లోక్ సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఖరారైన నేపథ్యంలో దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఆయా పరిణామాలపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఈ రచ్చల్లో తమ నేతల తలరాతలు ఎలా ఉంటాయన్న దిశగా జనం రకరకాల సమరణాలను ప్రస్తావించుకుంటున్నారు. ఈ తరహా చర్చలు ఆంధ్రప్రదేశ్ లో ఓ రేంజిలో సాగుతున్నాయి.
ఆయా పార్టీల కీలక నేతల భవిష్యత్తు ఎలా ఉండబోతోందన్న దానిపై పెద్ద ఎత్తున చర్చలు సాగుతున్నాయి. అందులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ కేబినెబ్ లో కీలక శాఖల మంత్రి నారా లోకేశ్ భవిష్యత్తుపై జరుగుతున్న చర్చ మరింత ఆసక్తి రేపుతోంది. 2029 ఎన్నికల్లో లోకేశ్ ప్రస్తుతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నుంచే పోటీ చేస్తారా?… లేదంటే వేరే నియోజకవర్గానికి మారతారా? అన్న అంశపై జోరుగా చర్చ నడుస్తోంది.
లోక్ సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభనతో పాటుగా అటు లోక్ సభ సీట్లతో పాటు ఇటు అసెంబ్లీ సీట్లలోనూ మహిళలకు 30 శాతం సీట్లను కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం తీర్మానించేసింది. అంటే…ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీలకు కొనసాగుతున్న రిజర్వేషన్లతో పాటుగా కొత్తగా మహిళలకు కూడా కొన్ని సీట్లు అందిరానున్నాయి.
మహిళలకు రిజర్వ్ అయ్యే సీట్లలో పోటీ చేసేందుకు వారికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఇలా రిజర్వ్ అయ్యే సీట్లలో ప్రస్తుతం పురుష అభ్యర్తులు ప్రజా ప్రతినిధులుగా కొనసాగుతూ ఉంటే… తదుపరి ఎన్నికల్లో వారు పోటీకి అనర్హులే. మరి మహిళలకు రిజర్వ్ అయ్యే సీట్లను ఎలా ఖరారు చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది.
ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కేటాయించే సీట్లను ఆయా జిల్లాల్లో సంబంధిత వర్గాల జనాభా అత్యధికంగా గల నియోజకవర్గాలను వారికి కేటాయిస్తారు. ఇప్పుడు మహిళలకు కేటాయించే నియోజకవర్గాల ఎంపికలోనూ ఇదే విదానాన్ని పాటిస్తారు. ఈ లెక్కన ఏఏ జిల్లాల్లో ఏఏ నిజోయకవర్గాల్లో మహిళా ఓటర్లు అత్యధికంగా ఉంటారో ఆయా నియోజకవర్గాలు వారికి కేటాయించబడతాయి.
ఇదే ప్రాతిపదికగా ఇప్పుడు ఏపీలోని ఏఏ నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు అత్యధికంగా ఉన్నారన్న లెక్కలపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ జాబితాలో బీమిలి తొలి స్థానంలో ఉంటే… లోకేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి 1,41,514 మంది మహిళా ఓటర్లతో ఆరో స్థానంలో ఉంది.
ఇప్పుడున్న నియోజకవర్గాలను ఏమాత్రం విభజించకుండా మహిళలకు కేటాయిస్టే… మంగళగిరి తప్పనిరసరిగా మహిళలకే రిజర్వ్ అవుతుంది. అయితే నియోజకవర్గాల పునర్విభజన కూడా జరుగుతున్న తరుణంలో ప్రస్తుత నియోజకవర్గాలన్ని కొత్త రూపును దాల్చనున్నాయి. ప్రస్తుత పరిమాణం కంటే ఓ మోస్తరు చిన్న నియోజకవర్గాలుగా అవి అవతరించనున్నాయి.
అంటే..మంగళగిరి సహా ప్రతి నియోజకవర్గం కూడా చిన్నగా మారుతుంది. ఆయా నియోజకవర్గాల్లోని కొన్ని మండలాలు వాటిలో నుంచి వీడిపోతాయి. ఇలా వీడిపోయిన మండలాల తర్వాత కూడా మంగళగిరిలో మహిళా ఓటర్ల సంఖ్య ఏ మేర ఉంటుందన్న దానిపై అది రిజర్వ్ డ్ అవుతుందా? లేదా? అన్నది తేలుతుంది. దీనిపై ఇప్పటికిప్పుడేమీ స్పష్టత లేకున్నా.. లోకేశ్ రాజకయ ప్రస్థానం ఓ రేంజిలో పెరుగుతున్న నేపథ్యంలో దీనిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.
This post was last modified on March 26, 2026 10:01 am
కొన్ని సినిమాలు థియేటర్లలో ఆశించిన ఫలితాలు అందుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ సంపాదిస్తాయి. టీవీల్లో, ఆన్ లైన్లో గొప్ప ఆదరణ…
దేశవ్యాప్తంగా పార్లమెంటు నియోజకవర్గాలను పునర్విభించి .. మహిళలకు రిజర్వేషన్ కల్పించాలన్న కేంద్ర ప్రభుత్వం ఆశలు ప్రస్తుత సమావేశాల్లో నెరవేరేలా కనిపించడం…
తెలంగాణాలో ఎమ్మెల్యేలు, మంత్రులకు తమ కుమారుల ప్రేమ వ్యవహారాలు తలనొప్పిగా మారుతున్నాయి. నిన్నా మొన్నటి వరకు కేంద్ర మంత్రి బండి…
ఇంకా రాకా షూటింగ్ పూర్తి కాలేదు. మూడు నెలలకు పైనే వర్కింగ్ డేస్ అవసరమవుతాయని అంటున్నారు. అందుకే విడుదల తేదీ…
రాష్ట్రంలో వైద్యం ఖరీదైన వస్తువుగా మారిపోయింది. ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ పరీక్షలు, ఇతరత్రా ఖర్చుల పేరుతో ప్రైవేటు ఆసుపత్రులు రోగుల నుంచి…
కన్నడ సినిమాలో అతి పెద్ద స్టార్లలో ఒకడైన దర్శన్.. ఏ బాధలూ లేని జీవితాన్ని, బంగారం లాంటి జీవితాన్ని ఎలా…