Political News

బీజేపీ ఎమ్మెల్సీపై దాడికి యత్నించిన వైసీపీ?

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో గురువారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంశంపై చర్చ సందర్భంగా వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగడంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానం ఇచ్చిన అనంతరం కూడా అదే అంశంపై మరింత చర్చకు అవకాశం ఇవ్వాలని వైసీపీ ఎమ్మెల్సీలు పట్టుబట్టారు.

అయితే ప్రశ్నోత్తరాల ప్రక్రియ పూర్తయ్యిందని స్పష్టం చేసిన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు తదుపరి ప్రశ్నకు అవకాశం కల్పించారు. ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు లేచి తన ప్రశ్న అడగడానికి ప్రయత్నించగా, వైసీపీ సభ్యులు ఆయన వైపు దూసుకెళ్లారు.

ఎమ్మెల్సీలు ఇజ్రాయెల్, విక్రాంత్, రమేశ్ యాదవ్ తదితరులు ఆయనను అడ్డుకునేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. తాము నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో మైక్ ఎందుకు ఇచ్చారని ప్రశ్నిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సోము వీర్రాజుపై దాడికి యత్నించారు.

సోము వీర్రాజుకు మద్దతుగా హోంమంత్రి అనితతో పాటు మంత్రి గొట్టిపాటి రవికుమార్ మరియు ఇతర టీడీపీ సభ్యులు ముందుకు వచ్చి ఆయనను అడ్డుగా నిలిచారు. రెండు వర్గాల సభ్యులు ఎదురెదురుగా నిలవడంతో సభలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితి అదుపు తప్పేలా మారడంతో చైర్మన్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు.

సభలో జరిగిన ఈ ఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వైసీపీ సభ్యుల ప్రవర్తనపై బీజేపీ, టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయగా, సభలో క్రమశిక్షణ పాటించాలని పలువురు కోరారు. మరోవైపు, తమకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదనే కారణంతోవైసీపీ సభ్యులు ఆందోళన కొనసాగించారు.

This post was last modified on February 26, 2026 1:45 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

సంక్షోభాన్ని అడ్డుకునేందుకు భారత్ ప్లాన్ బీ

పశ్చిమ ఆసియాలో యుద్ధం ముదురుతున్న కొద్దీ భారత్ తన ఇంధన అవసరాల కోసం వ్యూహాలను వేగవంతం చేస్తోంది. చమురు, గ్యాస్…

20 minutes ago

భోజనంలో పురుగులు… వందేభారత్ రామానుజం ఏం చేశాడు?

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులకు అందించే భోజనం నాణ్యతపై మరోసారి పెద్ద వివాదం రాజుకుంది. పాట్నా నుంచి టాటానగర్ వెళ్లే…

1 hour ago

చిరు బాబీ మిస్… వెంకీ అనిల్ ఫిక్స్

వరసగా సినిమాలు చేస్తున్నా సక్సెస్ మాత్రం అందని ద్రాక్ష పండులా మారిపోయిన ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి సరైన బ్రేక్…

2 hours ago

ధైర్యం అనుమానం మధ్య ‘పెద్ది’ సందిగ్ధం

రేపు ప్రారంభం కావాల్సిన పెద్ది ఓవర్ సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ఏప్రిల్ 8కి వాయిదా వేయడం అభిమానుల్లో ఖంగారు పుట్టిస్తోంది.…

2 hours ago

వెయ్యి కోట్ల విధ్వంసం వారం రోజుల్లోనే

అంచనాలకు మించి దురంధర్ ది రివెంజ్ అరాచకం చేస్తోంది. సరిగ్గా వారం రోజులు కావడం ఆలస్యం వెయ్యి కోట్ల క్లబ్బులోకి…

4 hours ago

మంగళగిరిని లోకేశ్ వీడాల్సిందేనా…?

లోక్ సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఖరారైన నేపథ్యంలో దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఆయా పరిణామాలపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఈ…

5 hours ago