మెగా కుర్రాడు సాయి ధరమ్ తేజ్.. రోడ్డు ప్రమాదానికి గురయ్యాక తన సినీ ప్రయాణం కొంచెం నెమ్మదించింది. ప్రమాదం జరిగింది 2021లో కాగా.. అతను ఆ తర్వాత చేసింది రెండే సినిమాలు. అందులో ఒకటి ‘విరూపాక్ష’ బ్లాక్ బస్టర్ అయింది. మరొకటి ‘బ్రో’ సరిగా ఆడలేదు. ఈ రెండు చిత్రాల తర్వాత అతను కొంచెం గ్యాప్ తీసుకుని ‘సంబరాల యేటిగట్టు’ అనే భారీ చిత్రాన్ని లైన్లో పెట్టాడు.
కేపీ రోహిత్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ‘హనుమాన్’ నిర్మాత నిరంజన్ రెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్నాడు. తేజు కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన ‘విరూపాక్ష’ వంద కోట్ల క్లబ్బులోకి వెళ్లినప్పటికీ.. ఆ సినిమా ఆధారంగా తేజు మార్కెట్ మీద ఒక అంచనాకు రావడం కష్టమే. కానీ నిరంజన్ రెడ్డి మాత్రం తేజు కొత్త సినిమా మీద రూ.120 కోట్ల బడ్జెట్ పెట్టే అంచనాతో రంగంలోకి దిగాడు. కానీ ఈ సినిమా ఆ బడ్జెట్ మార్కును దాటేసినట్లుగా ఇటీవల వార్తలు వచ్చాయి.
గత ఏడాది దసరాకే రావాల్సిన ‘సంబరాల యేటి గట్టు’ ఈ వేసవికి అయినా వస్తుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. వర్కింగ్ డేస్ పెరిగిపోయాయి. బడ్జెట్ హద్దులు దాటేసింది. ఇప్పుడేమో క్లైమాక్స్ను అత్యంత భారీగా తీర్చిదిద్దుతున్నారని.. అందుకోసమే ఏకంగా రూ.20 కోట్లు ఖర్చు పెడుతున్నారని వార్తలు వస్తున్నాయి.
ఐతే సినిమాకు హైప్ తేవడం కోసం చిత్ర బృందం ఇలా లీక్స్ ఇస్తోందా.. లేక నిజంగానే రూ.20 కోట్లు పెడుతున్నారా అన్నది తెలియదు కానీ.. ఆల్రెడీ బడ్జెట్ హద్దులు దాటేసినట్లు వార్తలు వస్తుండగా.. ఇప్పుడు కొత్తగా ఇంకో 20 కోట్లు పెట్టి క్లైమాక్స్ తీయడం మీద ఇండస్ట్రీ జనాల్లో.. సోషల్ మీడియాలో రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. తేజు మీద, కొత్త దర్శకుడి మీద నిర్మాతకు మరీ ఇంత నమ్మకమేంటి.. ఇంతింత ఖర్చు పెట్టేసి సినిమాను బిజినెస్ పరంగా వర్కవుట్ చేయడం సాధ్యమేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
This post was last modified on February 28, 2026 5:06 pm
Rare & Unexpected:Probably for the first time, PM #Modi Addresses Nation Through a Selfie Video,…
అగ్రశ్రేణి కథానాయకులు.. చిన్న, మిడ్ రేంజ్ సినిమాలు చేసే దర్శకులతో.. కొత్తవాళ్లు, పెద్దగా అనుభవం లేని డైరెక్టర్లతో పని చేయడం…
రాష్ట్రంలో ఓటు లేని వారికి ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలను ఎలా అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఎవరి…
సంక్రాంతి సినిమాల తర్వాత నాలుగైదు నెలల పాటు బాక్సాఫీస్ దగ్గర పెద్ద స్లంప్ చూసింది టాలీవుడ్. కానీ గత నెలలో…
ఏదైనా రీమేక్ సినిమాకు వచ్చే అతి పెద్ద సమస్య పోలిక. ఒరిజినల్ కంటే మెరుగ్గా తీశారా, నటీనటుల్లో ఎవరు బాగా…
ప్రముఖ తెలుగు నిర్మాత, నటుడు బండ్ల గణేష్కు సంబంధించిన ఆస్తి వివాదం ఇటీవల వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. గణేష్కు చెందిన…