగా అటు లోక్ సభ సీట్లతో పాటు ఇటు అసెంబ్లీ సీట్లలోనూ మహిళలకు 30 శాతం సీట్లను కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం తీర్మానించేసింది. అంటే…ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీలకు కొనసాగుతున్న రిజర్వేషన్లతో పాటుగా కొత్తగా మహిళలకు కూడా కొన్ని సీట్లు అందిరానున్నాయి.
మహిళలకు రిజర్వ్ అయ్యే సీట్లలో పోటీ చేసేందుకు వారికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఇలా రిజర్వ్ అయ్యే సీట్లలో ప్రస్తుతం పురుష అభ్యర్తులు ప్రజా ప్రతినిధులుగా కొనసాగుతూ ఉంటే… తదుపరి ఎన్నికల్లో వారు పోటీకి అనర్హులే. మరి మహిళలకు రిజర్వ్ అయ్యే సీట్లను ఎలా ఖరారు చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది.
ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కేటాయించే సీట్లను ఆయా జిల్లాల్లో సంబంధిత వర్గాల జనాభా అత్యధికంగా గల నియోజకవర్గాలను వారికి కేటాయిస్తారు. ఇప్పుడు మహిళలకు కేటాయించే నియోజకవర్గాల ఎంపికలోనూ ఇదే విదానాన్ని పాటిస్తారు. ఈ లెక్కన ఏఏ జిల్లాల్లో ఏఏ నిజోయకవర్గాల్లో మహిళా ఓటర్లు అత్యధికంగా ఉంటారో ఆయా నియోజకవర్గాలు వారికి కేటాయించబడతాయి.
ఇదే ప్రాతిపదికగా ఇప్పుడు ఏపీలోని ఏఏ నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు అత్యధికంగా ఉన్నారన్న లెక్కలపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ జాబితాలో బీమిలి తొలి స్థానంలో ఉంటే… లోకేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి 1,41,514 మంది మహిళా ఓటర్లతో ఆరో స్థానంలో ఉంది.
ఇప్పుడున్న నియోజకవర్గాలను ఏమాత్రం విభజించకుండా మహిళలకు కేటాయిస్టే… మంగళగిరి తప్పనిరసరిగా మహిళలకే రిజర్వ్ అవుతుంది. అయితే నియోజకవర్గాల పునర్విభజన కూడా జరుగుతున్న తరుణంలో ప్రస్తుత నియోజకవర్గాలన్ని కొత్త రూపును దాల్చనున్నాయి. ప్రస్తుత పరిమాణం కంటే ఓ మోస్తరు చిన్న నియోజకవర్గాలుగా అవి అవతరించనున్నాయి.
అంటే..మంగళగిరి సహా ప్రతి నియోజకవర్గం కూడా చిన్నగా మారుతుంది. ఆయా నియోజకవర్గాల్లోని కొన్ని మండలాలు వాటిలో నుంచి వీడిపోతాయి. ఇలా వీడిపోయిన మండలాల తర్వాత కూడా మంగళగిరిలో మహిళా ఓటర్ల సంఖ్య ఏ మేర ఉంటుందన్న దానిపై అది రిజర్వ్ డ్ అవుతుందా? లేదా? అన్నది తేలుతుంది. దీనిపై ఇప్పటికిప్పుడేమీ స్పష్టత లేకున్నా.. లోకేశ్ రాజకయ ప్రస్థానం ఓ రేంజిలో పెరుగుతున్న నేపథ్యంలో దీనిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…