రాష్ట్ర ప్రభుత్వం వద్ద భూములు లేవని.. ఎవరికీ ఇచ్చే పరిస్థితి కూడా లేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పేదలకు ఉచితంగా భూములు ఇచ్చే ఆలోచన ఉన్నప్పటికీ.. ఇచ్చే పరిస్థితి లేదని.. ప్రభుత్వం దగ్గర భారీ భూ బ్యాంక్ ఉన్నట్టుగా జరుగుతున్న ప్రచారంలోనూ నిజం లేదని అన్నారు. ఏ సామాజికవర్గం కూడా.. ప్రభుత్వం నుంచి భూములు వస్తాయేమోననే ఆశలను విడనాడాలని ఆయన సూచించారు. అయితే.. అన్ని సామాజికవర్గాల చిన్నారులకు.. చదువుకునేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు.
ఆదివారం బంజారాల దేవుడు.. సంత్ శ్రీసేవాలాల్ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన గత బీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనులను.. ముఖ్యంగా లంబాడాలను మోసం చేసిందన్నారు. అధికారంలోకి రాగానే బంజారాలకు.. భూములు ఇస్తామని హామీ ఇచ్చి.. ఎగ్గొట్టారని, వారికి మాత్రం ఎక్కడికక్కడ ఎకరాలకు ఎకరాల భూములు సంపాయించుకుని విల్లాలు, ఫామ్ హౌస్లు కట్టుకు న్నారని దుయ్యబట్టారు.
చదువును మించిన ఆస్తి లేదన్న సీఎం రేవంత్.. బంజారాల పిల్లలు చదువుకుంటామంటే.. ఎంత వరకైనా చదివించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. వాస్తవానికి పేదరికం అంటే.. ఆస్తులు లేకపోవడం కాదని.. చదువు లేకపోవడమే కారణమని చెప్పారు. “ఒకాయనకి.. 20 ఎకరాల భూమి ఉంది. కానీ, తెల్లారిలే స్తే.. గొర్రెలు, మేకలు తోలుకుపోతాడు. ఆయనకు ఆస్తి లేదా? అంటే.. ఉంది. కానీ, పేదరికంలోనే ఉన్నాడు. దీనికి కారణం చదువు లేకపోవడమే” అని రేవంత్ వ్యాఖ్యానించారు.
ఎస్సీ వర్గీకరణ..
ఎస్సీ వర్గీకరణ చేయడం ద్వారా ఆయా సామాజిక వర్గాలకు మేలు చేశామని రేవంత్ రెడ్డి చెప్పారు. తండాల్లో పాఠశాలల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలోని అన్ని తండాలకు బీటీ రోడ్లు వేయాలని నిర్ణయించామన్నారు. అదేవిధంగా విద్యుత్ సౌకర్యం, విద్య వంటివాటిని చేరువ చేస్తామన్నా రు. ఇక, తాము పాలకులం కాదని.. సేవకులం కాదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం గమనార్హం.
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…
సంగీత ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తూ గాన కోకిల ఎస్ జానకి చివరి శ్వాస తీసుకున్నారు. గత కొంత కాలంగా…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాబాద్లో ఓ వ్యక్తి ఆరుగురిని…
ఏపీలో ఆసక్తి రేకెత్తించిన జోసెఫ్ రావణ్ అలియాస్ ప్రశ్న రావణ్ వ్యవహారంపై కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. జనసేన అదినేత,…
అమెరికా అధ్యక్షుడి హోదాలో డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న విచిత్రమైన నిర్ణయాలతో ఆ దేశ ప్రజలతో పాటు ఆ దేశంలోని విదేశీయులు నానా ఇబ్బందులు పడుతున్నారు.…
విహార యాత్రల్లో ప్రమాదం జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటిదే ఇప్పుడు వియత్నాంలో జరిగింది. వియత్నాంలో…