వైసీపీ పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. అన్నట్టుగా మారుతోందా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. పార్టీలో నాయకులు పుంజుకోవడం ఎలా ఉన్నా.. జంప్ చేస్తున్నవారి సంఖ్య మరింత పెరుగుతోంది. పార్టీ అధినేత కంటికి కనిపించకపోవడం.. కనీసం తమ వాదనను వినిపించుకునే తీరికలోనూ జగన్ లేకపోవడంతో నాయకులు తమ దారులు తాము చూసుకుంటున్నారు. అయితే.. ఇతర జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. సరిదిద్దుకునే ప్రయత్నం చేయొచ్చు.
కానీ, జగన్ సొంత జిల్లా కడపలోనే పరిస్థితి దారుణంగా తయారైంది. ఇక్కడ నాయకులు సమయం చూసుకుని జంప్ చేస్తున్నారు. గత ఏడాది నిర్వహించిన పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లోనే వైసీపీ చావు దెబ్బతగిలింది. చిత్రం ఏంటంటే.. ఆ ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన నాయకులు .. తర్వాత.. టీడీపీ కి సానుకూలంగా మారిపోయారు. నిజానికి వారు తమ ఖర్చులను ఇవ్వాలని పార్టీని అభ్యర్థించారు. ఆ ఎన్నికల్లో తాము పదేసి లక్షల చొప్పున అప్పులు చేసి తెచ్చి ఖర్చు చేశామని చెప్పారు.
కానీ, వైసీపీ ఎక్కడా వారి రోదనను పట్టించుకోలేదు. దీంతో తర్వాత రెండు మాసాలకే సదరు నేతలు.. టీడీపీకి అనుకూలంగా మారిపోయి.. వైసీపీకి దూరమయ్యారు. ఇక, కడప కార్పొరేషన్పై కన్నేసిన స్థానిక ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవీరెడ్డి దూకుడు అంతా ఇంతా కాదన్నట్టుగా ఉంది. కార్పొరేషన్ చైర్మన్ సురేష్బాబును మార్చినా.. కడప గడ్డపై కార్పొరేషన్ను సొంతం చేసుకునేందుకు మాధవీ రెడ్డి శత విధాల ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా వైసీపీ కార్పొరేటర్లను టీడీపీ సైకిల్ ఎక్కించారు.
వైసీపీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లుగా కూడా ఉన్న శివకోటిరెడ్డి, రామ్లక్ష్మణ్రెడ్డిలు .. తాజాగా ఎమ్మెల్యే సమక్షంలో టీడీపీ గూటికి చేరారు. ఇక, ఇప్పటికే 8 మంది కార్పొరేటర్లు సైకిల్ ఎక్కిన నేపథ్యంలో వీరి చేరికతో ఈ సంఖ్య 10కి చేరింది. ఈ ఏడాది చివరి నాటికి కార్పొరేషన్ను దక్కించుకుంటామని ఎమ్మెల్యే వ్యాఖ్యానించడం గమనార్హం. మరి సొంత ఇలాకాలో ఇంత జరుగుతున్నా.. జగన్ మాత్రం మౌనంగా ఉన్నారు. మరోవైపు.. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్టు స్థానికంగా చర్చ జరుగుతుండడం గమనార్హం.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…