Political News

వైసీపీ మ‌ద్యం కుంభ‌కోణం: 441 కోట్ల ఆస్తులు అటాచ్‌!

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన మ‌ద్యం కుంభ‌కోణంలో సుమారు 4 వేల కోట్ల రూపాయ‌ల‌కు పైగా అక్ర‌మాలు జ‌రిగిన‌ట్టు ఈ కేసును విచారిస్తున్న ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం అధికారులు అంచ‌నావేశారు. ఈ క్ర‌మంలో ప‌లువురిని అరెస్టు చేసి విచారించారు. ఇంకా, విచారించాల్సిన వారి జాబితా కూడా పెద్ద‌దిగానే ఉంది. మ‌రోవైపు నాటి అక్ర‌మాల్లో ప్ర‌ముఖ పాత్ర ఉన్న వారి ఆస్తుల‌ను కోర్టు ఆదేశాల మేర‌కు అటాచ్ చేస్తున్నారు. తాజాగా 441 కోట్ల రూపాయ‌ల ఆస్తుల‌ను ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్ట‌రేట్‌(ఈడీ) అధికారులు అటాచ్ చేశారు.

ఎవ‌రివి?

ఈ 441 కోట్ల రూపాయ‌లు.. మొత్తంగా ముగ్గురు ప్ర‌ధాన నిందితుల‌కు చెంద‌న ఆస్తుల‌ని ఈడీ అధికారులు తెలిపారు. ఏ-1గా ఉన్న క‌సిరెడ్డి రాజ‌శేఖ‌రరెడ్డి(గ‌తంలోనే ఈయ‌న ఆస్తుల‌ను కొంత మేర‌కు అటాచ్ చేశారు), బూనేటి చాణ‌క్య‌, ఐఆర్ఎస్ అధికారి దొంతిరెడ్డి వాసుదేవ‌రెడ్డికి చెందిన 441 కోట్ల రూపాయ‌ల ఆస్తుల‌ను తాజాగా అటాచ్ చేసిన‌ట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ ఆస్తులు అక్ర‌మంగా వారికి చేకూరిన‌ట్టు త‌మ‌కు ఆధారాలు ఉన్నాయ‌ని పేర్కొన‌డం గ‌మ‌నార్హం. దీనిపై కోర్టును ఆశ్ర‌యించి.. కోర్టు ఆదేశాల మేర‌కు అటాచ్ చేసిన‌ట్టు వివ‌రించారు.

ఏంటీ అక్ర‌మం?

వైసీపీ హ‌యాంలో అప్ప‌టి వ‌ర‌కు ఉన్న మ‌ద్యం విధానాన్ని స‌మూలంగా మార్చేశారు. ప్రైవేటు వ్యాపారుల లైసెన్సులు ముగియ‌డంతో ప్ర‌భుత్వ‌మే ఈ వ్యాపారంలోకి అడుగు పెట్టింది. ఈ క్ర‌మంలోనే ప్ర‌ముఖ బ్రాండ్ల కంపెనీల‌ను ప‌క్క‌న పెట్టి.. నాసిర‌కం బ్రాండ్ల‌ను ప్రోత్స‌హించారు.

దీనిలో వైసీపీకి చెందిన వారే ఎక్కువ‌గా ఉన్నారు. వీరి నుంచి మ‌ద్యం కొనుగోలు చేసేందుకు క‌మీష‌న్లు ఇవ్వాల‌ని ష‌ర‌తులు విధించారు. దీనిని ప‌క్కాగా అమ‌లు చేశారు. 12 బాటిళ్లు ఉండే కేసుకు 18-20 శాతం మేర‌కు క‌మీష‌న్లు వ‌సూలు చేశారు.

ఈ సొమ్మును 2024 ఎన్నిక‌ల్లో వినియోగించార‌న్న‌ది సిట్ అధికారులు చెబుతున్న మాట‌. అదేస‌మ‌యంలో కొంత సొమ్ము.. కీల‌క నేత‌కు చేరింద‌ని కూడా అంటున్నారు. అయితే.. ఆ కీల‌క నేత ఎవ‌రు? అనేది విచార‌ణ‌కు కీల‌కంగా మారింది.

This post was last modified on March 6, 2026 10:24 pm

Share

Recent Posts

బ్రేకింగ్: అర్ధరాత్రి మోదీ సెల్ఫీ వీడియో

Rare & Unexpected:Probably for the first time, PM #Modi Addresses Nation Through a Selfie Video,…

5 hours ago

మ‌హేష్ అంత డేరింగ్ స్టెప్ వేశాడా?

అగ్ర‌శ్రేణి క‌థానాయ‌కులు.. చిన్న, మిడ్ రేంజ్ సినిమాలు చేసే ద‌ర్శ‌కుల‌తో.. కొత్త‌వాళ్లు, పెద్ద‌గా అనుభ‌వం లేని డైరెక్ట‌ర్ల‌తో ప‌ని చేయ‌డం…

9 hours ago

ఓటు లేక‌పోతే… ప‌థ‌కాలు క‌ట్: రేవంత్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!!

రాష్ట్రంలో ఓటు లేని వారికి ప్ర‌భుత్వం నుంచి సంక్షేమ ప‌థ‌కాల‌ను ఎలా అందిస్తామ‌ని సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌శ్నించారు. ఎవ‌రి…

9 hours ago

చెన్నై లవ్ స్టోరీకి లైన్ క్లియర్

సంక్రాంతి సినిమాల తర్వాత నాలుగైదు నెలల పాటు బాక్సాఫీస్ దగ్గర పెద్ద స్లంప్ చూసింది టాలీవుడ్. కానీ గత నెలలో…

10 hours ago

బాలయ్యని మ్యాచ్ చేయడం ఈజీ కాదు

ఏదైనా రీమేక్ సినిమాకు వచ్చే అతి పెద్ద సమస్య పోలిక. ఒరిజినల్ కంటే మెరుగ్గా తీశారా, నటీనటుల్లో ఎవరు బాగా…

10 hours ago

బండ్ల గణేష్‌కు అక్కడా షాకే

ప్రముఖ తెలుగు నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌‌కు సంబంధించిన ఆస్తి వివాదం ఇటీవల వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. గణేష్‌కు చెందిన…

10 hours ago