Political News

మండలిలో తీవ్ర దుమారం రేపిన అచ్చం వ్యాఖ్యలు

శాసన మండలిలో తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం ప్రకంపనలు రేపుతోంది. మండలిలో లడ్డూ ఇష్యూపై వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆ విషయంపై చర్చిస్తున్న సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు ఆవేశపూరితంగా మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే మండలి ఛైర్మన్ మోషేస్ రాజు, వైసీపీ అధినేత జగన్ క్రిస్టియన్లు అంటూ స్పీకర్ ఛైర్ ను చూపిస్తూ అచ్చెన్న చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

అచ్చెన్న వ్యాఖ్యలను స్పీకర్ మోషేస్ రాజు తీవ్రంగా తప్పుబట్టారు. తన మతం, కులం గురించి సభలో ఎందుకు ప్రస్తావించారని అచ్చెన్నను నిలదీశారు. ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాలని మోషేస్ రాజుతోపాటు వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు.

అయితే, మోషేస్ రాజు క్రిస్టియన్ కాదు అని చెబితే తాను ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటానని అచ్చెన్న అన్నారు. దీంతో, తాను హిందూ అని మోషేస్ రాజు అన్నారు. ఆ తర్వాత అచ్చెన్న తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని ప్రకటించారు. తాను ఎప్పుడూ భేషజాలకు పోనని అన్నారు.

అయితే, వారు క్రిస్టియన్లు అని, తాను తప్పుబట్టడం లేదని, తప్పుపట్టకూడదు కూడా అని అంటూనే అచ్చెన్న చేసిన కామెంట్ల కాంట్రవర్సీకి దారి తీశాయి. వెంకటేశ్వర స్వామి మీద ఇంత కక్ష పెట్టుకుంటారని తాను అనుకోలేదని, తాను ఒక భక్తుడిగా లడ్డూ కల్తీపై ఆవేదన చెంది మాట్లాడుతున్నానని చెప్పారు.

ప్రస్తుతం అచ్చెన్న్ కామెంట్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే, స్పీకర్, వైసీపీ అధ్యక్షుడు జగన్ లు క్రిస్టియన్లు అంటూ మతం గురించి అచ్చెన్న ప్రస్తావించి ఉండకూడదు. సభా గౌరవానికి భంగం కలిగేలా స్పీకర్ చైర్ వైపు చేతులు చూపిస్తూ అచ్చెన్న అలా వ్యాఖ్యానించడం సరికాదు. ఈ తరహా వ్యాఖ్యలతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశముంది. ఇటువంటి కామెంట్ల వల్ల లడ్డూ కల్తీ వ్యవహారం పక్కదోవ పట్టే అవకాశముంది.

Kumar

Recent Posts

చరణ్ పాప్ కార్న్ పాయింట్ – ఒప్పుకోవాల్సిన లాజిక్కేనా

ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…

59 minutes ago

షిరిడీ సాయి ఆలయాలకు ‘శ్రీవాణి’ నగదు అవసరం లేదా?

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…

1 hour ago

మార్కెట్ వెలుగుతోంది చూడు లెనిన్

ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…

3 hours ago

యూకేలో కొత్త ప్రధాని.. భారత విద్యార్థులపై ప్రభావం ఉంటుందా?

అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్‌డమ్ పరిస్థితి మాత్రం…

5 hours ago

భాగ్యశ్రీ మాటతో… మళ్ళీ రామ్ ట్రేండింగ్

టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…

6 hours ago

పవన్ చెప్పిందేమిటి?… వీరు చేస్తున్నదేమిటీ?

రాజకీయాల్లో విమర్శలు… వాటికి ప్రతి విమర్శలు సర్వసాధారణమే. అయితే విమర్శల పేరిట అసభ్య పదజాలం వాడటం సరికాదు.. ప్రతి విమర్శల…

7 hours ago