Movie News

మెగా హీరో మీద ఎంత నమ్మకమో…

మెగా కుర్రాడు సాయి ధరమ్ తేజ్.. రోడ్డు ప్రమాదానికి గురయ్యాక తన సినీ ప్రయాణం కొంచెం నెమ్మదించింది. ప్రమాదం జరిగింది 2021లో కాగా.. అతను ఆ తర్వాత చేసింది రెండే సినిమాలు. అందులో ఒకటి ‘విరూపాక్ష’ బ్లాక్ బస్టర్ అయింది. మరొకటి ‘బ్రో’ సరిగా ఆడలేదు. ఈ రెండు చిత్రాల తర్వాత అతను కొంచెం గ్యాప్ తీసుకుని ‘సంబరాల యేటిగట్టు’ అనే భారీ చిత్రాన్ని లైన్లో పెట్టాడు.

కేపీ రోహిత్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ‘హనుమాన్’ నిర్మాత నిరంజన్ రెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్నాడు. తేజు కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ‘విరూపాక్ష’ వంద కోట్ల క్లబ్బులోకి వెళ్లినప్పటికీ.. ఆ సినిమా ఆధారంగా తేజు మార్కెట్‌ మీద ఒక అంచనాకు రావడం కష్టమే. కానీ నిరంజన్ రెడ్డి మాత్రం తేజు కొత్త సినిమా మీద రూ.120 కోట్ల బడ్జెట్ పెట్టే అంచనాతో రంగంలోకి దిగాడు. కానీ ఈ సినిమా ఆ బడ్జెట్ మార్కును దాటేసినట్లుగా ఇటీవల వార్తలు వచ్చాయి.

గత ఏడాది దసరాకే రావాల్సిన ‘సంబరాల యేటి గట్టు’ ఈ వేసవికి అయినా వస్తుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. వర్కింగ్ డేస్ పెరిగిపోయాయి. బడ్జెట్ హద్దులు దాటేసింది. ఇప్పుడేమో క్లైమాక్స్‌ను అత్యంత భారీగా తీర్చిదిద్దుతున్నారని.. అందుకోసమే ఏకంగా రూ.20 కోట్లు ఖర్చు పెడుతున్నారని వార్తలు వస్తున్నాయి.

ఐతే సినిమాకు హైప్ తేవడం కోసం చిత్ర బృందం ఇలా లీక్స్ ఇస్తోందా.. లేక నిజంగానే రూ.20 కోట్లు పెడుతున్నారా అన్నది తెలియదు కానీ.. ఆల్రెడీ బడ్జెట్ హద్దులు దాటేసినట్లు వార్తలు వస్తుండగా.. ఇప్పుడు కొత్తగా ఇంకో 20 కోట్లు పెట్టి క్లైమాక్స్ తీయడం మీద ఇండస్ట్రీ జనాల్లో.. సోషల్ మీడియాలో రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. తేజు మీద, కొత్త దర్శకుడి మీద నిర్మాతకు మరీ ఇంత నమ్మకమేంటి.. ఇంతింత ఖర్చు పెట్టేసి సినిమాను బిజినెస్ పరంగా వర్కవుట్ చేయడం సాధ్యమేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

This post was last modified on February 28, 2026 5:06 pm

Share

Recent Posts

పవన్ కళ్యాణ్ – ఒక జన సేవకుడి ప్రస్థానం

సినిమా నటులు ఎందరో రాజకీయ నాయకులయ్యారు. అయితే ప్రజల మనసులో బలమైన ముద్ర వేసిన వాళ్ళు మాత్రం కొందరే ఉంటారు.…

12 minutes ago

తమిళనాడులో అప్పుడే పెడాకులా…

మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టుడే సీ ఓటర్ చేసిన సర్వే తమిళనాడు టీవీకే, కాంగ్రెస్ కాపురం…

17 minutes ago

స్థానిక ఎన్నికలకు SIR చిక్కుముడి?

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ( SIR ) చిక్కుముడిగా మారింది.…

37 minutes ago

జనసేన ఎమ్మెల్యేపై చంద్రబాబు అసంతృప్తి

కూటమిలో భాగస్వామి అయిన జనసేన పార్టీ ఎమ్మెల్యే పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు బాగోలేని…

2 hours ago

ఏపీలో పెరిగిపోతున్న బీపీ… ఆ జిల్లాలో మరీ ఎక్కువ!

ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…

4 hours ago

సినిమా షూటింగ్… ఐదుసార్లు చావుకు దగ్గరగా

సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…

9 hours ago