వైసీపీ పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. అన్నట్టుగా మారుతోందా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. పార్టీలో నాయకులు పుంజుకోవడం ఎలా ఉన్నా.. జంప్ చేస్తున్నవారి సంఖ్య మరింత పెరుగుతోంది. పార్టీ అధినేత కంటికి కనిపించకపోవడం.. కనీసం తమ వాదనను వినిపించుకునే తీరికలోనూ జగన్ లేకపోవడంతో నాయకులు తమ దారులు తాము చూసుకుంటున్నారు. అయితే.. ఇతర జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. సరిదిద్దుకునే ప్రయత్నం చేయొచ్చు.
కానీ, జగన్ సొంత జిల్లా కడపలోనే పరిస్థితి దారుణంగా తయారైంది. ఇక్కడ నాయకులు సమయం చూసుకుని జంప్ చేస్తున్నారు. గత ఏడాది నిర్వహించిన పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లోనే వైసీపీ చావు దెబ్బతగిలింది. చిత్రం ఏంటంటే.. ఆ ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన నాయకులు .. తర్వాత.. టీడీపీ కి సానుకూలంగా మారిపోయారు. నిజానికి వారు తమ ఖర్చులను ఇవ్వాలని పార్టీని అభ్యర్థించారు. ఆ ఎన్నికల్లో తాము పదేసి లక్షల చొప్పున అప్పులు చేసి తెచ్చి ఖర్చు చేశామని చెప్పారు.
కానీ, వైసీపీ ఎక్కడా వారి రోదనను పట్టించుకోలేదు. దీంతో తర్వాత రెండు మాసాలకే సదరు నేతలు.. టీడీపీకి అనుకూలంగా మారిపోయి.. వైసీపీకి దూరమయ్యారు. ఇక, కడప కార్పొరేషన్పై కన్నేసిన స్థానిక ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవీరెడ్డి దూకుడు అంతా ఇంతా కాదన్నట్టుగా ఉంది. కార్పొరేషన్ చైర్మన్ సురేష్బాబును మార్చినా.. కడప గడ్డపై కార్పొరేషన్ను సొంతం చేసుకునేందుకు మాధవీ రెడ్డి శత విధాల ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా వైసీపీ కార్పొరేటర్లను టీడీపీ సైకిల్ ఎక్కించారు.
వైసీపీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లుగా కూడా ఉన్న శివకోటిరెడ్డి, రామ్లక్ష్మణ్రెడ్డిలు .. తాజాగా ఎమ్మెల్యే సమక్షంలో టీడీపీ గూటికి చేరారు. ఇక, ఇప్పటికే 8 మంది కార్పొరేటర్లు సైకిల్ ఎక్కిన నేపథ్యంలో వీరి చేరికతో ఈ సంఖ్య 10కి చేరింది. ఈ ఏడాది చివరి నాటికి కార్పొరేషన్ను దక్కించుకుంటామని ఎమ్మెల్యే వ్యాఖ్యానించడం గమనార్హం. మరి సొంత ఇలాకాలో ఇంత జరుగుతున్నా.. జగన్ మాత్రం మౌనంగా ఉన్నారు. మరోవైపు.. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్టు స్థానికంగా చర్చ జరుగుతుండడం గమనార్హం.
This post was last modified on February 28, 2026 3:54 pm
కొన్ని సినిమాలు థియేటర్లలో ఆశించిన ఫలితాలు అందుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ సంపాదిస్తాయి. టీవీల్లో, ఆన్ లైన్లో గొప్ప ఆదరణ…
దేశవ్యాప్తంగా పార్లమెంటు నియోజకవర్గాలను పునర్విభించి .. మహిళలకు రిజర్వేషన్ కల్పించాలన్న కేంద్ర ప్రభుత్వం ఆశలు ప్రస్తుత సమావేశాల్లో నెరవేరేలా కనిపించడం…
తెలంగాణాలో ఎమ్మెల్యేలు, మంత్రులకు తమ కుమారుల ప్రేమ వ్యవహారాలు తలనొప్పిగా మారుతున్నాయి. నిన్నా మొన్నటి వరకు కేంద్ర మంత్రి బండి…
ఇంకా రాకా షూటింగ్ పూర్తి కాలేదు. మూడు నెలలకు పైనే వర్కింగ్ డేస్ అవసరమవుతాయని అంటున్నారు. అందుకే విడుదల తేదీ…
రాష్ట్రంలో వైద్యం ఖరీదైన వస్తువుగా మారిపోయింది. ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ పరీక్షలు, ఇతరత్రా ఖర్చుల పేరుతో ప్రైవేటు ఆసుపత్రులు రోగుల నుంచి…
కన్నడ సినిమాలో అతి పెద్ద స్టార్లలో ఒకడైన దర్శన్.. ఏ బాధలూ లేని జీవితాన్ని, బంగారం లాంటి జీవితాన్ని ఎలా…