Political News

`క‌డ‌ప` క‌దులుతోంది.. జ‌గ‌న్ స‌ర్‌!

వైసీపీ ప‌రిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. అన్నట్టుగా మారుతోందా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. పార్టీలో నాయ‌కులు పుంజుకోవ‌డం ఎలా ఉన్నా.. జంప్ చేస్తున్న‌వారి సంఖ్య మ‌రింత పెరుగుతోంది. పార్టీ అధినేత కంటికి క‌నిపించ‌క‌పోవ‌డం.. క‌నీసం త‌మ వాద‌న‌ను వినిపించుకునే తీరిక‌లోనూ జ‌గ‌న్ లేక‌పోవ‌డంతో నాయ‌కులు త‌మ దారులు తాము చూసుకుంటున్నారు. అయితే.. ఇత‌ర జిల్లాల్లో ప‌రిస్థితి ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. స‌రిదిద్దుకునే ప్ర‌య‌త్నం చేయొచ్చు.

కానీ, జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లోనే ప‌రిస్థితి దారుణంగా త‌యారైంది. ఇక్క‌డ నాయ‌కులు స‌మ‌యం చూసుకుని జంప్ చేస్తున్నారు. గ‌త ఏడాది నిర్వ‌హించిన పులివెందుల జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల్లోనే వైసీపీ చావు దెబ్బ‌తగిలింది. చిత్రం ఏంటంటే.. ఆ ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున పోటీ చేసి ఓడిపోయిన నాయ‌కులు .. త‌ర్వాత‌.. టీడీపీ కి సానుకూలంగా మారిపోయారు. నిజానికి వారు త‌మ ఖ‌ర్చుల‌ను ఇవ్వాల‌ని పార్టీని అభ్య‌ర్థించారు. ఆ ఎన్నిక‌ల్లో తాము ప‌దేసి ల‌క్ష‌ల చొప్పున అప్పులు చేసి తెచ్చి ఖ‌ర్చు చేశామ‌ని చెప్పారు.

కానీ, వైసీపీ ఎక్క‌డా వారి రోద‌న‌ను ప‌ట్టించుకోలేదు. దీంతో త‌ర్వాత రెండు మాసాలకే స‌ద‌రు నేత‌లు.. టీడీపీకి అనుకూలంగా మారిపోయి.. వైసీపీకి దూర‌మ‌య్యారు. ఇక‌, క‌డ‌ప కార్పొరేష‌న్‌పై క‌న్నేసిన స్థానిక ఎమ్మెల్యే రెడ్డ‌ప్ప‌గారి మాధ‌వీరెడ్డి దూకుడు అంతా ఇంతా కాద‌న్న‌ట్టుగా ఉంది. కార్పొరేష‌న్ చైర్మ‌న్ సురేష్‌బాబును మార్చినా.. క‌డ‌ప గ‌డ్డ‌పై కార్పొరేష‌న్‌ను సొంతం చేసుకునేందుకు మాధ‌వీ రెడ్డి శ‌త విధాల ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా వైసీపీ కార్పొరేట‌ర్ల‌ను టీడీపీ సైకిల్ ఎక్కించారు.

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కులు, కార్పొరేట‌ర్లుగా కూడా ఉన్న శివ‌కోటిరెడ్డి, రామ్‌ల‌క్ష్మ‌ణ్‌రెడ్డిలు .. తాజాగా ఎమ్మెల్యే స‌మ‌క్షంలో టీడీపీ గూటికి చేరారు. ఇక‌, ఇప్ప‌టికే 8 మంది కార్పొరేట‌ర్లు సైకిల్ ఎక్కిన నేప‌థ్యంలో వీరి చేరిక‌తో ఈ సంఖ్య 10కి చేరింది. ఈ ఏడాది చివ‌రి నాటికి కార్పొరేష‌న్‌ను దక్కించుకుంటామ‌ని ఎమ్మెల్యే వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. మ‌రి సొంత ఇలాకాలో ఇంత జ‌రుగుతున్నా.. జ‌గ‌న్ మాత్రం మౌనంగా ఉన్నారు. మ‌రోవైపు.. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అవ‌కాశం కోసం ఎదురు చూస్తున్న‌ట్టు స్థానికంగా చ‌ర్చ జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం.

Kumar

Recent Posts

ఇదేం లాజిక్ ఎంపీ గారూ?

విజయవాడలో సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాలలో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. సాయికృష్ణది లాకప్…

8 minutes ago

ఒకే వేదికపై ముగ్గురు సీఎంలు!… కొత్త చరిత్రే!

దక్షిణ భారత దేశంలో గురువారం ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఒకే వేదికపై ముగ్గురు ముఖ్యమంత్రులు కలిసి కనిపించారు. అంతేకాదండోయ్…తాము…

17 minutes ago

OG యూనివర్స్ ఏం చూపించబోతోంది

ఎన్నడూ లేనిది పవన్ కళ్యాణ్ ఓజి 2 విషయంలో దూకుడు చూపిస్తున్నారు. సురేందర్ రెడ్డికి కమిటైన ప్రాజెక్టు పక్కనపెట్టి మరీ…

34 minutes ago

గ్రేట్ డైరెక్టర్… సిల్లీ లాజిక్

గొప్ప గొప్ప దర్శకులు కూడా తమ సినిమాలు ఆశించినంత ఆడకపోతే.. వాటి ఫలితాల విషయంలో చిత్రమైన కారణాలు చెబుతుంటారు. స్క్రిప్టు…

2 hours ago

సుప్రీం చెప్పింది… మోడీ క‌దిలారు: దేశ‌వ్యాప్తంగా దాడులు!

సుప్రీంకోర్టు హెచ్చ‌రిక‌లు, దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌ల నుంచి అందుతున్న వేలాది ఫిర్యాదుల‌తో కేంద్ర ప్ర‌భుత్వం క‌దిలింది. దేశంలో ఏదో ఒక రూపంలో…

2 hours ago

భూకంపంతో వణికిన వెనిజులా… మృతులు లక్షమంది!

వెనిజులాను వరుస భూకంపాలు వణికించాయి. దేశ రాజధాని కరాకస్‌తో పాటు ఉత్తర-మధ్య ప్రాంతాల్లో బుధవారం శక్తివంతమైన భూకంపాలు సంభవించాయి. తొలుత…

3 hours ago