“ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ హయాంలో కుట్రలు చేశారు. దీనిని శ్మశానం అని గేలి చేశారు” అని సీఎం చంద్రబాబు గత ఆదివారం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే ఈ కుట్రలు ఇంకా ఆగలేదన్న అనుమానాలు స్థానికంగా వ్యక్తమవుతున్నాయి. వరుసగా అమరావతిలో భారీ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడం దీనికి ఉదాహరణగా చర్చ జరుగుతోంది. దీనిపై ప్రభుత్వం కూడా సీరియస్గా దృష్టి పెడుతోంది.
సోమవారం అర్ధరాత్రి అమరావతి రాజధాని ప్రాంతంలో భారీ నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణ సామగ్రిని నిల్వ చేసిన ప్రదేశంలో మంటలు చెలరేగి భారీ నష్టాన్ని కలిగించాయి. సుమారు రెండున్నర గంటల పాటు మంటలు ఎగిసిపడ్డాయని అధికారులు తెలిపారు. ప్లాస్టిక్ సామగ్రి ఎక్కువగా ఉండటంతో మంటలు మరింతగా వ్యాపించాయని చెప్పారు. దాదాపు 3 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా.
కోర్ క్యాపిటల్ ఏరియా రాయపూడిలో ప్రభుత్వ అధికారుల భవనాల నిర్మాణం జరుగుతోంది. వాటికి సంబంధించిన నిర్మాణ సామగ్రిని అక్కడ నిల్వ చేశారు. సోమవారం రాత్రి 11 గంటలు దాటిన తర్వాత ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగినట్లు సమాచారం అందడంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు.
ఇదిలా ఉండగా, గత వారం ఇదే రాజధాని ప్రాంతంలోని వెలగపూడి సమీపంలో ఒక కంపెనీకి చెందిన నిర్మాణ సామగ్రికి కూడా నిప్పు అంటుకుని భారీ ప్రమాదం జరిగింది. ఆ ఘటనలో దాదాపు 2 కోట్ల రూపాయల సరుకు దగ్ధమైంది.
ఈ అగ్ని ప్రమాదాలపై ప్రభుత్వం సీరియస్ అవుతోంది. గత ఘటనపై ఇప్పటికే విచారణ కమిటీని నియమించింది. విచారణ ప్రారంభమయ్యేలోపే తాజాగా రాయపూడిలో మరో పెద్ద ప్రమాదం చోటు చేసుకోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇదంతా ఉద్దేశపూర్వకంగానే జరిగిందని, అమరావతి బ్రాండ్ను దెబ్బతీయడానికి కుట్ర జరుగుతోందని కొన్ని వర్గాలు భావిస్తున్నాయి.
వాస్తవానికి అమరావతి ప్రాంతంలో రాత్రి 11 తర్వాత, అది కూడా నిర్మాణాలు జరుగుతున్న ప్రదేశాల్లో ఎవరూ ఉండరనే కోణంలో చూస్తే ఇది కుట్రేనని టీడీపీ నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తాజా ఘటనపై సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
ఆదునిక సాంకేతికతను వినియోగించుకునే విషయంలో రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు కీలక అడుగులు వేస్తున్నాయి. అందివచ్చిన సాంకేతికతతో ఆయా పార్టీలు తమ కార్యకలాపాల నిర్వహణ, కార్యకర్తలతో నిత్యం…
విషయం చిన్నదే అయినా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా చేయలేనిది.. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ చేసి చూపించారు. అదే.. దేశంలో…
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లో కీలక నేతగా వ్యవహరించారు. తెలుగు నేల రాజకీయాల్లో మూడు పర్యాయాలు…
బేబీ సినిమాతో పెద్ద సంచలనమే రేపాడు దర్శక నిర్మాత సాయిరాజేష్. కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న వైష్ణవి చైతన్య, ఆనంద్…
హైదరాబాద్ను డ్రగ్స్ మహమ్మారి వెంటాడుతోంది. ఇటు ప్రభుత్వం, అటు పోలీసులు అనుక్షణం డ్రగ్స్ కట్టడికి ఎంతగా ప్రయత్నిస్తున్నా.. ఏదో ఒక…
ఏపీలో కూటమిగా ఏర్పడి.. అధికారాన్ని పంచుకుంటున్న బీజేపీ.. గత రెండేళ్ల కాలంలో ఎప్పుడూ.. పెదవి విప్పి.. కూటమి ప్రభుత్వం సాధించిన…