Political News

అమరావతిపై అగ్ని కుట్ర?

“ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ హయాంలో కుట్రలు చేశారు. దీనిని శ్మశానం అని గేలి చేశారు” అని సీఎం చంద్రబాబు గత ఆదివారం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే ఈ కుట్రలు ఇంకా ఆగలేదన్న అనుమానాలు స్థానికంగా వ్యక్తమవుతున్నాయి. వరుసగా అమరావతిలో భారీ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడం దీనికి ఉదాహరణగా చర్చ జరుగుతోంది. దీనిపై ప్రభుత్వం కూడా సీరియస్‌గా దృష్టి పెడుతోంది.

సోమవారం అర్ధరాత్రి అమరావతి రాజధాని ప్రాంతంలో భారీ నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణ సామగ్రిని నిల్వ చేసిన ప్రదేశంలో మంటలు చెలరేగి భారీ నష్టాన్ని కలిగించాయి. సుమారు రెండున్నర గంటల పాటు మంటలు ఎగిసిపడ్డాయని అధికారులు తెలిపారు. ప్లాస్టిక్ సామగ్రి ఎక్కువగా ఉండటంతో మంటలు మరింతగా వ్యాపించాయని చెప్పారు. దాదాపు 3 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా.

కోర్ క్యాపిటల్ ఏరియా రాయపూడిలో ప్రభుత్వ అధికారుల భవనాల నిర్మాణం జరుగుతోంది. వాటికి సంబంధించిన నిర్మాణ సామగ్రిని అక్కడ నిల్వ చేశారు. సోమవారం రాత్రి 11 గంటలు దాటిన తర్వాత ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగినట్లు సమాచారం అందడంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు.

ఇదిలా ఉండగా, గత వారం ఇదే రాజధాని ప్రాంతంలోని వెలగపూడి సమీపంలో ఒక కంపెనీకి చెందిన నిర్మాణ సామగ్రికి కూడా నిప్పు అంటుకుని భారీ ప్రమాదం జరిగింది. ఆ ఘటనలో దాదాపు 2 కోట్ల రూపాయల సరుకు దగ్ధమైంది.

ఈ అగ్ని ప్రమాదాలపై ప్రభుత్వం సీరియస్ అవుతోంది. గత ఘటనపై ఇప్పటికే విచారణ కమిటీని నియమించింది. విచారణ ప్రారంభమయ్యేలోపే తాజాగా రాయపూడిలో మరో పెద్ద ప్రమాదం చోటు చేసుకోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇదంతా ఉద్దేశపూర్వకంగానే జరిగిందని, అమరావతి బ్రాండ్‌ను దెబ్బతీయడానికి కుట్ర జరుగుతోందని కొన్ని వర్గాలు భావిస్తున్నాయి.

వాస్తవానికి అమరావతి ప్రాంతంలో రాత్రి 11 తర్వాత, అది కూడా నిర్మాణాలు జరుగుతున్న ప్రదేశాల్లో ఎవరూ ఉండరనే కోణంలో చూస్తే ఇది కుట్రేనని టీడీపీ నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తాజా ఘటనపై సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

This post was last modified on March 24, 2026 1:45 pm

Share

Recent Posts

అసెంబ్లీలో మంత్రుల పక్కన సీఎం కూర్చోవడం ఎప్పుడైనా చూసారా?

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఎన్నికలకు ముందు అందరం ఒక్కటేనంటూ నీతులు వల్లించే నాయకులు…

5 minutes ago

ఇంట్రెస్టింగ్… ఫ్లాప్ దర్శకుల కలయికలో సినిమా?

సౌత్ ఇండియన్ ఫిలిం మేకింగ్ ని కొత్త పుంతలు తొక్కించిన దర్శకుల్లో శంకర్, మురుగదాస్ పేర్లు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఎందుకంటే…

2 hours ago

ఇరుముడి కొట్టుడు మళ్లీ మొదలు

‘టాక్సిక్’ వచ్చిన తర్వాత ‘ఇరుముడి’ రన్ మీద ప్రభావం తప్పదేమో అని డౌట్ ఉండేది. పెద్ద పాన్ ఇండియా సినిమా…

2 hours ago

సుబ్బులక్ష్మి బయోపిక్… సాయిపల్లవి స్థానంలో రష్మిక

సుప్రసిద్ధ గాయని ఏంఎస్ సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా బయోపిక్ తీసేందుకు నిర్మాత బన్నీ వాస్, అల్లు అరవింద్, రాక్…

3 hours ago

తెలుగు రామాయణ మీద 100 కోట్లు సేఫేనా

నవంబర్ లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద అంచనాలు ఎలా ఉన్నా బిజినెస్ వ్యవహారాలు మాత్రం జోరుగా…

4 hours ago

ఓజి 2 సౌండ్ చెయ్యడం లేదేంటి

సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టినరోజు రానుంది. అభిమానులు పెద్ద ఎత్తున సెలెబ్రేట్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. అసలు రిలీజ్…

4 hours ago