రాష్ట్ర ప్రభుత్వం వద్ద భూములు లేవని.. ఎవరికీ ఇచ్చే పరిస్థితి కూడా లేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పేదలకు ఉచితంగా భూములు ఇచ్చే ఆలోచన ఉన్నప్పటికీ.. ఇచ్చే పరిస్థితి లేదని.. ప్రభుత్వం దగ్గర భారీ భూ బ్యాంక్ ఉన్నట్టుగా జరుగుతున్న ప్రచారంలోనూ నిజం లేదని అన్నారు. ఏ సామాజికవర్గం కూడా.. ప్రభుత్వం నుంచి భూములు వస్తాయేమోననే ఆశలను విడనాడాలని ఆయన సూచించారు. అయితే.. అన్ని సామాజికవర్గాల చిన్నారులకు.. చదువుకునేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు.
ఆదివారం బంజారాల దేవుడు.. సంత్ శ్రీసేవాలాల్ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన గత బీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనులను.. ముఖ్యంగా లంబాడాలను మోసం చేసిందన్నారు. అధికారంలోకి రాగానే బంజారాలకు.. భూములు ఇస్తామని హామీ ఇచ్చి.. ఎగ్గొట్టారని, వారికి మాత్రం ఎక్కడికక్కడ ఎకరాలకు ఎకరాల భూములు సంపాయించుకుని విల్లాలు, ఫామ్ హౌస్లు కట్టుకు న్నారని దుయ్యబట్టారు.
చదువును మించిన ఆస్తి లేదన్న సీఎం రేవంత్.. బంజారాల పిల్లలు చదువుకుంటామంటే.. ఎంత వరకైనా చదివించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. వాస్తవానికి పేదరికం అంటే.. ఆస్తులు లేకపోవడం కాదని.. చదువు లేకపోవడమే కారణమని చెప్పారు. “ఒకాయనకి.. 20 ఎకరాల భూమి ఉంది. కానీ, తెల్లారిలే స్తే.. గొర్రెలు, మేకలు తోలుకుపోతాడు. ఆయనకు ఆస్తి లేదా? అంటే.. ఉంది. కానీ, పేదరికంలోనే ఉన్నాడు. దీనికి కారణం చదువు లేకపోవడమే” అని రేవంత్ వ్యాఖ్యానించారు.
ఎస్సీ వర్గీకరణ..
ఎస్సీ వర్గీకరణ చేయడం ద్వారా ఆయా సామాజిక వర్గాలకు మేలు చేశామని రేవంత్ రెడ్డి చెప్పారు. తండాల్లో పాఠశాలల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలోని అన్ని తండాలకు బీటీ రోడ్లు వేయాలని నిర్ణయించామన్నారు. అదేవిధంగా విద్యుత్ సౌకర్యం, విద్య వంటివాటిని చేరువ చేస్తామన్నా రు. ఇక, తాము పాలకులం కాదని.. సేవకులం కాదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం గమనార్హం.
This post was last modified on February 15, 2026 5:12 pm
తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి మూణ్నాలుగు రోజులుగా నడుస్తున్న సస్పెన్సుకు తెరపడింది. ఎట్టకేలకు గవర్నర్ విజయ్కి అవకాశమిచ్చాడు. సొంతంగా…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న తీరు.. గత ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరించిన…
తెలంగాణపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయన్న వాదన వినిపిస్తోంది. గతంలో ఆయన పార్లమెంటులో…
తమిళనాడు రాజకీయాల్లో యువ నాయకత్వానికి కొత్త గుర్తింపుగా నిలిచిన టీవీకే నేత ఎస్. కీర్తన సంపత్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో…
సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన విశ్వనాథ్ అండ్ సన్స్ కు ముందు…
హీరోగా అవకాశాలు ఆగిపోయిన టైంలో ‘లెజెండ్’ సినిమాతో విలన్ అవతారం ఎత్తారు సీనియర్ నటుడు జగపతిబాబు. దీంతో ఓవర్ నైట్…