దేశవ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు ఆదివారం జరగనున్నాయి. అన్ని శివాలయాల్లోనూ ఈ వేడుకలు నిర్వహించేందుకు భక్తులు సిద్ధమయ్యారు. అయితే.. ఏపీ అసెంబ్లీలో ఒక రోజు ముందుగానే మహా శివరాత్రి ముచ్చట కనిపించింది. టీడీపీ సహా కూటమిలోని అన్ని పార్టీలకు చెందిన మహిళా మంత్రులు, ఎమ్మె ల్యేలు(ఒకరిద్దరు మినహా) మహా శివరాత్రిని తలపించే వస్త్ర ధారణతో హాజరయ్యారు. శివరాత్రి రోజు శివత త్వంతో కూడిన వస్త్రాలను ధరిస్తారు.
అచ్చంగా అలాంటి వస్త్రాలనే ధరించిన మహిళా నాయకులు సభకు వచ్చారు. బడ్జెట్ ప్రసంగం సహా.. ఇతర కార్యక్రమాల్లోనూ.. ఆ వస్త్రాలతోనే సభలో కూర్చున్నారు. మహిళా నేతలు.. ముదురు ఎరుపు రంగు బ్లౌజ్లు, అదే రంగు బార్డర్తో ఉన్న కాషాయ చీరలను ధరించారు. ఈ రంగును శివతత్వానికి ప్రతీకగా భావిస్తారు. వీటిని మంగళగిరిలోని చేనేత కార్మికులు రూపొందించినట్టు తెలిసింది. అంతేకాదు.. మంత్రి నారా లోకేష్ ఈ చీరలను మహిళలకు కానుకగా ఇచ్చారు.
దీంతో అందరూ శనివారమే ఈ వస్త్రాలను ధరించి అసెంబ్లీకి రావడంతో ముందస్తు శివరాత్రి వేడుకలు నిర్వహించినట్టుగా అసెంబ్లీ ప్రాంగణం కనిపించింది. వీరు అవే వస్త్ర ధారణలతో సీఎం చంద్రబాబును, మంత్రి నారా లోకేష్, స్పీకర్ అయ్యన్న పాత్రుడులను కలుసుకున్నారు. మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. కాగా.. వాస్తవానికి ఆదివారం మహా శివరాత్రి కావడంతో ఆ రోజు.. సభకు సెలవు ప్రకటించారు.
దీంతోపాటు సోమవారం కూడా.. సభకు సెలవు కావడంతో శనివారమే మహిళా నేతలు ఇలా శివతత్వాన్ని తెలిపే వస్త్రాలతో సభకు రావడం గమనార్హం. ఇలా.. ఒకే రకమైన వస్త్రాలు ధరించి సభకురావడం ఇదే తొలిసారి కూడా కావడం మరో విశేషం. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ మహిళా నేతలు ఈ విధంగా ప్రత్యేకతను చాటడంపై సీఎం చంద్రబాబు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు సంతోషం వ్యక్తం చేశారు.
This post was last modified on February 15, 2026 12:09 pm
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…