ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో గురువారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంశంపై చర్చ సందర్భంగా వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగడంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానం ఇచ్చిన అనంతరం కూడా అదే అంశంపై మరింత చర్చకు అవకాశం ఇవ్వాలని వైసీపీ ఎమ్మెల్సీలు పట్టుబట్టారు.
అయితే ప్రశ్నోత్తరాల ప్రక్రియ పూర్తయ్యిందని స్పష్టం చేసిన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు తదుపరి ప్రశ్నకు అవకాశం కల్పించారు. ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు లేచి తన ప్రశ్న అడగడానికి ప్రయత్నించగా, వైసీపీ సభ్యులు ఆయన వైపు దూసుకెళ్లారు.
ఎమ్మెల్సీలు ఇజ్రాయెల్, విక్రాంత్, రమేశ్ యాదవ్ తదితరులు ఆయనను అడ్డుకునేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. తాము నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో మైక్ ఎందుకు ఇచ్చారని ప్రశ్నిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సోము వీర్రాజుపై దాడికి యత్నించారు.
సోము వీర్రాజుకు మద్దతుగా హోంమంత్రి అనితతో పాటు మంత్రి గొట్టిపాటి రవికుమార్ మరియు ఇతర టీడీపీ సభ్యులు ముందుకు వచ్చి ఆయనను అడ్డుగా నిలిచారు. రెండు వర్గాల సభ్యులు ఎదురెదురుగా నిలవడంతో సభలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితి అదుపు తప్పేలా మారడంతో చైర్మన్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు.
సభలో జరిగిన ఈ ఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వైసీపీ సభ్యుల ప్రవర్తనపై బీజేపీ, టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయగా, సభలో క్రమశిక్షణ పాటించాలని పలువురు కోరారు. మరోవైపు, తమకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదనే కారణంతోవైసీపీ సభ్యులు ఆందోళన కొనసాగించారు.
రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…
అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…
జూనియర్ ఎన్టీఆర్.. రాజకీయ రంగ ప్రవేశంపై తరచుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఆయనకు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…