ఏపీ సీఎం చంద్రబాబు… `బీసీ బాబు`గా మారనున్నారా? సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న సమస్యను పరిష్కరించేందుకు నడుంబిగించారా? అంటే.. ఔననే చెప్పాలి. బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ అంశం.. కొన్నాళ్లుగా రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన.. బీసీల జనాభానే ఎక్కువగా ఉంది. దీంతో వారికి ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాల్లో మేలు చేసేలా.. గత 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం 34 శాతం రిజర్వేషన్ను అమలు చేసింది.
అయితే.. తమకు ఇది చాలదని.. 50 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని బీసీలు పట్టుబట్టారు. ఈ క్రమంలోనే వారికి 43 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నట్టు అప్పట్లో ప్రకటించారు. అయితే.. దీనిని వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. తిరిగి 33 శాతానికి పరిమితం చేసింది. రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా.. అదేవిధంగా సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ఏ రిజర్వేషన్ అయినా.. ఎవరికి రిజర్వేషన్ కల్పించినా.. మొత్తం 50 శాతానికి మించరాదని పేర్కొంది.
ఈ క్రమంలోనే వైసీపీ సుప్రీంకోర్టు తీర్పును అడ్డుపెట్టుకుని.. ఎస్సీ, ఎస్టీలను తనవైపు తిప్పుకొనే ప్రయత్నంలో బీసీలకు అదనంగా కల్పించిన రిజర్వేషన్ను ఎత్తేసింది. అప్పటి నుంచి బీసీలు ఆగ్రహంతోనే ఉన్నారు. గత ఎన్నికల సమయంలో వైసీపీ ఓటమికి బీసీలు కూడా కారణం కావడానికి ఇదొక అవకాశం ఇచ్చినట్టు అయింది. అయితే.. వచ్చే ఎన్నికల నాటికి తిరిగి బీసీలకు మేలు చేయాలని సంకల్పంగా చెప్పుకొన్న చంద్రబాబు.. మరోసారి వారికి అదనంగా రిజర్వేషన్ కల్పించేందుకు రెడీ అయ్యారు.
ఈ క్రమంలోనే సింగిల్ మ్యాన్(ఏక సభ్య)కమిటీని కూడా నియమించారు. ఈ కమిటీ ప్రస్తుతం జిల్లాల్లో పర్యటిస్తోంది. ఉగాది(మార్చి 19) నాటికి ఈ కమిటీ రిపోర్టును ప్రభుత్వానికి అందించనుంది. అనంతరం.. ఈ కమిటీ సిఫారసుల మేరకు ప్రభుత్వం బీసీలకు 35-40 శాతం మధ్య(కమిటీ సిఫారసుల మేరకు) అమలు చేయాలని నిర్ణయించింది.
బీసీలకు న్యాయం చేయాలన్న లక్ష్యంతోనే కూటమి సర్కారు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం గమనార్హం. రాజకీయంగా ఎలా ఉన్నప్పటికీ.. న్యాయపరమైన చిక్కులు లేకుండా కూడా.. దీనిని సిద్ధం చేస్తున్నారు. తద్వారా.. బీసీలకు మేలు చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు.
This post was last modified on February 25, 2026 7:24 am
తెలుగులో ఒకప్పట్లా ఇబ్బడిముబ్బడిగా కమెడియన్లు లేరిప్పుడు. ఉన్న వాళ్లలో కూడా నిలకడగా నవ్వించేవాళ్లు తక్కువ. కొంచెం లేటుగా ఊపందుకుని.. వెన్నెల…
కేంద్ర మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే, కేసు…
మొత్తం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో 40 ప్లస్ వయసులోనూ ఏమాత్రం క్రేజ్ తగ్గకుండా, పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్న…
తమిళనాట కొత్త రాజకీయానికి తెర తీసిన స్టార్ హీరో దళపతి విజయ్… ప్రతి అడుగులోనూ తనదైన శైలి ప్రత్యేకతను చాటుతున్నారు.…
కేంద్ర మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.…
పవన్ కళ్యాణ్ కెరీర్లో ఎన్నడూ లేని విధంగా ఎనిమిది నెలల వ్యవధిలో మూడు సినిమాలు రిలీజవడం ఆయన అభిమానులకు అరుదైన…