Political News

మోడీతో ద‌గ్గుబాటి… అవన్నీ పుకార్లేనా?

ప్ర‌ధాన మంత్రిన‌రేంద్ర మోడీతో సీనియ‌ర్ నాయ‌కురాలు, బీజేపీ ఏపీ మాజీ అధ్య‌క్షురాలు, ప్ర‌స్తుత రాజ‌మండ్రి ఎంపీ ద‌గ్గుపాటి పురందేశ్వ‌రి, వెంక‌టేశ్వ‌ర‌రావు దంప‌తులు భేటీ అయ్యారు. అయితే.. స‌హ‌జంగానే ఈ భేటీ జ‌రిగి ఉండొచ్చు.. అనే ప్ర‌శ్న వ‌స్తుంది. కానీ, దీని వెనుక కొన్ని వివాదాల‌కు చెక్ పెట్టాల‌న్న ఉద్దేశం కూడా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

బుధ‌వారం సాయంత్రం ప్ర‌ధాని మోడీతో భేటీ అయిన ద‌గ్గుబాటి దంప‌తులు.. ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావాలపై సంక్షిప్తంగా చర్చించడంతో పాటు, దేశంపై దాని ప్రభావం తక్కువగా ఉండేలా తీసుకున్న చర్యలు, గ్లోబల్ స్థాయిలో భారత్ పోషిస్తున్న నాయకత్వ పాత్ర గురించి వివరించారు.

అదేస‌మ‌యంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు.. మాజీ ప్ర‌ధాని వాజపేయితో తనకు ఉన్న‌ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ముఖ్యంగా ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో భారతదేశం తరఫున మాట్లాడే అవకాశం ఆయన కల్పించిన విషయాన్ని వివరించారు. అలాగే, ఇటీవ‌ల ద‌గ్గుబాటి రచించిన `ది గ్లింప్స్ ఆఫ్ వ‌రల్డ్ హిస్ట‌రీ` పుస్త‌కాన్ని ప్ర‌ధానికి బ‌హూక‌రించారు. అదేవిధంగా, త‌మ‌కు ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో ప్రసంగించే అవకాశం క‌ల్పించార‌ని ప్ర‌ధానిని కొనియాడారు. ఎంతో అరుదైన, గౌరవప్రదమైన విషయం అని పేర్కొంటూ శుభాకాంక్షలు తెలిపారు.

మ‌రోవైపు.. ప్రపంచ చరిత్రపై ఇంత విపులమైన గ్రంథాన్ని రచించడానికి చేసిన కృషిని పేర్కొంటూ.. వెంక‌టేశ్వ‌ర‌రావును ప్రధానమంత్రి అభినందించారు. ఇదిలావుంటే, ప్ర‌స్తుతం పార్ల‌మెంటు జ‌రుగుతున్నా.. మ‌రోవైపు బుధ‌వారం క్యాబినెట్ స‌మావేశం.. మ‌రోవైపు అఖిల ప‌క్ష స‌మావేశం ఇలా ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్న‌ప్ప‌టికీ.. ప్ర‌ధాని త‌మ‌కు స‌మ‌యం కేటాయించ‌డాన్ని ద‌గ్గు బాటి దంప‌తులు ప్ర‌శంసించారు. ఈ సంద‌ర్భంగా రాజ‌మండ్రి అభివృద్ధి, ఎంపీగా తాను చేస్తున్న ప‌నుల‌నుకూడా పురందేశ్వ‌రి వివ‌రించారు. బీజేపీ ఏపీలో ఎలావిస్త‌రిస్తోంది.. ఏవిధంగా ముందుకు వెళ్తోంద‌న్న విష‌యాన్ని కూడా పేర్కొన్నారు.

స‌మ‌స్య‌కు చెక్‌!

మ‌రోవైపు.. ప్ర‌ధాని మోడీని క‌లుసుకోవ‌డం ద్వారా ఏపీలో కొన్నాళ్లుగా జ‌రుగుతున్న ప్ర‌చారానికి ద‌గ్గుబాటి దంప‌తులు చెక్ పెట్టార‌ని ప‌రిశీల‌కులు అంటున్నారు. ప్ర‌స్తుతం పురందేశ్వ‌రి బీజేపీలో ఉన్నారు. అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆమె త‌న కుమారుడు చెంచురామ్‌ను కూడా రాజకీయాల్లోకి తీసుకువ‌స్తున్నారు.

గ‌తంలో వెంక‌టేశ్వ‌ర‌రావు వైసీపీలో ఉన్న నేప‌థ్యానికి తోడు చెంచురామ్‌కు కూడా వైసీపీలో ఉన్న ప‌రిచ‌యాలు.. వ్యాపార సంబంధాల నేప‌థ్యంలోఆయ‌న వైసీపీ వైపు చూస్తున్నార‌ని కొన్నాళ్లుగా బీజేపీలోనే అంత‌ర్గత ప్ర‌చారం సాగుతోంది. తాజాగా ప్ర‌ధాని మోడీని దంప‌తులు క‌లుసుకోవ‌డం ద్వారా ఈ త‌ర‌హా ప్ర‌చారానికి ప‌రోక్షంగా చెక్ పెట్టిన‌ట్టు అయింద‌ని అంటున్నారు.

This post was last modified on March 25, 2026 10:00 pm

Share

Recent Posts

రవితేజ విజయాలకు ‘గట్టిముడి’ పడాలి

ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…

29 minutes ago

పోటీకి సిద్ధంకండి… పొత్తు సంగతి నేను చూసుకుంటాను

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…

2 hours ago

తిరుమలలో ‘రోబోట్‌ డాగ్‌’… వాటి కదలికలపై నిఘా!

తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…

3 hours ago

అప్పట్లో చిరు ఏడాదికి నాలుగు సినిమాలు చేసినా గొడవే

ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్‌ను పక్కన పెడితే.. అల్లు…

10 hours ago

దీపికా విషయంలో సందీప్ వంగానే కరెక్ట్

ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది…

11 hours ago

హృద‌య విదార‌కం… టీచ‌ర్ దెబ్బ‌కు ప్రాణం వ‌దిలిన పిల్లాడు

పిల్ల‌ల విష‌యంలో త‌ల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఎంత సున్నితంగా వ్య‌వ‌హ‌రించాలో చెప్పే ఉదంత‌మిది. విద్యార్థుల‌ను క్ర‌మ‌శిక్ష‌ణ‌లో పెట్టాల‌ని, వారిలో భ‌యం పెంచాల‌ని…

12 hours ago