Political News

ఏబీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

సస్పెన్షన్ లో ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఇంటెలిజెన్స్ చీఫ్ గా తనకున్న అధికారాలను అప్పటి ప్రతిపక్షం వైసీపీ ప్రజాప్రతినిధులను, నేతలను ఇబ్బందులు పెట్టడానికే ఉపయోగించారనే ఆరోపణలు వినబడ్డాయి. అంతటి అదికారాలతో చెలరేగిపోయిన ఏబీ ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో అప్పటి నుండి కష్టాల్లో పడిపోయారు.

టీడీపీ హయాంలో ప్రభుత్వం కొనుగోలు చేసిన అత్యంతాధునిక కమ్యూనికేషన్ సాంకేతిక పరికరాలను, టెలిఫోన్ భద్రతా పరకరాల కొనుగోలు కుంభకోణంలో ఇరుక్కున్నారు. ఇజ్రాయెల్ కంపెనీ నుండి రూ. 25 కోట్లకు అవసరమైన పరికరాలను కొనుగోలో చేసింది ప్రభుత్వం. అయితే కొనుగోలు మొత్తం తన కొడుకు కంపెనీ నుండే కొనుగోలు చేశారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ప్రాధామిక దర్యాప్తులో ఆ విషయాలన్నీ నిజాలే అని నిర్ధారణయ్యాయి. దాంతో ప్రభుత్వం ఏబీని సస్పెండ్ చేసింది.

తన సస్పెన్షకు వ్యతిరేకంగా క్యాట్ ను ఆశ్రయించిన ఏబీకి చుక్కెదురైంది. తర్వాత హైకోర్టుకెళ్ళి సస్పెన్షన్ ను ఎత్తేయించుకున్నారు. తర్వాత ప్రభుత్వం సుప్రింకోర్టుకెళితే సస్పెన్షన్ కరెక్టే అని ధృవీకరించింది. దాంతో అప్పటి నుండి ఏబీ సస్పెన్షన్లోనే ఉన్నారు. తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుండి ఏబీకి నోటీసు అందింది. ఆయనపై ప్రభుత్వ పరంగా క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలంటే సమాధానం చెప్పటానికి 15 రోజుల గడువిచ్చింది. 15 రోజుల్లోగా సమాధానం రాకపోతే చర్యలు తప్పవని కూడా హెచ్చరించింది.

ప్రభుత్వ నోటీసు ద్వారా ఏబీపై చర్యలు తప్పవని అర్ధమైపోయింది. ఐపీఎస్ అధికారి హోదాలో తన పరిధిదాటి వ్యవహరించినందుకే ప్రస్తుతం ఏబీ సమస్యలను ఎదుర్కొంటున్నారు. అధికారంలో ఉన్న వాళ్ళు తమ ప్రత్యర్ధులను ఇబ్బందులు పెట్టేందుకు అధికారయంత్రాంగాన్ని ఉపయోగించుకోవటం మామూలే. కానీ అధికారపార్టీ చెప్పినట్టల్లా వినాలా వద్దా అన్నది నిర్ణయించుకోవాల్సింది ఉన్నతాధికారులే. అధికారపార్టీతో కలిసిపోయి ప్రత్యర్ధి పార్టీలను ఇబ్బందులు పెట్టాలని అనుకుంటే ఇపుడు ఏబీ పడుతున్న అవస్తలు తప్పవని మరోసారి నిరూపణైంది.

This post was last modified on December 19, 2020 11:36 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కియారా… బేబీ బంప్‌తో మెగా గ్లామర్

కియారా అద్వానీ.. బాలీవుడ్, తెలుగు సినిమాల్లో ప్రముఖ నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని అందుకున్న విషయం తెలిసిందే. ఫగ్లీ…

15 minutes ago

ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్: టాప్-4లోకి వచ్చేదెవరు?

ఐపీఎల్ 2025 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ప్లేఆఫ్స్ రేసు రోజురోజుకూ ఉత్కంఠగా మారుతోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై…

2 hours ago

స్వచ్ఛందంగా వెళ్లిపోతే 1000 డాలర్లు బహుమతి!

డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం అక్రమ వలసదారులను స్వదేశాలకు తిరిగి పంపే ప్రక్రియను వేగవంతం చేయడానికి కొత్త విధానాన్ని…

4 hours ago

తారక్ పుట్టిన రోజు.. డబుల్ ధమాకా?

మే నెల వచ్చిందంటే నందమూరి అభిమానుల ఉత్సాహం మామూలుగా ఉండదు. లెజెండరీ నటుడు సీనియర్ ఎన్టీఆరే కాక ఆయన మనవడు జూనియర్…

11 hours ago

2027లో జగన్ 2.0 పాదయాత్ర అంట!

2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ ఇప్పుడప్పుడే కోలుకునేలా కనిపించడం లేదనే చెప్పాలి. అప్పటిదాకా 151 సీట్లతో…

11 hours ago

యుద్ధ స‌న్న‌ద్ధం:  రాష్ట్రాల‌కు కేంద్రం సంచ‌ల‌న ఆదేశాలు

భార‌త్‌-పాకిస్థాన్ ల మ‌ధ్య పెరుగుతున్న ఉద్రిక్త‌త‌లు ఏ క్ష‌ణ‌మైనా యుద్ధానికి దారితీయొచ్చ‌ని ర‌క్ష‌ణ రంగ నిపుణులు చెబుతు న్న స‌మ‌యంలో…

11 hours ago