Movie News

పవన్ కళ్యాణ్‌కు మళ్లీ కోతేనా?

2019 ఎన్నికల కోసం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన తర్వాత, రెండు సంవత్సరాల గ్యాప్ అనంతరం మళ్లీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా అనేక ప్రాజెక్టులకు కమిట్ అయ్యాడు. కానీ ఆ కమిట్మెంట్లను సమయానికి పూర్తి చేయడం మాత్రం కష్టమైంది. ముఖ్యంగా హరిహర వీరమల్లు మరియు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు ఏళ్లకు ఏళ్లు ఆలస్యమవుతూ వచ్చాయి. దీంతో వాటి బడ్జెట్లు కూడా భారీగా పెరిగిపోయాయి.

ఈ ఆలస్యాల కారణంగా నిర్మాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పరిస్థితి ఇలా ఉండటంతో, ఆలస్యానికి తానే కారణమనే భావనతో పవన్ నిర్మాతల పట్ల కొంత సడలింపు చూపాల్సిన పరిస్థితి ఏర్పడింది. హరిహర వీరమల్లు విషయంలో అయితే దాదాపుగా పారితోషకం తీసుకోలేదనే చెప్పాలి. సినిమా విడుదల కూడా అనిశ్చితిలో పడిన సమయంలో, ఇతర నిర్మాతల సహకారంతో విడుదల జరిగింది. విడుదల తర్వాత చూసుకుందామని చెప్పినప్పటికీ, సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో నిర్మాత పరిస్థితి కష్టాల్లో పడింది. అలాంటి పరిస్థితిలో పవన్ తన పారితోషకం గురించి అడగడం అసంభవమే.

ఇక ఉస్తాద్ భగత్ సింగ్ విషయానికి వస్తే, ఈ సినిమాకు కూడా పవన్ కేవలం నామినల్ అడ్వాన్స్ మాత్రమే తీసుకున్నట్లు నిర్మాత స్వయంగా వెల్లడించాడు. మైత్రి సంస్థ నుంచి ముందుగా రూ.5 కోట్ల అడ్వాన్స్ తీసుకున్నాడు. ఇదే సంస్థ హరిహర వీరమల్లు విడుదలకు ముందుకొచ్చి నష్టాలు చవిచూసింది. పవన్ ఆలస్యాల వల్ల ఉస్తాద్ భగత్ సింగ్ పై కూడా అదనపు భారం పడింది.

రిలీజ్ తర్వాత పరిస్థితిని బట్టి చూసుకుందామని పవన్ చెప్పినట్లు సమాచారం. కానీ ఇప్పుడు చూస్తే ఈ సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్‌గా నిలిచింది. దీంతో మైత్రి సంస్థకు గట్టి దెబ్బ తగిలినట్టే.

ఇలాంటి పరిస్థితుల్లో పవన్ మిగతా పారితోషకం అడగడం కష్టమే. నిర్మాతలు ఆఫర్ చేసినా కూడా తిరస్కరించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తానికి చూస్తే, పవన్ కళ్యాణ్‌కు మరోసారి రెమ్యూనరేషన్ కోత పడినట్టే.

This post was last modified on March 24, 2026 11:48 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కరోనా సమయపు తెగువ మళ్ళీ చూపించాలి

పశ్చిమ ఆసియాలో జరుగుతున్న అమెరికా, ఇరాన్ యుద్ధం ప్రభావం భారత్‌పై దీర్ఘకాలం ఉండే అవకాశం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ…

23 minutes ago

“యువత ప్రతిభే దేశ బలం”: ప్రధాని మోదీ సమక్షంలో జూపల్లి రాము

న్యూ ఢిల్లీ వేదికగా మార్చి 23, 24 తేదీల్లో ఘనంగా నిర్వహించిన TV9 నెట్‌వర్క్ ప్రతిష్టాత్మక ‘What India Thinks…

53 minutes ago

ఇబ్బడి ముబ్బడిగా సీట్ల పెంపు మంచిదేనా?

అటు పార్లమెంట్, ఇటు అసెంబ్లీలకు భారీ స్థాయిలో సీట్లు పెంచాలన్న నిర్ణయం సరైందేనా అన్న ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.…

2 hours ago

మతం మారితే ఎస్సీ హోదా రద్దు… సంచలన తీర్పు

భారత దేశంలో కులం, మతం వంటి విషయాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. విద్య, ఉద్యోగం, సామాజిక హోదాలకు కులం, మతం…

3 hours ago

కొత్త ట్రెండ్… కత్తెరకు పని తగ్గిపోతోంది

రెండున్నర గంటలు ఇండియన్ సినిమాకు స్టాండర్డ్ రన్ టైమ్. కొన్ని సినిమాలకు దాని మీద నిడివి పావుగంట పెరగొచ్చు. కొన్ని చిత్రాలకు…

3 hours ago

ఒంటరి పోరాటం చేస్తున్న ఉస్తాద్ దర్శకుడు

ఉగాది, రంజాన్ పండగలు లక్ష్యంగా వారం ప్రీ పోన్ చేసుకుని మరీ వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ ఫలితం కళ్ళముందు…

3 hours ago